ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డాడని సోషల్ మీడియా వర్గాల్లో ప్రచారం జరగడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ప్రశాంత్ నీల్ సినిమా ఓపెనింగ్ జరిగి గంటల వ్యవధిలోనే ఇలా కావడం పట్ల టెన్షన్ పడ్డారు. కొందరు ఇది తీవ్రమైందిగా పేర్కొంటూ ట్విట్లు చేయడంతో ఫ్యాన్స్ మరింత ఒత్తిడికి లోనయ్యారు. అయితే గాయం కలిగిన మాట వాస్తవమే కానీ ఖంగారు పడాల్సింది ఏమి లేదని తారక్ అఫీషియల్ టీమ్ నుంచి క్లారిటీ రావడంతో అందరూ హమ్మయ్య అనుకున్నారు. రెండు రోజుల క్రితం జిమ్ చేస్తుండగా మణికట్టుకి గాయమయ్యాక సత్వర చికిత్స తీసుకోవడంతో ముప్పు తొలగిపోయింది.
ఇది జరిగాక తారక్ దేవర పార్ట్ 1 చివరి రోజు షూటింగ్ లో పాల్గొన్నాడు. నిజానికి వాయిదా వేసే అవకాశమున్న ఇతర ఆర్టిస్టుల కాంబినేషన్ తో పాటు ముందే ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ కావడం వల్ల బాధని భరించి సెట్లో అడుగు పెట్టాడు. సెప్టెంబర్ 27 విడుదల కాబోతున్న దేవర టీమ్ మీద చాలా ఒత్తిడి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్, ప్రమోషన్లు, ఈవెంట్లు, ట్రైలర్ లాంచ్ ఇలా బోలెడు కార్యక్రమాలు ప్రెజర్ పెంచుతున్నాయి. ఇలాంటి టైంలో షూట్ పోస్టుపోన్ అయితే నష్టం సంగతి తర్వాత జాప్యం పెరిగిపోతుంది. అందుకే జూనియర్ కొంచెం కష్టమనిపించినా సహకరించాడు.
సో తారక్ ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వొచ్చు. త్వరలోనే కోలుకుని వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాల్లో పాల్గొనబోతున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత దేవర పార్ట్ 2 మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఎప్పుడనేది అక్టోబర్ లో ప్రకటించే అవకాశం ఉంది. అయితే రిలీజ్ మాత్రం 2026 లేదా ఆపై సంవత్సరం తప్ప అంతకన్నా ముందు ఉండదు. సోలో హీరోగా అయిదేళ్ల గ్యాప్ ని భరించిన తారక్ బిగ్ స్క్రీన్ ఎంట్రీ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బిజినెస్ డీల్స్ ఒక్కొక్కటిగా ముగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హక్కులను సితార సంస్థ స్వంతం చేసుకోవడంతో భారీ రిలీజ్ దక్కనుంది.
This post was last modified on August 14, 2024 3:11 pm
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…