కల్కిలో చూపించింది వేరు, నిజమైన మహాభారతంలో ఉన్నది వేరంటూ గరికపాటి నరసింహారావు గారు ఒక ప్రసంగంలో చేసిన కామెంట్లు వీడియో రూపంలో తెగ వైరలవుతున్నాయి. ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తే రచయిత ఏదైనా రాస్తాడని, సినిమావాళ్ళు ఏది చూపిస్తే అదే నిజమైపోతుందని, అశ్వద్ధామ కర్ణుడు హీరోలైపోగా మిగిలినవాళ్ళు విలన్లా అంటూ ప్రశ్న రేకెత్తించడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. హీరోలు, సినిమాల మీద ఆయన విమర్శలు చేయడం కొత్తేమి కాదు కానీ ఒక ధార్మిక ప్రవచనంలో కల్కి 2898 ఏడి గురించి ప్రస్తావించడం ఫ్యాన్స్ మధ్య చర్చకు దారి తీసింది.
నిజానికి కల్కి 2898 ఏడి నిజంగా జరిగిన కథని దర్శకుడు నాగ్ అశ్విన్ ఎక్కడ చెప్పలేదు. భారతాన్ని తీసుకుని కాల్పనికత జోడించడం ఎప్పటి నుంచో వుంది. అలనాటి మేటి క్లాసిక్ మాయాబజార్ లో చూపించిన కొన్ని ఘటనలు ఇతిహాసంలో లేవు. ఎస్వి కృష్ణారెడ్డి తీసిన ఘటోత్ఘచుడులోనూ దీనికి సంబంధించిన ఫాంటసీ టచ్ ఉంటుంది. జగదేకవీరుడు అతిలోకసుందరిలో ఇంద్రుడి కూతురు ఇంద్రజ భూమి మీదకు వచ్చినట్టు చూపించారు. అది నిజం కాదే. యమగోలలో ఎన్టీఆర్ ఏకంగా దేవేంద్రుడికి క్లాస్ తీసుకోవడం ఏ పురాణాల్లో చదవలేదే. ఇదంతా క్రియేటివ్ ఫ్రీడమ్ కిందకు వస్తుంది.
వీటి వల్ల మనోభావాలు దెబ్బ తినడం లాంటివి జరగలేదు. తప్పని ఎవరూ వేలెత్తి చూపలేదు. కల్కి కూడా ఆ కోవలోకే వస్తుంది. దుర్యోధన, కర్ణ స్నేహాన్ని హైలైట్ చేసిన స్వర్గీయ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ ఇండస్ట్రీ హిట్ అయితే ఉన్నదున్నట్టు తీసిన కృష్ణ కురుక్షేత్రం ఆడలేదు. రెండూ ఒకే కథలే. ప్రేక్షకులు దేన్ని అంగీకరిస్తారు దేన్ని తిరస్కరిస్తారనే దాన్ని బట్టి హిట్టు ఫ్లాపు ఆధారపడి ఉంటుంది. కల్కి వేయి కోట్లు ఊరికే వసూలు చేయలేదుగా. హిందీ నుంచి తెలుగు దాకా అన్ని భాషల్లోనూ అంగీకారం దక్కింది కాబట్టే బ్లాక్ బస్టర్ నమోదయ్యింది. లాజిక్స్ వెతికే పని పెట్టుకుంటే ఎలా.
This post was last modified on September 23, 2024 10:59 am
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…