సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రభావం ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో ఉంటుందో కొత్తగా చెప్పనక్కర్లేదు. కానీ కోట్లాది పారితోషికాలు ఇచ్చి బ్రాండ్ అంబాసడర్ గా నియమించుకుని యాడ్స్ చేసే సంస్థలు ఏ మేరకు లాభాలు గడిస్తాయోననే సందేహం సామాన్యుల్లో ఉండటం సహజం. ఎందుకంటే సినిమా వేరు, వ్యాపారం వేరు. ఒక హీరో చెప్పినంత మాత్రాన గుడ్డిగా ఏదైనా వస్తువు లేదా సేవలు కొనుగోలు చేసే కస్టమర్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కేవలం ఒక సెలబ్రిటీనే మొత్తం మార్చేస్తాడని గ్యారెంటీ లేదు. అయినా కూడా మహేష్ బాబు ఈ విషయంలో తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నాడనే దానికి ఈ ఉదాహరణ చాలు.
ఆన్ లైన్ బస్సు టికెట్లు అమ్మే యాప్ అభి బస్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ కంపెనీ మొదలైన తొలినాళ్ళలో అంతగా స్పందన ఉండేది కాదు. దీంతో కేవలం మార్కెటింగ్ చేస్తే సరిపోదని, ఏదైనా పెద్దగా ఆలోచించాలని భావించి ఒక నెంబర్ వన్ హీరో ద్వారా అయితే ప్రజలకు త్వరగా తమ గురించి తెలుస్తుందని 2016లో మహేష్ బాబుతో ఒప్పందం చేసుకున్నారు. అప్పటిదాకా రోజుకు 3 వేల టికెట్లు అమ్ముడుపోయే పరిస్థితి నుంచి ఏడాది తిరిగేలోపు రోజుకు 20 వేల టికెట్లకు పైగా అమ్ముకునే రేంజ్ కు చేరుకుంది. కామన్ మ్యాన్ కూడా సులభంగా గుర్తుపట్టేలా మహేష్ అభిబస్ ని చేరువ చేశాడు.
ఇదంతా స్వయంగా అభిబస్ వ్యవస్థాపకుడైన సుధాకర్ రెడ్డి చిర్ర ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడంతో బయటికి వచ్చింది. ఇప్పటికీ మహేష్ తో వాళ్ళ బంధం కొనసాగుతూ ఉంది. అదనంగా రాజేంద్రప్రసాద్ లాంటి సీనియర్ నటుడు తోడయ్యారు. ఏది ఏమైనా బ్రాండ్ ఎండార్స్ మెంట్ కు టాలీవుడ్ హీరోలు తీసుకొచ్చే కళ వేరుగా ఉంటుంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇలా ఎందరో తమ ఇమేజ్ తో బ్రాండ్లను అమాంతం పైకి తీసుకొచ్చిన దాఖలాలు ఎన్నో. కాకపోతే మహేష్ బాబు చేస్తున్నన్ని యాడ్స్ మాత్రం ఎవరికీ లేవు.
This post was last modified on September 10, 2024 5:37 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…