వచ్చే వారం విడుదల కాబోతున్న సరిపోదా శనివారంకి టైటిల్ కు తగ్గట్టే అన్నీ ఒక్కొక్కటిగా సరిపోయేలా సమకూరుతున్నాయి. ట్రైలర్ తర్వాత వచ్చిన హైప్ ని హీరో నాని తనదైన శైలిలో దక్షిణాది రాష్ట్రాలన్నీ తిరిగి ప్రమోట్ చేసి పెంచేశాడు. ప్రభాస్ మీద కామెంట్ చేసిన అర్షద్ వార్సీ మీద చురక వేసినందుకు ఒక వర్గం బాలీవుడ్ మీడియా ఉద్దేశపూర్వకంగా హిందీ డబ్బింగ్ వెర్షన్ మీద నెగటివ్ చేయాలని చూస్తున్నా అదేమీ పని చేయడం లేదని సోషల్ మీడియా ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. స్త్రీ 2 హ్యాంగోవర్ లో ఉన్న నార్త్ ఆడియన్స్ క్రమంగా దీని వైపు చూడటం మొదలుపెట్టారు.
తమిళ మీడియా మద్దతుతో కోలీవుడ్ లో అంచనాలు రేపడంలో నాని సక్సెసయ్యాడు. ముఖ్యంగా ప్రియాంక మోహన్, ఎస్జె సూర్యలను అంటిపెట్టుకుని మరీ పబ్లిసిటీలో భాగం చేయడం ఫలితాన్ని ఇస్తోంది. కేరళలో అదితి మోహన్ ఆ బాధ్యతను తీసుకోగా ముంబైలో చేయబోయే ఈవెంట్స్ కి టీమ్ మొత్తం ఏకమయ్యింది. ఆగస్ట్ 29 ఎంత మంచి డేటో క్రమంగా అర్థమవుతోంది. నిర్మాత డివివి దానయ్య నైజాం హక్కులను దిల్ రాజుకి ఇవ్వడం ద్వారా భారీ రిలీజ్ కు మార్గం సుగమం చేసుకున్నారు. నాని కెరీర్ లోనే అత్యధిక తెలంగాణ స్క్రీన్లలో సరిపోదా శనివారం అడుగుపెట్టనుంది.
ఇక మిగిలింది హిట్ టాక్ తెచ్చుకోవడం. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈసారి డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్న వైనం కనిపిస్తోంది. రెగ్యులర్ ఫార్ములాలో కాకుండా ఒక రోజు మాత్రమే హీరోకి కోపం వచ్చే పాయింట్ ని చెడ్డవాడైన పోలీస్ ఆఫీసర్ కి ముడిపెట్టిన తీరు ఆసక్తికరంగా ఉంది. ఆగస్ట్ 15 రిలీజైన వాటిలో ఆయ్ మినహాయిస్తే అన్నీ నిరాశ పరిచిన నేపథ్యంలో సరిపోదా శనివారం మీద బయ్యర్ వర్గాల్లో మాములు అంచనాలు లేవు. పైగా ఆపై వారం కూడా స్టార్ హీరోలెవరూ రావడం లేదు. సో టాక్ రావడం ఆలస్యం దిల్ రాజు అన్నట్టు దసరా రికార్డులను బద్దలు కొట్టడం లాంఛనమే అవుతుంది.
This post was last modified on August 22, 2024 6:13 pm
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…