Political News

ఇప్పుడు ప్లేట్, ఫేట్ రెండూ మారుతున్నాయి

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చాలా ముందు చూపే ఉన్న‌ట్టుగా ఉంది. ఎప్పుడో రెండు మాసాల త‌ర్వాత జ‌రిగే ప‌రిణామాల‌ను ఆయ‌న ముందుగానే ప‌సిగ‌ట్టిన‌ట్టుగా ఉన్నారు. రెండు నెల‌ల త‌ర్వాత ఏం జ‌రుగుతుందో ఇప్పుడే అంచ‌నా వేసుకున్న‌ట్టుగా ఉన్నారు. అందుకే చాలా వ్యూహాత్మ‌కంగా జాతీయ స్థాయిలో రాజ‌కీయా ల‌ను క‌దుపుతున్నార‌న్న చ‌ర్చ సాగుతోంది. ముందు చూపుతోనే.. జ‌గ‌న్ ఇండియా కూట‌మి పార్టీల‌కు ట‌చ్‌లో ఉన్నార‌ని తాజాగా జ‌రుగుతున్న విశ్లేష‌ణ‌. ఇటీవ‌ల ఆయ‌న ఢిల్లీలో ధ‌ర్నా చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.

ఈ ధ‌ర్నాకు.. ఇండియా కూట‌మిలోని ఎస్పీ, ఆర్జేడీ, తృణ‌మూల్‌, శివ‌సేన త‌దిత‌ర పార్టీల‌కు చెందిన నాయ‌కులు వ‌చ్చారు. జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. అయితే.. అనూహ్యంగా జ‌గ‌న్ ఇలా ఎందుకు మారా రా? మోడీని వ‌దిలేసి ఇండియ కూట‌మి వెనుక ఎందుకు ప‌డ్డారా? అనే చ‌ర్చ కూడా తెర‌మీదికి వ‌చ్చింది. అయితే..అ ప్ప‌ట్లో అనేక విశ్లేష‌ణ‌లు వ‌చ్చినా.. ఇప్పుడు ఊహ‌కంద‌ని మ‌రో విష‌యం వెలుగు చూసింది. బీజేపీకి వైసీపీ అవ‌స‌రం ఉంటుంద‌ని కొన్నాళ్ల కింద‌ట విజ‌య‌సాయిరెడ్డి చెప్పిన విష‌యం గుర్తుండే ఉంటుంది.

“చంద్ర‌బాబుకు పార్ల‌మెంటులో 16 మంది ఎంపీలుంటే.. మాకు(వైసీపీ) 15 మంది ఎంపీలు ఉన్నారు. మేం ఎక్క‌డా త‌క్కువ‌కాదు” అని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అంటే.. వైసీపీకి రాజ్య‌స‌భ‌లో 11+లోక్‌స‌భ‌లో 4 క‌లుపుకొని ఆయ‌న అలా చెప్పారు. ఇది వాస్త‌వ‌మే. రాజ్య‌స‌భ‌లో టీడీపీకి స‌భ్యులే లేనందున‌.. త‌మ‌తో త‌ట‌స్థంగా ఉన్న వైసీపీకి క‌లుపుకొని వెళ్లేందుకు బీజేపీ స‌హ‌జంగానే ప్ర‌య‌త్నిస్తుంది. స్పీక‌ర్ ఎన్నిక స‌మ‌యంలో బీజేపీ నుంచి వైసీపీకి ఫోన్ రావ‌డానికి కార‌ణం ఇదే.

అందుకే జ‌గ‌న్‌కు.. ఇప్ప‌టివ‌ర‌కు భ‌రోసా ఉంది. అయితే.. ఇప్పుడు ప్లేట్, ఫేట్ రెండు మారుతున్నాయి. సెప్టెంబ‌రులో జ‌ర‌గ‌నున్న రాజ్య‌స‌భ ఎన్నికల్లో బీజేపీకి 11 మంది కొత్త స‌భ్యులు తోడ‌వుతారు. ఈ సంఖ్య వైసీపీతో స‌మానం. ఇక‌, ఇప్ప‌టికే ఉన్న మిత్ర‌ప‌క్షాల స‌భ్యుల‌తో క‌లిసి.. 126 మంది స‌భ్యులు బీజేపీకి అందుబాటులోకి వ‌స్తారు. ఇది భారీ మెజారిటీ. ఇక‌, ఇత‌ర పార్టీల‌తో(మిత్ర‌ప‌క్షాలుకాకుండా. వైసీపీ మిత్ర‌ప‌క్ష‌మే కానీ.. కూట‌మి పార్టీ కాదు) బీజేపీకి ప‌నిలేదు.

అప్పులు వైసీపీ ప‌ప్పులు ఉడికే ప‌రిస్థితి లేదు. బీజేపీ ఖ‌చ్చితంగా పక్క‌న పెడుతుంది. దీనిని గ్ర‌హించిన జ‌గ‌న్‌.. ఇప్ప‌టినుంచే ఇండియ కూట‌మికి చేరువ అవుతున్నార‌నేది తాజా విశ్లేష‌ణ‌. అంతేకాదు.. క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్‌తో భేటీ కావ‌డం వెనుక కూడా ఇదే వ్యూహం ఉండి ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. త‌ద్వారా.. బీజేపీ దూకుడును త‌గ్గించాల‌న్న‌ది జ‌గ‌న్ వ్యూహం. మ‌రి ఈ వ్యూహం స‌క్సెస్ అవుతుందా? ఫెయిల్ అవుతుందా? అనేది చూడాలి.

Satya

Recent Posts

స‌మంత స్టార్ ప‌వర్ క‌నిపిస్తోంది

తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్ల‌కు మాత్ర‌మే సాధ్య‌మైన స్టార్ ఇమేజ్ సంపాదించింది స‌మంత‌. విజ‌య‌శాంతి, అనుష్క‌ల త‌ర్వాత హీరోల‌తో…

35 minutes ago

ఇండియాలో ఆల్ టైం రికార్డు దిశ‌గా అబ్సెష‌న్

కేవ‌లం ప‌ది కోట్ల బ‌డ్జెట్లో తెర‌కెక్కిన సినిమా.. అబ్సెష‌న్. ఈ హాలీవుడ్ హార్ర‌ర్ మూవీ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి వ‌ర‌ల్డ్ వైడ్…

3 hours ago

తొందరపాటు ఎందుకు పెద్ది

స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…

4 hours ago

వరప్రసాద్ స్నేహితులకు క్లాష్ తప్పదా

సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…

5 hours ago

ఫౌజీ బాటలో ముళ్లచెట్ల బ్రేకులు

హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…

6 hours ago

ఆంధ్రాకి ఆరు ఆడ పులులు కోరిన పవన్

రాష్ట్రంలో అట‌వీ సంప‌ద‌ను కాపాడ‌డంతోపాటు.. వన్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌కు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్య‌మంత్రి, అట‌వీ శాఖ మంత్రి ప‌వ‌న్…

6 hours ago