సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రభావం ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో ఉంటుందో కొత్తగా చెప్పనక్కర్లేదు. కానీ కోట్లాది పారితోషికాలు ఇచ్చి బ్రాండ్ అంబాసడర్ గా నియమించుకుని యాడ్స్ చేసే సంస్థలు ఏ మేరకు లాభాలు గడిస్తాయోననే సందేహం సామాన్యుల్లో ఉండటం సహజం. ఎందుకంటే సినిమా వేరు, వ్యాపారం వేరు. ఒక హీరో చెప్పినంత మాత్రాన గుడ్డిగా ఏదైనా వస్తువు లేదా సేవలు కొనుగోలు చేసే కస్టమర్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కేవలం ఒక సెలబ్రిటీనే మొత్తం మార్చేస్తాడని గ్యారెంటీ లేదు. అయినా కూడా మహేష్ బాబు ఈ విషయంలో తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నాడనే దానికి ఈ ఉదాహరణ చాలు.
ఆన్ లైన్ బస్సు టికెట్లు అమ్మే యాప్ అభి బస్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ కంపెనీ మొదలైన తొలినాళ్ళలో అంతగా స్పందన ఉండేది కాదు. దీంతో కేవలం మార్కెటింగ్ చేస్తే సరిపోదని, ఏదైనా పెద్దగా ఆలోచించాలని భావించి ఒక నెంబర్ వన్ హీరో ద్వారా అయితే ప్రజలకు త్వరగా తమ గురించి తెలుస్తుందని 2016లో మహేష్ బాబుతో ఒప్పందం చేసుకున్నారు. అప్పటిదాకా రోజుకు 3 వేల టికెట్లు అమ్ముడుపోయే పరిస్థితి నుంచి ఏడాది తిరిగేలోపు రోజుకు 20 వేల టికెట్లకు పైగా అమ్ముకునే రేంజ్ కు చేరుకుంది. కామన్ మ్యాన్ కూడా సులభంగా గుర్తుపట్టేలా మహేష్ అభిబస్ ని చేరువ చేశాడు.
ఇదంతా స్వయంగా అభిబస్ వ్యవస్థాపకుడైన సుధాకర్ రెడ్డి చిర్ర ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడంతో బయటికి వచ్చింది. ఇప్పటికీ మహేష్ తో వాళ్ళ బంధం కొనసాగుతూ ఉంది. అదనంగా రాజేంద్రప్రసాద్ లాంటి సీనియర్ నటుడు తోడయ్యారు. ఏది ఏమైనా బ్రాండ్ ఎండార్స్ మెంట్ కు టాలీవుడ్ హీరోలు తీసుకొచ్చే కళ వేరుగా ఉంటుంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇలా ఎందరో తమ ఇమేజ్ తో బ్రాండ్లను అమాంతం పైకి తీసుకొచ్చిన దాఖలాలు ఎన్నో. కాకపోతే మహేష్ బాబు చేస్తున్నన్ని యాడ్స్ మాత్రం ఎవరికీ లేవు.
This post was last modified on September 10, 2024 5:37 pm
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…