ఇటీవలి కొన్ని పరిణామాలతో ‘పుష్ప-2’ సినిమా మీద సోషల్ మీడియాలో ఎంతో నెగెటివిటీ కనిపిస్తోంది. అందుకు ప్రధాన కారణం.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుదా హీరో అల్లు అర్జున్ ప్రచారం చేయడమే. ఈ విషయంగా మెగా ఫ్యాన్స్, జనసైనికులు బాగా హర్ట్ అయ్యారు.
ఇంతకుముందే మెగా అభిమానుల్లో ఓ వర్గానికి అల్లు అర్జున్ అంటే పడట్లేదు. చాన్నాళ్లుగా అతడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇటీవలి పరిణామాలతో వాళ్లలో నెగెటివిటీ ఇంకా పెరిగిపోయింది. పుష్ప-2 ఎలా ఆడుతుందో చూస్తామంటూ ఆ సినిమాను టార్గెట్ చేయబోతున్న సంకేతాలు ఇస్తున్నారు. ఇలాంటి సమయంలోనే జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.. బన్నీని విమర్శించడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో మెగా అభిమానులు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గొడవలు ఇంకా పెరిగాయి.
ఈ గొడవలు, నెగెటివిటీ పుష్ప-2 మీద ప్రతికూల ప్రభావం చూపుతాయేమో అన్న సందేహాలు నెలకొన్నాయి. కానీ ఇదంతా పెద్ద విషయం కాదని అంటున్నాడు ‘పుష్ప-2’ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ యలమంచిలి. తమ బేనర్లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘మత్తు వదలరా-2’కు సంబంధించిన ప్రెస్ మీట్లో ‘పుష్ప-2’ మీద నెలకొన్న నెగెటివిటీ గురించి ఆయన మాట్లాడారు.
“ఆ సినిమా గురించి విడుదలకు ముందు ఎవరైనా ఏదైనా నెగెటివ్గా మాట్లాడుతున్నారేమో. కానీ రిలీజ్ టైంకి ఇవేవీ ఉండవు అనుకుంటున్నా. సినిమా బాగుంటే అందరూ చూస్తారు. దాని గురించి మంచిగానే మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా అనొచ్చు. కానీ మెగా ఫ్యామిలీలో అందరూ ఒక్కటే. ఎవరి మధ్య గొడవలు లాంటివేమీ ఉండవు. ఫ్యామిలీ అంతా ఒక్కటే. సినిమా మీద కూడా రిలీజ్ టైంకి ఎలాంటి నెగెటివిటీ ఉండదనుకుంటున్నా” అని రవిశంకర్ స్పష్టం చేశారు.
This post was last modified on August 30, 2024 6:23 pm
అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…
దేశ రాజధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు పోలీసుల పహారాలో ఉండనుంది. దాదాపు నగరం…
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…
జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…