ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. ‘ఓరియన్’ అని పిలుచుకుంటున్న ఈ రోబోను తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో సొంతంగా తయారు చేశామని ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు మీడియా ముందు చెప్పడం ఈ గొడవకు కారణమైంది. అయితే అది చూసిన నెటిజన్లు, ఇది చైనాకు చెందిన ‘Unitree’ కంపెనీ తయారు చేసిన రోబో అని, ఆన్లైన్లో కేవలం రెండు మూడు లక్షలకే దొరుకుతుందని ఆధారాలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
ఈ వివాదం ఎంత ముదిరిందంటే, చైనా టెక్నాలజీని తమదిగా చెప్పుకుని దేశ పరువు తీశారనే కారణంతో ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఆ యూనివర్సిటీ స్టాల్ను ఖాళీ చేయమని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఒకవైపు ప్రొఫెసర్ దీనిని మేమే తయారు చేశామని చెబుతుంటే, మరోవైపు యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం అసలు తాము అలా ఎప్పుడూ క్లెయిమ్ చేయలేదని రివర్స్ గేర్ వేసింది. దీనివల్ల అసలు నిజమేంటో తెలియక చాలామంది గందరగోళానికి గురయ్యారు.
చివరకు గల్గోటియాస్ యూనివర్సిటీ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. తాము ఈ రోబోను తయారు చేయలేదని, విద్యార్థులు నేర్చుకోవడానికి చైనా నుంచి కొనుగోలు చేశామని ఒప్పుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అధునాతన టెక్నాలజీని క్యాంపస్కు తీసుకురావడం ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని, భవిష్యత్తులో మన దేశంలోనే ఇలాంటి రోబోలను తయారు చేసే మేధావులను తాము తీర్చిదిద్దుతున్నామని సర్దిచెప్పుకొచ్చింది.
యూనివర్సిటీ వివరణ ఎలా ఉన్నా, చైనా రోబోకు భారత్ పేరు పెట్టి ప్రదర్శించడంపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. ఇన్వొవేషన్ అంటే కొత్తగా కనిపెట్టడం కానీ, వేరే దేశాల ప్రొడక్టులను తెచ్చి మనవని చెప్పుకోవడం కాదని నెటిజన్లు చురకలు వేస్తున్నారు. విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచడం మంచిదే అయినా, నిజాయితీగా అది ఎక్కడి నుంచి వచ్చిందో చెబితే ఇంత గొడవ జరిగేది కాదని మరికొందరు భావిస్తున్నారు.
దర్శకుడు సురేందర్ రెడ్డి పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. కారణం పవన్ కళ్యాణ్ అంగీకారం వస్తే సినిమా మొదలుపెట్టాలి. ఈ…
ఏపీలో ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆసక్తికరం. శుక్రవారం(జూన్…
దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…