ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక సినిమాల గురించే ఆలోచించే పరిస్థితి మూడు నెలల దాకా చూడలేకపోయిన పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు పెండింగ్ లో ఉన్న దర్శక నిర్మాతలను కలుస్తున్నారు. షూటింగులు, బాలన్స్ వర్క్, విడుదల తేదీలు తదితర వ్యవహారాలకు సంబంధించి సమాచారం తీసుకుంటున్నారు. మొదటి ప్రాధాన్య క్రమంలో ఓజి, హరిహర వీరమల్లు ఉండగా చివరిదైన ఉస్తాద్ భగత్ సింగ్ కోసం దర్శకుడు హరీష్ శంకర్ ఇటీవలే పవన్ ను కలిసి చర్చించారు. ఎప్పుడు రీ స్టార్ట్ చేస్తారనేది పక్కనపెడితే ఇంకా ఎనభై శాతం కంటెంట్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్నున్నాయి.
ఎన్నికలకు ముందు పవర్ స్టార్ కి ఇప్పటి పవన్ కు ఇమేజ్ పరంగా మార్పులొచ్చాయి. ఎంత సినిమా అయినా సరే ఒక స్థాయిని మైంటైన్ చేయాల్సి ఉంటుంది. అవకాశం కోసం ఎదురు చూసే ప్రతిపక్షాలు ఏదైనా తప్పు దొరికితే వాడుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. ట్రోలింగ్ కి దారులు తెరుస్తాయి. ఉదాహరణకు మిస్టర్ బచ్చన్ లో రవితేజతో ఎలాంటి కామెడీ, డాన్సులు చేయించినా చెల్లిపోయింది కానీ పవన్ తో అలాంటివి కుదరదు. కెవ్వు కేక లాంటి ఊర మాస్ ఐటెం సాంగ్స్ సైతం కష్టమే. అలాని ఆర్ట్ ఫిలిం లాగా తీయాలని కాదు కానీ సోషల్ మీడియా ప్రపంచంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.
అసలే హరీష్ శంకర్ ట్విట్టర్ తదితర సామజిక మాధ్యమాల్లో బలంగా టార్గెట్ అయ్యాడు. ఇప్పుడీ ఉస్తాద్ భగత్ సింగ్ బంగారం లాంటి ఛాన్స్. తన మీద పడ్డ మరకను పూర్తిగా తుడుచుకునే అవకాశం. ఇంకా తగినంత సమయం ఉంది కాబట్టి ఈలోగా మరోసారి స్క్రిప్ట్ ని విశ్లేషించుకుంటే బెటరని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కాంబినేషన్ కావడంతో ఎంత రీమేక్ అయినా సరే అంచనాలు ఖచ్చితంగా పై రేంజులోనే ఉంటాయి. పవన్ మాత్రం మిస్టర్ బచ్చన్ ఫలితాన్ని పట్టించుకునే స్థితిలో లేరు. మాట ఇచ్చారు కాబట్టి ఉస్తాద్ ని పూర్తి చేయాల్సిందే.
This post was last modified on August 27, 2024 11:41 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…