కేవలం ఒక్క రోజు గ్యాప్ లో శ్రీవిష్ణు రెండు సినిమాలు రిలీజ్ కానుండటం గురించి అభిమానుల కంటే ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఎంత మాత్రం సేఫ్ కాదు. అసలే జనాలు థియేటర్లకు పెద్దగా రావడం లేదు. పిల్లలు, యువత పరీక్షల మూడ్ లో ఉన్నారు.
అలాంటప్పుడు ఒకే హీరో నుంచి డబుల్ డోస్ వస్తే దాన్ని బాక్సాఫీస్ ఏ మేరకు అంగీకరిస్తుందనేది పెద్ద సవాల్. విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ రెండూ నువ్వా నేనా అనేలా ఢీ కొట్టేందుకు రెడీ కావడం ఊహించని ట్విస్టు. అయితే ఫ్యాన్స్ రిలీఫ్ అయ్యేలా ఒక కీలక పరిణామం చోటు చేసుకోవచ్చని అంటున్నారు.
దాని ప్రకారం మృత్యుంజయ్ ఈ క్లాష్ నుంచి తప్పుకుని మార్చి 6కి వెళ్లడం దాదాపు ఖాయమని ఫిలిం నగర్ టాక్. ముందుగా ఒప్పందం జరిగినప్పటికీ ఓటిటి సంస్థతో మాట్లాడుకుని ఈ మేరకు నిర్ణయం మార్చుకున్నారని వినికిడి. దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇవాళ జరిగే విష్ణు విన్యాసం ట్రైలర్ లాంచ్ లో ఉండొచ్చని అంటున్నారు.
ఒకవేళ నిజమే అయితే శ్రీవిష్ణుకి పెద్ద ఊరట దక్కినట్టే. ఎందుకంటే కేవలం పది రోజుల వ్యవధిలో రెండు సినిమాలకు ప్రమోషన్లు చేయడం చాలా కష్టం. పైగా ఒకదాని కోసం ప్రచారం చేస్తే ఇంకోదాని గురించి అడిగే ప్రమాదమున్న నేపథ్యంలో ఇలా సేఫ్ గేమ్ ఆడటం అందరికీ మంచిది.
వేర్వేరు జానర్లు అయినప్పటికీ విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ మీద కంటెంట్ పరంగా మంచి అంచనాలు ఉన్నాయి. ఒకటి ఎంటర్ టైనర్ కాగా మరొకటి క్రైమ్ థ్రిల్లర్. శ్రీవిష్ణు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. గత ఏడాది సింగిల్ రూపంలో డీసెంట్ సక్సెస్ అందుకున్నాక మరో పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న టైంలో ఇలా జరగడం శ్రీవిష్ణుకి తొలుత ఖంగారు కలిగించింది.
ఏం చేయలేని నిస్సహాయతలో ఈ మాత్రం మార్పు జరగడం శుభ పరిణామం. అఫీషియల్ అయ్యాక మరింత క్లారిటీ వస్తుంది కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయాలి. వచ్చే వారం ఫిబ్రవరి 27 విష్ణు విన్యాసం, మార్చి 6 మృత్యుంజయ్ దాదాపు ఫిక్సైనట్టేనని టాక్.
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…