యాట్టిట్యూడ్.. ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్న మాట. మరీ ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ విషయంలో ఆ పార్టీ నేతలు ఏ ఇద్దరు కలిసినా.. “ఆయన యాట్టిట్యూడ్ ఏంటో నాకస్సలు అర్ధం కావట్లేదు” అనే మాటే వినిపిస్తోంది.
ఇదే మాట అధికార పార్టీ నాయకులు జగన్ గురించి చర్చించిన ప్రతిసారీ చెబుతున్నారు. జగన్ యాట్టిట్యూడే అంత! అనే మాట వీరి మధ్య కూడా వినిపిస్తోంది. ఇంతకీ అసలు ఏంటీ జగన్ యాట్టిట్యూడ్? ఎందుకింతగా చర్చకు వచ్చింది?
జగన్ ఆది నుంచి కూడా తన పార్టీని కార్పొరేట్ సంస్థగానే భావిస్తారు. తను పెట్టుకున్న పార్టీ.. తన మాటే శాసనం.. అనే మాటే ఉంటుంది తప్ప.. వేరే మాటే ఉండదు. ఇది వాస్తవం కూడా. కాంగ్రెస్ నుంచి విడి వడి.. సొంతగా జగన్ పార్టీ పెట్టుకున్నారు. దీనిలో ఆయనే రాజు.. ఆయనే మంత్రి. అప్పుడప్పుడు… ఏవైనా నచ్చితే మాత్రమే ఇతరుల అభిప్రాయాలను ఆయన తీసుకుంటారు. లేకపోతే.. తను పెట్టుకున్న సంస్థల నుంచితనకు నచ్చిన విధంగానే ముందుకు సాగుతారు.
ఈ ఏడాది ఎన్నికలకు ముందు చంద్రబాబు పింఛన్ను రూ.4000లకు పెంచుతానని చెప్పారు. దీనిపై కొందరు కీలక వైసీపీ నాయకులు జగన్కు చెప్పారు మనం కూడా పెంచుదామన్నారు. కానీ, ఆయన తన వైఖరినే ప్రదర్శించారు.
ఇక, నాయకులను మార్చే విషయంలోనూ కొందరు వద్దన్నారు. గెలిచే గుర్రా లేనని చెప్పారు. కానీ.. జగన్ తన వైఖరినే అమలు చేశారు. ఫలితం ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే. అయినా.. ఆయన తన యాట్టిట్యూడ్ను మార్చుకోలేక పోయారు.
తాము మంచి చేసి ఓడామని ఒక నినాదం ఇచ్చారు. ఇది అందరికీ నచ్చలేదు. ఇక, పార్టీ నుంచి వెళ్లిపోయే నేతలను కనీసం పిలిచి మాట్లాడాలని.. కొందరు నాయకులు సూచించారు. కానీ, ఇది జగన్ యాటిట్యూడ్కు వ్యతిరేకం. నేను పెట్టుకున్న పార్టీ.. వాళ్లు వచ్చారు అవకాశం ఇచ్చాను. వారు వెళ్తే పోనీ.. వేరేవారికి అవకాశం ఇస్తాను.. అన్న ధోరణిలోనే ఉన్నారు. మరోవైపు.. గత ప్రభుత్వం తప్పులు అంటూ.. ఏం జరిగినా చంద్రబాబు జగన్పై నెట్టేస్తున్నారు.
దీనిని బలంగా ఎదిరించాలని అన్నా.. నాయకుల మాట జగన్ వినిపించుకోవడం లేదు. ఇదీ ఆయన యాట్టిట్యూడేనని అంటున్నారు. అంతా ప్రజలే తెలుసుకుంటారని ఆయన చెబుతున్నారు. దీంతో అసలు జగన్ యాట్టిట్యూడ్ ఏంటో అర్థం కాక.. వైసీపీ నేతలు జుట్టు పీక్కుంటున్నారు.
This post was last modified on September 10, 2024 5:18 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…