అర్జున్ రెడ్డి అనే ఒకే ఒక్క సినిమాతో హాట్ షాట్ డైరెక్టర్గా మారిపోయాడు సందీప్ రెడ్డి వంగ. ‘అర్జున్ రెడ్డి’తో తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేశాక అదే కథను ‘కబీర్ సింగ్’గా హిందీలో రీమేక్ చేసి అక్కడా సంచలనాలక తెర తీశాడు. ఇక తర్వాతి చిత్రం ‘యానిమల్’తో సందీప్ రేపిన ప్రకంపనల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాను విమర్శించిన వాళ్లూ లేకపోలేదు కానీ.. దాని బాక్సాఫీస్ విజయం మాత్రం అసామాన్యం.
దీని తర్వాత సందీప్ ఏ సినిమా చేస్తాడనే విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. ఈ విషయంలో రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. కాగా తాజాగా సందీప్ ఓ కాలేజ్ ఈవెంట్లో పాల్గొన్న సందర్భంగా తన లైనప్ గురించి క్లారిటీ ఇచ్చాడు. వచ్చే నాలుగేళ్లను తాను రెండు సినిమాల కోసం కేటాయిస్తున్నట్లు ప్రకటించాడు.
ప్రస్తుతం ప్రభాస్తో చేయాల్సిన ‘స్పిరిట్’ మూవీ కోసం ప్రి ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైనట్లు సందీప్ వెల్లడించాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మొదలుపెడతానని.. ఇది రిలీజ్ కావడానికి రెండేళ్లు పడుతుందని సందీప్ వెల్లడించాడు. ఆ తర్వాత తాను రణబీర్ కపూర్తో ‘యానిమల్’ సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ తీస్తానని.. దాని కోసం రెండేళ్లు కేటాయిస్తానని సందీప్ చెప్పాడు. ఇలా వచ్చే నాలుగేళ్లు ఈ రెండు చిత్రాలకే అంకితం కానున్నట్లు సందీప్ చెప్పాడు.
కాబట్టి స్పిరిట్ ముందా, యానిమల్ పార్క్ ముందా.. ఇవి కాక సందీప్ వేరే హీరో ఎవరితో అయినా జట్టు కడతాడా అనే విషయంలో ఇక ఊహాగానాలన్నింటికీ తెరపడినట్లే. ప్రస్తుతం ప్రభాస్.. హను రాఘవపూడి సినిమాను మొదలు పెట్టాడు. దాంతో పాటు ‘రాజా సాబ్’ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. అవి ఒక కొలిక్కి వచ్చాక సందీప్ సినిమాను మొదలు పెడతాడన్నమాట.
This post was last modified on August 27, 2024 10:36 pm
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…