కరోనా సమయంలో దర్శకుడు సుకుమార్, విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. స్టోరీ లైన్ సెట్టవ్వగనే “రాంపేజ్” అంటూ సుకుమార్తో దిగిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ కాంబినేషన్ పక్కా తెరపైకి వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఇండస్ట్రీలో అన్ని అనుకున్నట్లు జరిగే అవకాశాలు తక్కువ కాబట్టి అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.
అసలే సుకుమార్ మేకింగ్ కోసం ఏ రేంజ్ టైమ్ తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి కంటే భిన్నమైన పని రక్షసుడిలా మారిపోతున్నాడు. ఎందుకంటే బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నా కూడా పుష్ప 2 అనుకున్న సమయానికి సిద్ధం కాలేదు. ఇప్పటికే ఒకసారి రిలీజ్ డేట్ కూడా మారింది.
ఇక సుకుమార్, పుష్ప 2 తరువాత రామ్ చరణ్ ప్రాజెక్టును లైన్ లో పెట్టనున్నాడు. ఆ సినిమాకు మూడేళ్ళ టైమ్ పట్టినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలే రంగస్థలం కాంబో కాబట్టి లెక్కలు అంచనాలు ఆకాశాన్ని దాటేస్తాయి. దీంతో సుక్కు మునుపటి కంటే ఎక్కువ టైమ్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే పుష్ప 3 కూడా ఉండవచ్చని ఆమధ్య ఒక హింట్ ఇచ్చారు. దాంతో విజయ్ దేవరకొండ ర్యాంపేజ్ అసలు ఎప్పుడు ఉంటుందనేది మిస్టరీగా మారింది.
విజయ్ ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇక ఆ లోపు సుక్కు చరణ్ ప్రాజెక్టును ఫినిష్ చేసి దేవరకొండ ర్యాంపేజ్ పై ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ పుష్ప 2 వెయ్యి కోట్లు, రామ్ చరణ్ ప్రాజెక్టు కూడా అదే రేంజ్ లో హిట్టయితే మాత్రం దేవరకొండ సుక్కు కాంబోపై అసలు డౌట్ క్రియేట్ అవుతుంది. అసలే పాన్ ఇండియా అగ్ర హీరోలు సుక్కు ఎప్పుడు దొరుకుతాడా అని కాచుకొని ఉన్నారు.
లైగర్ సక్సెస్ అయ్యి ఉంటే సుక్కు ఈజీగా లైన్ లోకి వచ్చేవారేమో. సుక్కు లాంటి డైరెక్టర్ తో ఛాన్స్ అందుకోవాలి అంటే విజయ్ ఆ లోపు సాలీడ్ హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. ఇక వెయ్యి కోట్లు కొట్టగలిగితే సుక్కుని అగ్ర హీరోలు లాగే అవకాశం కూడా లేకపోలేదు. మరి విజయ్ కు ఇచ్చిన మాట ప్రకారం సుక్కు డైవర్ట్ కాకుండా ర్యాంపేజ్ ను సెట్స్ పైకి తీసుకు వస్తాడో లేదో చూడాలి.
This post was last modified on October 11, 2024 10:11 am
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…