యాట్టిట్యూడ్.. ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్న మాట. మరీ ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ విషయంలో ఆ పార్టీ నేతలు ఏ ఇద్దరు కలిసినా.. “ఆయన యాట్టిట్యూడ్ ఏంటో నాకస్సలు అర్ధం కావట్లేదు” అనే మాటే వినిపిస్తోంది.
ఇదే మాట అధికార పార్టీ నాయకులు జగన్ గురించి చర్చించిన ప్రతిసారీ చెబుతున్నారు. జగన్ యాట్టిట్యూడే అంత! అనే మాట వీరి మధ్య కూడా వినిపిస్తోంది. ఇంతకీ అసలు ఏంటీ జగన్ యాట్టిట్యూడ్? ఎందుకింతగా చర్చకు వచ్చింది?
జగన్ ఆది నుంచి కూడా తన పార్టీని కార్పొరేట్ సంస్థగానే భావిస్తారు. తను పెట్టుకున్న పార్టీ.. తన మాటే శాసనం.. అనే మాటే ఉంటుంది తప్ప.. వేరే మాటే ఉండదు. ఇది వాస్తవం కూడా. కాంగ్రెస్ నుంచి విడి వడి.. సొంతగా జగన్ పార్టీ పెట్టుకున్నారు. దీనిలో ఆయనే రాజు.. ఆయనే మంత్రి. అప్పుడప్పుడు… ఏవైనా నచ్చితే మాత్రమే ఇతరుల అభిప్రాయాలను ఆయన తీసుకుంటారు. లేకపోతే.. తను పెట్టుకున్న సంస్థల నుంచితనకు నచ్చిన విధంగానే ముందుకు సాగుతారు.
ఈ ఏడాది ఎన్నికలకు ముందు చంద్రబాబు పింఛన్ను రూ.4000లకు పెంచుతానని చెప్పారు. దీనిపై కొందరు కీలక వైసీపీ నాయకులు జగన్కు చెప్పారు మనం కూడా పెంచుదామన్నారు. కానీ, ఆయన తన వైఖరినే ప్రదర్శించారు.
ఇక, నాయకులను మార్చే విషయంలోనూ కొందరు వద్దన్నారు. గెలిచే గుర్రా లేనని చెప్పారు. కానీ.. జగన్ తన వైఖరినే అమలు చేశారు. ఫలితం ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే. అయినా.. ఆయన తన యాట్టిట్యూడ్ను మార్చుకోలేక పోయారు.
తాము మంచి చేసి ఓడామని ఒక నినాదం ఇచ్చారు. ఇది అందరికీ నచ్చలేదు. ఇక, పార్టీ నుంచి వెళ్లిపోయే నేతలను కనీసం పిలిచి మాట్లాడాలని.. కొందరు నాయకులు సూచించారు. కానీ, ఇది జగన్ యాటిట్యూడ్కు వ్యతిరేకం. నేను పెట్టుకున్న పార్టీ.. వాళ్లు వచ్చారు అవకాశం ఇచ్చాను. వారు వెళ్తే పోనీ.. వేరేవారికి అవకాశం ఇస్తాను.. అన్న ధోరణిలోనే ఉన్నారు. మరోవైపు.. గత ప్రభుత్వం తప్పులు అంటూ.. ఏం జరిగినా చంద్రబాబు జగన్పై నెట్టేస్తున్నారు.
దీనిని బలంగా ఎదిరించాలని అన్నా.. నాయకుల మాట జగన్ వినిపించుకోవడం లేదు. ఇదీ ఆయన యాట్టిట్యూడేనని అంటున్నారు. అంతా ప్రజలే తెలుసుకుంటారని ఆయన చెబుతున్నారు. దీంతో అసలు జగన్ యాట్టిట్యూడ్ ఏంటో అర్థం కాక.. వైసీపీ నేతలు జుట్టు పీక్కుంటున్నారు.
This post was last modified on September 10, 2024 5:18 pm
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…
ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…
దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…
రెండేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహారాజ త్వరలో హాలీవుడ్ రీమేక్ కాబోతోందన్న వార్త…
సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయమవుతున్న ఎల్లమ్మను నెలల తరబడి వేధించిన సమస్య హీరోయిన్ ఎంపిక. మృణాల్ ఠాకూర్,…
టాలీవుడ్లో ఈ మధ్య రిలీజ్ డేట్ పంచాయితీలు బాాగా పెరిగిపోతున్నాయి. సెప్టెంబరు 24న రావాల్సిన నాని సినిమా ‘ది ప్యారడైజ్’ను…