ఇటీవలి కొన్ని పరిణామాలతో ‘పుష్ప-2’ సినిమా మీద సోషల్ మీడియాలో ఎంతో నెగెటివిటీ కనిపిస్తోంది. అందుకు ప్రధాన కారణం.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుదా హీరో అల్లు అర్జున్ ప్రచారం చేయడమే. ఈ విషయంగా మెగా ఫ్యాన్స్, జనసైనికులు బాగా హర్ట్ అయ్యారు.
ఇంతకుముందే మెగా అభిమానుల్లో ఓ వర్గానికి అల్లు అర్జున్ అంటే పడట్లేదు. చాన్నాళ్లుగా అతడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇటీవలి పరిణామాలతో వాళ్లలో నెగెటివిటీ ఇంకా పెరిగిపోయింది. పుష్ప-2 ఎలా ఆడుతుందో చూస్తామంటూ ఆ సినిమాను టార్గెట్ చేయబోతున్న సంకేతాలు ఇస్తున్నారు. ఇలాంటి సమయంలోనే జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.. బన్నీని విమర్శించడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో మెగా అభిమానులు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గొడవలు ఇంకా పెరిగాయి.
ఈ గొడవలు, నెగెటివిటీ పుష్ప-2 మీద ప్రతికూల ప్రభావం చూపుతాయేమో అన్న సందేహాలు నెలకొన్నాయి. కానీ ఇదంతా పెద్ద విషయం కాదని అంటున్నాడు ‘పుష్ప-2’ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ యలమంచిలి. తమ బేనర్లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘మత్తు వదలరా-2’కు సంబంధించిన ప్రెస్ మీట్లో ‘పుష్ప-2’ మీద నెలకొన్న నెగెటివిటీ గురించి ఆయన మాట్లాడారు.
“ఆ సినిమా గురించి విడుదలకు ముందు ఎవరైనా ఏదైనా నెగెటివ్గా మాట్లాడుతున్నారేమో. కానీ రిలీజ్ టైంకి ఇవేవీ ఉండవు అనుకుంటున్నా. సినిమా బాగుంటే అందరూ చూస్తారు. దాని గురించి మంచిగానే మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా అనొచ్చు. కానీ మెగా ఫ్యామిలీలో అందరూ ఒక్కటే. ఎవరి మధ్య గొడవలు లాంటివేమీ ఉండవు. ఫ్యామిలీ అంతా ఒక్కటే. సినిమా మీద కూడా రిలీజ్ టైంకి ఎలాంటి నెగెటివిటీ ఉండదనుకుంటున్నా” అని రవిశంకర్ స్పష్టం చేశారు.
This post was last modified on August 30, 2024 6:23 pm
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…