Movie News

ఉస్తాద్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక సినిమాల గురించే ఆలోచించే పరిస్థితి మూడు నెలల దాకా చూడలేకపోయిన పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు పెండింగ్ లో ఉన్న దర్శక నిర్మాతలను కలుస్తున్నారు. షూటింగులు, బాలన్స్ వర్క్, విడుదల తేదీలు తదితర వ్యవహారాలకు సంబంధించి సమాచారం తీసుకుంటున్నారు. మొదటి ప్రాధాన్య క్రమంలో ఓజి, హరిహర వీరమల్లు ఉండగా చివరిదైన ఉస్తాద్ భగత్ సింగ్ కోసం దర్శకుడు హరీష్ శంకర్ ఇటీవలే పవన్ ను కలిసి చర్చించారు. ఎప్పుడు రీ స్టార్ట్ చేస్తారనేది పక్కనపెడితే ఇంకా ఎనభై శాతం కంటెంట్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్నున్నాయి.

ఎన్నికలకు ముందు పవర్ స్టార్ కి ఇప్పటి పవన్ కు ఇమేజ్ పరంగా మార్పులొచ్చాయి. ఎంత సినిమా అయినా సరే ఒక స్థాయిని మైంటైన్ చేయాల్సి ఉంటుంది. అవకాశం కోసం ఎదురు చూసే ప్రతిపక్షాలు ఏదైనా తప్పు దొరికితే వాడుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. ట్రోలింగ్ కి దారులు తెరుస్తాయి. ఉదాహరణకు మిస్టర్ బచ్చన్ లో రవితేజతో ఎలాంటి కామెడీ, డాన్సులు చేయించినా చెల్లిపోయింది కానీ పవన్ తో అలాంటివి కుదరదు. కెవ్వు కేక లాంటి ఊర మాస్ ఐటెం సాంగ్స్ సైతం కష్టమే. అలాని ఆర్ట్ ఫిలిం లాగా తీయాలని కాదు కానీ సోషల్ మీడియా ప్రపంచంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.

అసలే హరీష్ శంకర్ ట్విట్టర్ తదితర సామజిక మాధ్యమాల్లో బలంగా టార్గెట్ అయ్యాడు. ఇప్పుడీ ఉస్తాద్ భగత్ సింగ్ బంగారం లాంటి ఛాన్స్. తన మీద పడ్డ మరకను పూర్తిగా తుడుచుకునే అవకాశం. ఇంకా తగినంత సమయం ఉంది కాబట్టి ఈలోగా మరోసారి స్క్రిప్ట్ ని విశ్లేషించుకుంటే బెటరని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కాంబినేషన్ కావడంతో ఎంత రీమేక్ అయినా సరే అంచనాలు ఖచ్చితంగా పై రేంజులోనే ఉంటాయి. పవన్ మాత్రం మిస్టర్ బచ్చన్ ఫలితాన్ని పట్టించుకునే స్థితిలో లేరు. మాట ఇచ్చారు కాబట్టి ఉస్తాద్ ని పూర్తి చేయాల్సిందే. 

This post was last modified on August 27, 2024 11:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

9 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago