మొన్న ఆగస్ట్ పదిహేను వచ్చిన రెండు భారీ కమర్షియల్ సినిమాలు తీవ్రంగా నిరాశ పరచడం అభిమానులను కలవరానికి గురి చేయగా, ట్రేడ్ వర్గాలు ఆ షాక్ నుంచి కోలుకోవడానికి టైం పట్టేలా ఉంది. అయితే ఇలాంటి కంటెంట్లు ఇప్పుడు జనాలు చూడటం లేదేమోననే అనుమానం ఇండస్ట్రీలో లేకపోలేదు. సరిపోదా శనివారం ప్రెస్ మీట్ సందర్భంగా నాని దీనికి సంబంధించి ఒక మంచి నిర్వచనం ఇచ్చాడు. ప్రేక్షకులను ఎప్పుడైతే ఎంగేజ్ చేయడంలో విఫలమవుతామో అది ఫ్లాప్ రూపంలో ప్రతిబింబిస్తుంది తప్ప కథలకు కాలం చెల్లడం లాంటివి ఉండవని వివరణ ఇచ్చాడు.
ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన కమర్షియల్ కథలను స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు బ్లాక్ బస్టర్లు తీస్తున్న దర్శకులను చూస్తున్నాం కనక అన్ని అంశాలు సరైన స్థానంలో, సరైన రీతిలో కనక కూర్చుకుంటే ఖచ్చితంగా హిట్ అవుతాయని అన్నాడు. నాని చెప్పింది అక్షర సత్యం. ఎందుకంటే మాస్ ఆడియన్స్ అంచనాలు ఎన్ని దశాబ్దాలు గడిచినా ఒక మీటర్ లో ఉంటాయి. వాటిని అందుకోవడానికి నాలుగు ఫైట్లు, అయిదు పాటలు పెట్టేస్తే సరిపోదు. భలే తీశాడురా అనిపించాలి. మళ్ళీ ఇంకోసారి చూసేందుకు థియేటర్ కు వెళ్లాలని ఫిక్సవ్వాలి. అదే మాస్ మూవీని బ్లాక్ బస్టర్ స్థాయికి తీసుకెళ్తుంది.
ఇంత ప్రాక్టికల్ గా ఆలోచించడం వల్లే నాని సక్సెస్ రేట్ బాగా పెరుగుతోంది. దసరాతో ఊర మాస్ ట్రై చేసినా, హాయ్ నాన్నతో ఎమోషనల్ జానర్ కు వెళ్లినా విజయం వెంటే ఉంది. సరిపోదా శనివారంకొచ్చిన హైప్ కూడా ట్రైలర్ లో చూపించిన యాక్షన్ కంటెంట్ వల్లే. అంటే సుందరానికి అంచనాలు అందుకోలేకపోవడం గురించి ఓపెన్ గా నిజాలు మాట్లాడిన నాని ఇప్పుడు చెప్పిన కమర్షియల్ డెఫినెషన్ అక్షరాలా పాటించదగ్గది. ఆగస్ట్ 29 విడుదల కాబోతున్న సరిపోదా శనివారం ఖచ్చితంగా మెప్పిస్తుందనే నమ్మకం టీమ్ లో ఉన్న ప్రతిఒక్కరిలో కనిపిస్తోంది. నిజమవ్వాలనే అందరి ఆకాంక్ష.
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…