ఇంకో పంతొమ్మిది రోజుల్లో అక్టోబర్ 23 డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు రానుంది. ఈ సందర్భంగా ఎలాంటి కానుకలు ఉంటాయనే దాని మీద ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటిది ది రాజా సాబ్ నుంచి లిరికల్ సాంగ్ లేదా కొత్త టీజర్ కానీ వస్తుందనే అంచనాలున్నాయి. విడుదల తేదీ ఏప్రిల్ 10 ఇంకా దూరం ఉన్నప్పటికీ నెక్స్ట్ ప్రభాస్ రిలీజ్ ఇదే కాబట్టి ఒక కీలక అప్ డేట్ అయితే రావాలి. దర్శకుడు మారుతీ దీని కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు తెలిసింది. షూటింగ్ చివరి దశలో ఉన్న నేపథ్యంలో ఏ కంటెంట్ ఇవ్వాలనే దాని గురించి పెద్దగా టెన్షన్ అక్కర్లేదు. ఏది ఇవ్వాలనేది కీలకం.
హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందబోయే ఫౌజీ (ప్రచారంలో ఉన్న టైటిల్) ఫస్ట్ లుక్ రావొచ్చని ఇన్ సైడ్ టాక్. ప్రభాస్ ని ఎప్పుడూ చూడని సరికొత్త మేకోవర్ లో చూడబోతున్నామనే సమాచారం అభిమానులను ఎగ్జైట్ చేస్తోంది. ఇక స్పిరిట్ గురించి విజువల్ లేకుండా ప్రత్యేక ఆడియో అనౌన్స్ మెంట్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నాడట. ఖచ్చితంగా ఉంటుందో లేదో ఇప్పుడే చెప్పలేం. ఇక కల్కి 2కి సంబంధించిన కీలకమైన అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ కొట్టిపారేయలేం. అయితే రిలీజ్ డేట్, ఏ సంవత్సరం లాంటివి ఆశించకుండా ఉంటే బెటర్.
ఇక సలార్ 2 శౌర్యంగ పర్వం నుంచి కేవలం విషెస్ తప్ప ఇంకేమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా పూర్తి చేసుకుని ఎప్పుడు అందుబాటులోకి వస్తాడనే దాని మీద సరైన సమాచారం ఇంకా లేదు. సో సలార్ 1 స్టిల్ తోనే శుభాకాంక్షలు చెబుతారట. ఇవి కాకుండా ఇంకెలాంటి సర్ప్రైజ్ ఉండకపోవచ్చు. అయినా కడుపు నిండిపోయేలా ఇన్ని అప్డేట్స్ ఇస్తే ఇంతకన్నా ఏం కావాలి. ఇక రీ రిలీజుల సంగతి చూస్తే ఈశ్వర్, డార్లింగ్ రెండూ పోటాపోటీగా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. నిన్న చక్రం విడుదల చేస్తే ఎవరూ పట్టించుకోలేదు.
This post was last modified on October 4, 2024 6:42 pm
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…