తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న కోలీవుడ్ స్టార్ విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం ఎల్లుండి విడుదల కాబోతోంది. లియో టైంలో కనిపించిన హడావిడి ఈసారి లేదు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఊహించినట్టే విజయ్ రాలేదు కానీ దర్శకుడు వెంకట్ ప్రభు, హీరోయిన్ మీనాక్షి చౌదరితో పాటు మిగిలిన టీమ్ మొత్తం హాజరయ్యింది. పంపిణి హక్కులు తీసుకున్న మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ తరఫున శశి ఈ సినిమాకు ఏపీ తెలంగాణలో తెల్లవారుఝామున 4 గంటల ఆటల కోసం అనుమతులు అడిగామని, వస్తే కనక స్పెషల్ బెనిఫిట్ షోలు ఉంటాయని ప్రకటించారు.
ఇప్పటిదాకా ఇంత వేకువన విజయ్ సినిమాలకు స్పెషల్ షోలు వేసిన దాఖలాలు మన దగ్గర లేవు. కర్ణాటక, కేరళలో సహజమే కానీ ప్రభుత్వ నిబంధనల వల్ల తమిళనాడులోనూ ఏడు తర్వాత ప్రదర్శనలు ఉంటాయి. అయితే ఇంత ధైర్యంగా 4 గంటలకు ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం స్క్రీనింగ్ చేస్తామని చెప్పడం చూస్తుంటే కంటెంట్ మీద మేకర్స్ కు మాములు నమ్మకం కనిపించడం లేదు. నిద్రలు మానుకుని ఇంకా చీకటి ఉండగానే అభిమానులను, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే కెపాసిటీ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, తారక్, చరణ్, బన్నీ, ప్రభాస్ లాంటి స్టార్లకు మాత్రమే ఉంది.
ఇప్పుడీ లిస్టులో విజయ్ తోడు కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఒకవేళ సినిమా బాగుండి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇదే ప్లస్ అవుతుంది. ఎలాగూ రెండు రోజుల్లో వినాయక చవితి పండగ ఉంటుంది కాబట్టి వరస సెలవులు కలిసి వస్తాయి. పోటీలో ఉన్న జనక అయితే గనక, 35 చిన్న కథ కాదు చిన్న బడ్జెట్ చిత్రాలు కావడం వల్ల పెద్దగా ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. కాకపోతే ఫిక్షన్, డీ ఏజింగ్, స్టైలిష్ యాక్షన్ లాంటి న్యూ ఏజ్ అంశాలు ఎక్కువగా ఉన్న ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం ఏ మేరకు మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తుందనే దాని మీద బాక్సాఫీస్ ఫలితం ఆధారపడి ఉంటుంది.
This post was last modified on September 3, 2024 3:05 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…