అరవింద సమేత వీరరాఘవ తర్వాత ఆరేళ్ళ గ్యాప్ తో సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన సినిమా దేవర. దీని మీదున్న అంచనాల గురించి మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ కావడంతో అభిమానులు దేవర పట్ల విపరీతమైన ఎగ్జైట్ మెంట్ తో ఉన్నారు. దానికి తగ్గట్టే అనిరుధ్ రవిచందర్ పాటలు ప్రేక్షకుల్లో వేగంగా వెళ్లడంతో సెప్టెంబర్ 27 కోసం ఎదురు చూపులు మరింత భారమయ్యాయి. ఈ నేపథ్యంలో అందరి చూపు ట్రైలర్ మీదే ఉంది. ముంబైలో తారక్, జాన్వీ, సైఫ్ అలీఖాన్ తో పాటు టీమ్ మొత్తం హాజరైన గ్రాండ్ ఈవెంట్ లో అధికారికంగా లాంచ్ చేశారు. కంటెంట్ ఏంటో చెప్పేశారు.
సముద్రపు ఒడ్డున ఉంటూ నీటితల్లి మీద బ్రతికే ఆ ఊరి జనాలకు ధైర్యం తప్ప ఇంకేమి తెలియని మనస్తత్వం. వాళ్ళకు అండగా, నాయకుడిగా ఉంటాడు దేవర (జూనియర్ ఎన్టీఆర్). స్నేహితుడు భైర (సైఫ్ అలీ ఖాన్) అండతో అందరనీ కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటాడు. అయితే ఓ రోజు ప్రమాదం ముంచుకొచ్చి దేవర గూడెంలో భయం మొదలవుతుంది. నెత్తురు ఏరులై పారుతుంది. దీనికి కారణమైన వాళ్ళ అంతు చూసేందుకు వెళ్లిన దేవరకు వయసొచ్చిన కొడుకు (జూనియర్ ఎన్టీఆర్) ఉంటాడు. ఇతనికి పిల్లతనం, పిరికితనం ఎక్కువ. అసలా తీరంలో జరిగిన రక్తపాతం వెనుక ఏం జరిగిందనేది కథ.
దర్శకుడు కొరటాల శివ తీసుకున్న నేపథ్యంలో హింసతో పాటు అంతే మోతాదులో భావోద్వేగాలను జొప్పించినట్టు కనిపిస్తోంది. తండ్రి కొడుకులుగా తారక్ డ్యూయల్ రోల్ చేసిన విషయాన్ని దాచకుండా చెప్పేశారు. విజువల్స్ కట్టిపడేసేలా ఉన్నాయి. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్, సుప్రీత్ ఇలా పెద్ద క్యాస్టింగే ఉంది. దేవరగా జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ అంచనాలకు మించి ఉండగా జాన్వీ కపూర్ అల్లరి వినోదానికి ఉపయోగపడుతోంది. అనిరుధ్ రవిచందర్ బీజీఎమ్ లో పనితనం వినిపించింది. దేవరని ఎలా చూడాలని కోరుకుంటున్నారో దానికి తగ్గట్టే ఉన్నాడు కనక హైప్ మరింత పెరగడం ఖాయం.
This post was last modified on September 10, 2024 5:32 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…