ప్రస్తుతం ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ అయిన ప్రభాస్.. విరామం లేకుండా సినిమాలు చేసుకుపోతున్నాడు. ఆ సినిమాల స్కేల్ వేరే లెవెల్లో ఉంటోంది. బాహుబలి తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కోవడంతో ప్రభాస్ను తక్కువ అంచనా వేశారు కానీ.. ఆ తర్వాత సలార్, కల్కి లాంటి బ్లాక్ బస్టర్లతో తన స్టామినా ఏంటో చూపించాడు ప్రభాస్. యంగ్ రెబల్ స్టార్ నుంచి తర్వాత ‘రాజా సాబ్’ మూవీ రాబోతోంది. అది వేసవి రిలీజ్ కన్ఫమ్ చేసుకుంది. దీని తర్వాత ప్రభాస్ ఏ సినిమాలో నటిస్తాడనే విషయంలో కొంత సస్పెన్స్ నెలకొంది.
ప్రశాంత్ నీల్తో సలార్-2 చేయాల్సి ఉంది. సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ కూడా లైన్లో ఉంది. కానీ వాటిని వెనక్కి నెట్టి ‘సీతారామం’ దర్శకుడు హను రాఘవపూడితో ‘ఫౌజి’ అనే వార్ బ్యాక్ డ్రాప్ ఉన్న లవ్ స్టోరీని ప్రభాస్ టేకప్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన సజల్ అలీ అనే పాకిస్థాన్ నటి కథానాయికగా నటించనున్నట్లు ఇంతకుముందు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే లేటెస్ట్గా మృణాల్ పేరు తెరపైకి వచ్చింది. ఓ నెటిజన్ ప్రభాస్తో మృణాల్ ఉన్న ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ‘ఫౌజి’ ఫస్ట్ లుక్ అని కామెంట్ పెట్టాడు. దీనిపై స్వయంగా మృణాల్ స్పందించడం విశేషం. “మీ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నందుకు సారీ. నేను ఈ ప్రాజెక్ట్లో లేను” అని మృణాల్ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో మృణాల్ ఫ్యాన్స్ కొంత డిజప్పాయింట్ అయ్యారు.
ఐతే ప్రభాస్ సరసన నటించలేదు కానీ.. మృణాల్ ఆల్రెడీ ప్రభాస్ సినిమాలో భాగం అయింది. ‘కల్కి’లో ఆమె ఒక క్యామియో రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ‘ఫౌజి’ విషయానికి వస్తే హను రాఘవపూడి ఒక ట్రూ ఇంటర్నేషనల్ మూవీని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భారీ యుద్ధ సన్నివేశాలు ఉంటాయట.
This post was last modified on August 14, 2024 4:10 pm
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…