Movie News

పుష్ప-2 నెగెటివిటీ.. నిర్మాత లైట్

ఇటీవలి కొన్ని పరిణామాలతో ‘పుష్ప-2’ సినిమా మీద సోషల్ మీడియాలో ఎంతో నెగెటివిటీ కనిపిస్తోంది. అందుకు ప్రధాన కారణం.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుదా హీరో అల్లు అర్జున్ ప్రచారం చేయడమే. ఈ విషయంగా మెగా ఫ్యాన్స్, జనసైనికులు బాగా హర్ట్ అయ్యారు.

ఇంతకుముందే మెగా అభిమానుల్లో ఓ వర్గానికి అల్లు అర్జున్ అంటే పడట్లేదు. చాన్నాళ్లుగా అతడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇటీవలి పరిణామాలతో వాళ్లలో నెగెటివిటీ ఇంకా పెరిగిపోయింది. పుష్ప-2 ఎలా ఆడుతుందో చూస్తామంటూ ఆ సినిమాను టార్గెట్ చేయబోతున్న సంకేతాలు ఇస్తున్నారు. ఇలాంటి సమయంలోనే జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.. బన్నీని విమర్శించడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో మెగా అభిమానులు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గొడవలు ఇంకా పెరిగాయి.

ఈ గొడవలు, నెగెటివిటీ పుష్ప-2 మీద ప్రతికూల ప్రభావం చూపుతాయేమో అన్న సందేహాలు నెలకొన్నాయి. కానీ ఇదంతా పెద్ద విషయం కాదని అంటున్నాడు ‘పుష్ప-2’ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ యలమంచిలి. తమ బేనర్లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘మత్తు వదలరా-2’కు సంబంధించిన ప్రెస్ మీట్లో ‘పుష్ప-2’ మీద నెలకొన్న నెగెటివిటీ గురించి ఆయన మాట్లాడారు.

“ఆ సినిమా గురించి విడుదలకు ముందు ఎవరైనా ఏదైనా నెగెటివ్‌గా మాట్లాడుతున్నారేమో. కానీ రిలీజ్ టైంకి ఇవేవీ ఉండవు అనుకుంటున్నా. సినిమా బాగుంటే అందరూ చూస్తారు. దాని గురించి మంచిగానే మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా అనొచ్చు. కానీ మెగా ఫ్యామిలీలో అందరూ ఒక్కటే. ఎవరి మధ్య గొడవలు లాంటివేమీ ఉండవు. ఫ్యామిలీ అంతా ఒక్కటే. సినిమా మీద కూడా రిలీజ్ టైంకి ఎలాంటి నెగెటివిటీ ఉండదనుకుంటున్నా” అని రవిశంకర్ స్పష్టం చేశారు.

This post was last modified on August 30, 2024 6:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

1 hour ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago