శర్వానంద్‍ కోసం మళ్లీ సాయి పల్లవి దిగుతోంది!

అప్పట్లో సాయి పల్లవికి వున్న క్రేజ్‍ రీత్యా ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో శర్వానంద్‍ హిట్‍ కొట్టేస్తాడనే అనుకున్నారు. కానీ ఆ చిత్రం సెకండాఫ్‍ సిండ్రోమ్‍కి గురయి బాక్సాఫీస్‍ వద్ద డిజాస్టర్‍ అయింది. అయితే శర్వా, సాయి పల్లవి జంట బాగుందనే టాక్‍ వరకు తెచ్చుకోగలిగింది. ఈ జంటను మళ్లీ తెర మీదకు తెచ్చే ప్రయత్నాల్లో వున్నాడట కిషోర్‍ తిరుమల.

చిత్రలహరి తర్వాత రామ్‍తో రెడ్‍ తీసిన కిషోర్‍ ఆమధ్య వెంకటేష్‍తో ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ అనే సినిమా చేద్దామని చూసాడు. కానీ ఎందుకో ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు అదే కథను శర్వానంద్‍కు అనుగుణంగా మార్చి అతడికి చెప్పాడని, శర్వానంద్‍కి కథ నచ్చిందని సమాచారం. శ్రీకారం, మహాసముద్రం సినిమాల తర్వాత శర్వానంద్‍ ఇదే సినిమా మొదలు పెడతాడట. ఈ చిత్రంలో హీరోయిన్‍ క్యారెక్టర్‍ చాలా ఇంపార్టెంట్‍ కనుక సాయి పల్లవి అయితే బెస్ట్ అని కిషోర్‍ భావిస్తున్నాడట.

ఇప్పటికే ఆమెతో ఫోన్‍ ద్వారా సంప్రదింపులు జరిపారని, ఆమె పూర్తి కథ విని గ్రీన్‍ సిగ్నల్‍ ఇచ్చేస్తే ఈ ప్రాజెక్ట్ అఫీషియల్‍గా అనౌన్స్ అవుతుందని వార్తలొస్తున్నాయి. కొంత కాలం పాటు సాయి పల్లవి డిమాండ్‍ తగ్గినట్టే అనిపించినా ఇప్పుడు చాలా సినిమాలకు ఆమెనే కథానాయికగా కన్సిడర్‍ చేస్తున్నారు. పర్‍ఫార్మెన్స్ కి స్కోప్‍ వున్న క్యారెక్టర్‍ అనగానే సాయి పల్లవినే ప్రిఫర్‍ చేస్తున్నారు.