Movie News

పుష్ప-2 నెగెటివిటీ.. నిర్మాత లైట్

ఇటీవలి కొన్ని పరిణామాలతో ‘పుష్ప-2’ సినిమా మీద సోషల్ మీడియాలో ఎంతో నెగెటివిటీ కనిపిస్తోంది. అందుకు ప్రధాన కారణం.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుదా హీరో అల్లు అర్జున్ ప్రచారం చేయడమే. ఈ విషయంగా మెగా ఫ్యాన్స్, జనసైనికులు బాగా హర్ట్ అయ్యారు.

ఇంతకుముందే మెగా అభిమానుల్లో ఓ వర్గానికి అల్లు అర్జున్ అంటే పడట్లేదు. చాన్నాళ్లుగా అతడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇటీవలి పరిణామాలతో వాళ్లలో నెగెటివిటీ ఇంకా పెరిగిపోయింది. పుష్ప-2 ఎలా ఆడుతుందో చూస్తామంటూ ఆ సినిమాను టార్గెట్ చేయబోతున్న సంకేతాలు ఇస్తున్నారు. ఇలాంటి సమయంలోనే జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.. బన్నీని విమర్శించడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో మెగా అభిమానులు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గొడవలు ఇంకా పెరిగాయి.

ఈ గొడవలు, నెగెటివిటీ పుష్ప-2 మీద ప్రతికూల ప్రభావం చూపుతాయేమో అన్న సందేహాలు నెలకొన్నాయి. కానీ ఇదంతా పెద్ద విషయం కాదని అంటున్నాడు ‘పుష్ప-2’ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ యలమంచిలి. తమ బేనర్లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘మత్తు వదలరా-2’కు సంబంధించిన ప్రెస్ మీట్లో ‘పుష్ప-2’ మీద నెలకొన్న నెగెటివిటీ గురించి ఆయన మాట్లాడారు.

“ఆ సినిమా గురించి విడుదలకు ముందు ఎవరైనా ఏదైనా నెగెటివ్‌గా మాట్లాడుతున్నారేమో. కానీ రిలీజ్ టైంకి ఇవేవీ ఉండవు అనుకుంటున్నా. సినిమా బాగుంటే అందరూ చూస్తారు. దాని గురించి మంచిగానే మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా అనొచ్చు. కానీ మెగా ఫ్యామిలీలో అందరూ ఒక్కటే. ఎవరి మధ్య గొడవలు లాంటివేమీ ఉండవు. ఫ్యామిలీ అంతా ఒక్కటే. సినిమా మీద కూడా రిలీజ్ టైంకి ఎలాంటి నెగెటివిటీ ఉండదనుకుంటున్నా” అని రవిశంకర్ స్పష్టం చేశారు.

This post was last modified on August 30, 2024 6:23 pm

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

5 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

6 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

6 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

7 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

7 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

7 hours ago