ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్ తనస్నేహితుడు శిల్పా రవిచంద్రరెడ్డి కోసం నంద్యాల వెళ్లి వైసిపికి ప్రచారం చేయడం దుమారం రేపి నెలలు గడుస్తున్నా దాని తాలూకు సెగలు ఎప్పటికప్పుడు పెద్దవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఆర్మీ పరస్పర కామెంట్లు, దూషణలు, ట్రోలింగ్ చేసుకుంటున్నారు. తాజాగా ప్రజా ప్రతినిధులు సైతం తోడవ్వడంతో వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుందో అంతు చిక్కడం లేదు. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శీను చేసిన కామెంట్లు ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి. ఒక్కసారిగా వీడియో తెగ వైరలైపోతోంది.
ప్రత్యేకంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారని తనకు తెలియదని, అందరూ మెగాభిమానులే తప్ప ప్రత్యేకంగా షామియానా, టెంట్లు పెట్టుకున్న వాళ్ళ గురించి తనకు తెలియదని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసేలా ఉన్నాయి. చిరు, పవన్, చరణ్ ఇలా అందరిని నీలో కూడా చూసుకుని ఆదరిస్తున్నారని, ప్రచారం చేసిన చోట ఓడిపోయి, తండ్రిని ఎంపీగా గెలిపించలేని నువ్వు సపోర్ట్ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అంటూ అన్న మాటలు చాలా దూరం వెళ్లేలా ఉన్నాయి. నిజానిజాలు పక్కపెడితే సున్నితమైన ఈ ఇష్యూ కాస్తా క్రమంగా రూపం మార్చుకుంటున్న మాట వాస్తవం.
ఇటీవలే మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్ లో బన్నీ అన్న మాటలే చిచ్చుని మరింత రాజేశాయి. స్నేహితుల కోసం ఏమైనా చేస్తానని ఎంత దూరమైనా వెళ్తానని అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మెగా ఫ్యాన్స్ కి బాగా రెచ్చగొట్టేలా చేశాయి. ఇంద్ర రీ రిలీజ్ చూస్తూ సినిమాలో చిరంజీవిని మోసం చేసే ఒక పాత్రకి అన్వయించే దాకా పరిస్థితి వెళ్ళింది. కొందరైతే ఏకంగా పుష్ప 2ని డిసెంబర్లో బ్యాన్ చేస్తామని కూడా అంటున్నారు. దీనికి చెక్ ఎలా పడుతుందో అర్థం కాక తటస్థంగా ఉండే సినీ ప్రియులు అయోమయం చెందుతున్నారు. చిరు, అల్లు కుటుంబాల నుంచి ఎవరైనా ఇరువురి ఫ్యాన్స్ కోసం పెద్దరికం వహించి క్లారిటీ ఇస్తే మేలేమో.
This post was last modified on August 27, 2024 8:03 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…