కరోనా సమయంలో దర్శకుడు సుకుమార్, విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. స్టోరీ లైన్ సెట్టవ్వగనే “రాంపేజ్” అంటూ సుకుమార్తో దిగిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ కాంబినేషన్ పక్కా తెరపైకి వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఇండస్ట్రీలో అన్ని అనుకున్నట్లు జరిగే అవకాశాలు తక్కువ కాబట్టి అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.
అసలే సుకుమార్ మేకింగ్ కోసం ఏ రేంజ్ టైమ్ తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి కంటే భిన్నమైన పని రక్షసుడిలా మారిపోతున్నాడు. ఎందుకంటే బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నా కూడా పుష్ప 2 అనుకున్న సమయానికి సిద్ధం కాలేదు. ఇప్పటికే ఒకసారి రిలీజ్ డేట్ కూడా మారింది.
ఇక సుకుమార్, పుష్ప 2 తరువాత రామ్ చరణ్ ప్రాజెక్టును లైన్ లో పెట్టనున్నాడు. ఆ సినిమాకు మూడేళ్ళ టైమ్ పట్టినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలే రంగస్థలం కాంబో కాబట్టి లెక్కలు అంచనాలు ఆకాశాన్ని దాటేస్తాయి. దీంతో సుక్కు మునుపటి కంటే ఎక్కువ టైమ్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే పుష్ప 3 కూడా ఉండవచ్చని ఆమధ్య ఒక హింట్ ఇచ్చారు. దాంతో విజయ్ దేవరకొండ ర్యాంపేజ్ అసలు ఎప్పుడు ఉంటుందనేది మిస్టరీగా మారింది.
విజయ్ ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇక ఆ లోపు సుక్కు చరణ్ ప్రాజెక్టును ఫినిష్ చేసి దేవరకొండ ర్యాంపేజ్ పై ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ పుష్ప 2 వెయ్యి కోట్లు, రామ్ చరణ్ ప్రాజెక్టు కూడా అదే రేంజ్ లో హిట్టయితే మాత్రం దేవరకొండ సుక్కు కాంబోపై అసలు డౌట్ క్రియేట్ అవుతుంది. అసలే పాన్ ఇండియా అగ్ర హీరోలు సుక్కు ఎప్పుడు దొరుకుతాడా అని కాచుకొని ఉన్నారు.
లైగర్ సక్సెస్ అయ్యి ఉంటే సుక్కు ఈజీగా లైన్ లోకి వచ్చేవారేమో. సుక్కు లాంటి డైరెక్టర్ తో ఛాన్స్ అందుకోవాలి అంటే విజయ్ ఆ లోపు సాలీడ్ హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. ఇక వెయ్యి కోట్లు కొట్టగలిగితే సుక్కుని అగ్ర హీరోలు లాగే అవకాశం కూడా లేకపోలేదు. మరి విజయ్ కు ఇచ్చిన మాట ప్రకారం సుక్కు డైవర్ట్ కాకుండా ర్యాంపేజ్ ను సెట్స్ పైకి తీసుకు వస్తాడో లేదో చూడాలి.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…