అర్జున్ రెడ్డి అనే ఒకే ఒక్క సినిమాతో హాట్ షాట్ డైరెక్టర్గా మారిపోయాడు సందీప్ రెడ్డి వంగ. ‘అర్జున్ రెడ్డి’తో తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేశాక అదే కథను ‘కబీర్ సింగ్’గా హిందీలో రీమేక్ చేసి అక్కడా సంచలనాలక తెర తీశాడు. ఇక తర్వాతి చిత్రం ‘యానిమల్’తో సందీప్ రేపిన ప్రకంపనల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాను విమర్శించిన వాళ్లూ లేకపోలేదు కానీ.. దాని బాక్సాఫీస్ విజయం మాత్రం అసామాన్యం.
దీని తర్వాత సందీప్ ఏ సినిమా చేస్తాడనే విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. ఈ విషయంలో రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. కాగా తాజాగా సందీప్ ఓ కాలేజ్ ఈవెంట్లో పాల్గొన్న సందర్భంగా తన లైనప్ గురించి క్లారిటీ ఇచ్చాడు. వచ్చే నాలుగేళ్లను తాను రెండు సినిమాల కోసం కేటాయిస్తున్నట్లు ప్రకటించాడు.
ప్రస్తుతం ప్రభాస్తో చేయాల్సిన ‘స్పిరిట్’ మూవీ కోసం ప్రి ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైనట్లు సందీప్ వెల్లడించాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మొదలుపెడతానని.. ఇది రిలీజ్ కావడానికి రెండేళ్లు పడుతుందని సందీప్ వెల్లడించాడు. ఆ తర్వాత తాను రణబీర్ కపూర్తో ‘యానిమల్’ సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ తీస్తానని.. దాని కోసం రెండేళ్లు కేటాయిస్తానని సందీప్ చెప్పాడు. ఇలా వచ్చే నాలుగేళ్లు ఈ రెండు చిత్రాలకే అంకితం కానున్నట్లు సందీప్ చెప్పాడు.
కాబట్టి స్పిరిట్ ముందా, యానిమల్ పార్క్ ముందా.. ఇవి కాక సందీప్ వేరే హీరో ఎవరితో అయినా జట్టు కడతాడా అనే విషయంలో ఇక ఊహాగానాలన్నింటికీ తెరపడినట్లే. ప్రస్తుతం ప్రభాస్.. హను రాఘవపూడి సినిమాను మొదలు పెట్టాడు. దాంతో పాటు ‘రాజా సాబ్’ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. అవి ఒక కొలిక్కి వచ్చాక సందీప్ సినిమాను మొదలు పెడతాడన్నమాట.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…