తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న కోలీవుడ్ స్టార్ విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం ఎల్లుండి విడుదల కాబోతోంది. లియో టైంలో కనిపించిన హడావిడి ఈసారి లేదు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఊహించినట్టే విజయ్ రాలేదు కానీ దర్శకుడు వెంకట్ ప్రభు, హీరోయిన్ మీనాక్షి చౌదరితో పాటు మిగిలిన టీమ్ మొత్తం హాజరయ్యింది. పంపిణి హక్కులు తీసుకున్న మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ తరఫున శశి ఈ సినిమాకు ఏపీ తెలంగాణలో తెల్లవారుఝామున 4 గంటల ఆటల కోసం అనుమతులు అడిగామని, వస్తే కనక స్పెషల్ బెనిఫిట్ షోలు ఉంటాయని ప్రకటించారు.
ఇప్పటిదాకా ఇంత వేకువన విజయ్ సినిమాలకు స్పెషల్ షోలు వేసిన దాఖలాలు మన దగ్గర లేవు. కర్ణాటక, కేరళలో సహజమే కానీ ప్రభుత్వ నిబంధనల వల్ల తమిళనాడులోనూ ఏడు తర్వాత ప్రదర్శనలు ఉంటాయి. అయితే ఇంత ధైర్యంగా 4 గంటలకు ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం స్క్రీనింగ్ చేస్తామని చెప్పడం చూస్తుంటే కంటెంట్ మీద మేకర్స్ కు మాములు నమ్మకం కనిపించడం లేదు. నిద్రలు మానుకుని ఇంకా చీకటి ఉండగానే అభిమానులను, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే కెపాసిటీ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, తారక్, చరణ్, బన్నీ, ప్రభాస్ లాంటి స్టార్లకు మాత్రమే ఉంది.
ఇప్పుడీ లిస్టులో విజయ్ తోడు కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఒకవేళ సినిమా బాగుండి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇదే ప్లస్ అవుతుంది. ఎలాగూ రెండు రోజుల్లో వినాయక చవితి పండగ ఉంటుంది కాబట్టి వరస సెలవులు కలిసి వస్తాయి. పోటీలో ఉన్న జనక అయితే గనక, 35 చిన్న కథ కాదు చిన్న బడ్జెట్ చిత్రాలు కావడం వల్ల పెద్దగా ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. కాకపోతే ఫిక్షన్, డీ ఏజింగ్, స్టైలిష్ యాక్షన్ లాంటి న్యూ ఏజ్ అంశాలు ఎక్కువగా ఉన్న ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం ఏ మేరకు మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తుందనే దాని మీద బాక్సాఫీస్ ఫలితం ఆధారపడి ఉంటుంది.
This post was last modified on September 3, 2024 3:05 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…