కల్కిలో చూపించింది వేరు, నిజమైన మహాభారతంలో ఉన్నది వేరంటూ గరికపాటి నరసింహారావు గారు ఒక ప్రసంగంలో చేసిన కామెంట్లు వీడియో రూపంలో తెగ వైరలవుతున్నాయి. ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తే రచయిత ఏదైనా రాస్తాడని, సినిమావాళ్ళు ఏది చూపిస్తే అదే నిజమైపోతుందని, అశ్వద్ధామ కర్ణుడు హీరోలైపోగా మిగిలినవాళ్ళు విలన్లా అంటూ ప్రశ్న రేకెత్తించడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. హీరోలు, సినిమాల మీద ఆయన విమర్శలు చేయడం కొత్తేమి కాదు కానీ ఒక ధార్మిక ప్రవచనంలో కల్కి 2898 ఏడి గురించి ప్రస్తావించడం ఫ్యాన్స్ మధ్య చర్చకు దారి తీసింది.
నిజానికి కల్కి 2898 ఏడి నిజంగా జరిగిన కథని దర్శకుడు నాగ్ అశ్విన్ ఎక్కడ చెప్పలేదు. భారతాన్ని తీసుకుని కాల్పనికత జోడించడం ఎప్పటి నుంచో వుంది. అలనాటి మేటి క్లాసిక్ మాయాబజార్ లో చూపించిన కొన్ని ఘటనలు ఇతిహాసంలో లేవు. ఎస్వి కృష్ణారెడ్డి తీసిన ఘటోత్ఘచుడులోనూ దీనికి సంబంధించిన ఫాంటసీ టచ్ ఉంటుంది. జగదేకవీరుడు అతిలోకసుందరిలో ఇంద్రుడి కూతురు ఇంద్రజ భూమి మీదకు వచ్చినట్టు చూపించారు. అది నిజం కాదే. యమగోలలో ఎన్టీఆర్ ఏకంగా దేవేంద్రుడికి క్లాస్ తీసుకోవడం ఏ పురాణాల్లో చదవలేదే. ఇదంతా క్రియేటివ్ ఫ్రీడమ్ కిందకు వస్తుంది.
వీటి వల్ల మనోభావాలు దెబ్బ తినడం లాంటివి జరగలేదు. తప్పని ఎవరూ వేలెత్తి చూపలేదు. కల్కి కూడా ఆ కోవలోకే వస్తుంది. దుర్యోధన, కర్ణ స్నేహాన్ని హైలైట్ చేసిన స్వర్గీయ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ ఇండస్ట్రీ హిట్ అయితే ఉన్నదున్నట్టు తీసిన కృష్ణ కురుక్షేత్రం ఆడలేదు. రెండూ ఒకే కథలే. ప్రేక్షకులు దేన్ని అంగీకరిస్తారు దేన్ని తిరస్కరిస్తారనే దాన్ని బట్టి హిట్టు ఫ్లాపు ఆధారపడి ఉంటుంది. కల్కి వేయి కోట్లు ఊరికే వసూలు చేయలేదుగా. హిందీ నుంచి తెలుగు దాకా అన్ని భాషల్లోనూ అంగీకారం దక్కింది కాబట్టే బ్లాక్ బస్టర్ నమోదయ్యింది. లాజిక్స్ వెతికే పని పెట్టుకుంటే ఎలా.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…