ప్రస్తుతం ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ అయిన ప్రభాస్.. విరామం లేకుండా సినిమాలు చేసుకుపోతున్నాడు. ఆ సినిమాల స్కేల్ వేరే లెవెల్లో ఉంటోంది. బాహుబలి తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కోవడంతో ప్రభాస్ను తక్కువ అంచనా వేశారు కానీ.. ఆ తర్వాత సలార్, కల్కి లాంటి బ్లాక్ బస్టర్లతో తన స్టామినా ఏంటో చూపించాడు ప్రభాస్. యంగ్ రెబల్ స్టార్ నుంచి తర్వాత ‘రాజా సాబ్’ మూవీ రాబోతోంది. అది వేసవి రిలీజ్ కన్ఫమ్ చేసుకుంది. దీని తర్వాత ప్రభాస్ ఏ సినిమాలో నటిస్తాడనే విషయంలో కొంత సస్పెన్స్ నెలకొంది.
ప్రశాంత్ నీల్తో సలార్-2 చేయాల్సి ఉంది. సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ కూడా లైన్లో ఉంది. కానీ వాటిని వెనక్కి నెట్టి ‘సీతారామం’ దర్శకుడు హను రాఘవపూడితో ‘ఫౌజి’ అనే వార్ బ్యాక్ డ్రాప్ ఉన్న లవ్ స్టోరీని ప్రభాస్ టేకప్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన సజల్ అలీ అనే పాకిస్థాన్ నటి కథానాయికగా నటించనున్నట్లు ఇంతకుముందు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే లేటెస్ట్గా మృణాల్ పేరు తెరపైకి వచ్చింది. ఓ నెటిజన్ ప్రభాస్తో మృణాల్ ఉన్న ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ‘ఫౌజి’ ఫస్ట్ లుక్ అని కామెంట్ పెట్టాడు. దీనిపై స్వయంగా మృణాల్ స్పందించడం విశేషం. “మీ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నందుకు సారీ. నేను ఈ ప్రాజెక్ట్లో లేను” అని మృణాల్ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో మృణాల్ ఫ్యాన్స్ కొంత డిజప్పాయింట్ అయ్యారు.
ఐతే ప్రభాస్ సరసన నటించలేదు కానీ.. మృణాల్ ఆల్రెడీ ప్రభాస్ సినిమాలో భాగం అయింది. ‘కల్కి’లో ఆమె ఒక క్యామియో రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ‘ఫౌజి’ విషయానికి వస్తే హను రాఘవపూడి ఒక ట్రూ ఇంటర్నేషనల్ మూవీని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భారీ యుద్ధ సన్నివేశాలు ఉంటాయట.
This post was last modified on August 14, 2024 4:10 pm
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…