ప్రస్తుతం ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ అయిన ప్రభాస్.. విరామం లేకుండా సినిమాలు చేసుకుపోతున్నాడు. ఆ సినిమాల స్కేల్ వేరే లెవెల్లో ఉంటోంది. బాహుబలి తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కోవడంతో ప్రభాస్ను తక్కువ అంచనా వేశారు కానీ.. ఆ తర్వాత సలార్, కల్కి లాంటి బ్లాక్ బస్టర్లతో తన స్టామినా ఏంటో చూపించాడు ప్రభాస్. యంగ్ రెబల్ స్టార్ నుంచి తర్వాత ‘రాజా సాబ్’ మూవీ రాబోతోంది. అది వేసవి రిలీజ్ కన్ఫమ్ చేసుకుంది. దీని తర్వాత ప్రభాస్ ఏ సినిమాలో నటిస్తాడనే విషయంలో కొంత సస్పెన్స్ నెలకొంది.
ప్రశాంత్ నీల్తో సలార్-2 చేయాల్సి ఉంది. సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ కూడా లైన్లో ఉంది. కానీ వాటిని వెనక్కి నెట్టి ‘సీతారామం’ దర్శకుడు హను రాఘవపూడితో ‘ఫౌజి’ అనే వార్ బ్యాక్ డ్రాప్ ఉన్న లవ్ స్టోరీని ప్రభాస్ టేకప్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన సజల్ అలీ అనే పాకిస్థాన్ నటి కథానాయికగా నటించనున్నట్లు ఇంతకుముందు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే లేటెస్ట్గా మృణాల్ పేరు తెరపైకి వచ్చింది. ఓ నెటిజన్ ప్రభాస్తో మృణాల్ ఉన్న ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ‘ఫౌజి’ ఫస్ట్ లుక్ అని కామెంట్ పెట్టాడు. దీనిపై స్వయంగా మృణాల్ స్పందించడం విశేషం. “మీ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నందుకు సారీ. నేను ఈ ప్రాజెక్ట్లో లేను” అని మృణాల్ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో మృణాల్ ఫ్యాన్స్ కొంత డిజప్పాయింట్ అయ్యారు.
ఐతే ప్రభాస్ సరసన నటించలేదు కానీ.. మృణాల్ ఆల్రెడీ ప్రభాస్ సినిమాలో భాగం అయింది. ‘కల్కి’లో ఆమె ఒక క్యామియో రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ‘ఫౌజి’ విషయానికి వస్తే హను రాఘవపూడి ఒక ట్రూ ఇంటర్నేషనల్ మూవీని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భారీ యుద్ధ సన్నివేశాలు ఉంటాయట.
This post was last modified on %s = human-readable time difference 4:10 pm
తెలుగు ఎంట్రీని సీతారామం రూపంలో ఘనంగా జరుపుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కి ఆ తర్వాత హాయ్ నాన్న కూడా…
మాజీ మంత్రి కేటీఆర్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతలపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీపీసీసీ అధ్యక్షురాలు మధ్య ఆస్తి వివాదం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. సొంత…
టీడీపీ ఎమ్మెల్యేలు ఎంత చెబుతున్నా.. వినిపించుకోవడం లేదన్న ఆవేదన సీఎం చంద్రబాబులో కనిపి స్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు కీలక…
గత మూడు సీజన్లలో అన్ స్టాపబుల్ షో కోసం రామ్ చరణ్ వస్తాడేమోనని ఫ్యాన్స్ తెగ ఎదురు చూశారు కానీ…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా సంచలన లేఖ ఒకటి మీడియాకు విడుదల చేశారు. దీనిలో ప్రధానంగా ఆమె…