అర్జున్ రెడ్డి అనే ఒకే ఒక్క సినిమాతో హాట్ షాట్ డైరెక్టర్గా మారిపోయాడు సందీప్ రెడ్డి వంగ. ‘అర్జున్ రెడ్డి’తో తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేశాక అదే కథను ‘కబీర్ సింగ్’గా హిందీలో రీమేక్ చేసి అక్కడా సంచలనాలక తెర తీశాడు. ఇక తర్వాతి చిత్రం ‘యానిమల్’తో సందీప్ రేపిన ప్రకంపనల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాను విమర్శించిన వాళ్లూ లేకపోలేదు కానీ.. దాని బాక్సాఫీస్ విజయం మాత్రం అసామాన్యం.
దీని తర్వాత సందీప్ ఏ సినిమా చేస్తాడనే విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. ఈ విషయంలో రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. కాగా తాజాగా సందీప్ ఓ కాలేజ్ ఈవెంట్లో పాల్గొన్న సందర్భంగా తన లైనప్ గురించి క్లారిటీ ఇచ్చాడు. వచ్చే నాలుగేళ్లను తాను రెండు సినిమాల కోసం కేటాయిస్తున్నట్లు ప్రకటించాడు.
ప్రస్తుతం ప్రభాస్తో చేయాల్సిన ‘స్పిరిట్’ మూవీ కోసం ప్రి ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైనట్లు సందీప్ వెల్లడించాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మొదలుపెడతానని.. ఇది రిలీజ్ కావడానికి రెండేళ్లు పడుతుందని సందీప్ వెల్లడించాడు. ఆ తర్వాత తాను రణబీర్ కపూర్తో ‘యానిమల్’ సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ తీస్తానని.. దాని కోసం రెండేళ్లు కేటాయిస్తానని సందీప్ చెప్పాడు. ఇలా వచ్చే నాలుగేళ్లు ఈ రెండు చిత్రాలకే అంకితం కానున్నట్లు సందీప్ చెప్పాడు.
కాబట్టి స్పిరిట్ ముందా, యానిమల్ పార్క్ ముందా.. ఇవి కాక సందీప్ వేరే హీరో ఎవరితో అయినా జట్టు కడతాడా అనే విషయంలో ఇక ఊహాగానాలన్నింటికీ తెరపడినట్లే. ప్రస్తుతం ప్రభాస్.. హను రాఘవపూడి సినిమాను మొదలు పెట్టాడు. దాంతో పాటు ‘రాజా సాబ్’ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. అవి ఒక కొలిక్కి వచ్చాక సందీప్ సినిమాను మొదలు పెడతాడన్నమాట.
This post was last modified on August 27, 2024 10:36 pm
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…