వైసీపీ అధినేత జగన్కు చాలా ముందు చూపే ఉన్నట్టుగా ఉంది. ఎప్పుడో రెండు మాసాల తర్వాత జరిగే పరిణామాలను ఆయన ముందుగానే పసిగట్టినట్టుగా ఉన్నారు. రెండు నెలల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే అంచనా వేసుకున్నట్టుగా ఉన్నారు. అందుకే చాలా వ్యూహాత్మకంగా జాతీయ స్థాయిలో రాజకీయా లను కదుపుతున్నారన్న చర్చ సాగుతోంది. ముందు చూపుతోనే.. జగన్ ఇండియా కూటమి పార్టీలకు టచ్లో ఉన్నారని తాజాగా జరుగుతున్న విశ్లేషణ. ఇటీవల ఆయన ఢిల్లీలో ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ ధర్నాకు.. ఇండియా కూటమిలోని ఎస్పీ, ఆర్జేడీ, తృణమూల్, శివసేన తదితర పార్టీలకు చెందిన నాయకులు వచ్చారు. జగన్కు మద్దతుగా నిలిచారు. అయితే.. అనూహ్యంగా జగన్ ఇలా ఎందుకు మారా రా? మోడీని వదిలేసి ఇండియ కూటమి వెనుక ఎందుకు పడ్డారా? అనే చర్చ కూడా తెరమీదికి వచ్చింది. అయితే..అ ప్పట్లో అనేక విశ్లేషణలు వచ్చినా.. ఇప్పుడు ఊహకందని మరో విషయం వెలుగు చూసింది. బీజేపీకి వైసీపీ అవసరం ఉంటుందని కొన్నాళ్ల కిందట విజయసాయిరెడ్డి చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.
“చంద్రబాబుకు పార్లమెంటులో 16 మంది ఎంపీలుంటే.. మాకు(వైసీపీ) 15 మంది ఎంపీలు ఉన్నారు. మేం ఎక్కడా తక్కువకాదు” అని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అంటే.. వైసీపీకి రాజ్యసభలో 11+లోక్సభలో 4 కలుపుకొని ఆయన అలా చెప్పారు. ఇది వాస్తవమే. రాజ్యసభలో టీడీపీకి సభ్యులే లేనందున.. తమతో తటస్థంగా ఉన్న వైసీపీకి కలుపుకొని వెళ్లేందుకు బీజేపీ సహజంగానే ప్రయత్నిస్తుంది. స్పీకర్ ఎన్నిక సమయంలో బీజేపీ నుంచి వైసీపీకి ఫోన్ రావడానికి కారణం ఇదే.
అందుకే జగన్కు.. ఇప్పటివరకు భరోసా ఉంది. అయితే.. ఇప్పుడు ప్లేట్, ఫేట్ రెండు మారుతున్నాయి. సెప్టెంబరులో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి 11 మంది కొత్త సభ్యులు తోడవుతారు. ఈ సంఖ్య వైసీపీతో సమానం. ఇక, ఇప్పటికే ఉన్న మిత్రపక్షాల సభ్యులతో కలిసి.. 126 మంది సభ్యులు బీజేపీకి అందుబాటులోకి వస్తారు. ఇది భారీ మెజారిటీ. ఇక, ఇతర పార్టీలతో(మిత్రపక్షాలుకాకుండా. వైసీపీ మిత్రపక్షమే కానీ.. కూటమి పార్టీ కాదు) బీజేపీకి పనిలేదు.
అప్పులు వైసీపీ పప్పులు ఉడికే పరిస్థితి లేదు. బీజేపీ ఖచ్చితంగా పక్కన పెడుతుంది. దీనిని గ్రహించిన జగన్.. ఇప్పటినుంచే ఇండియ కూటమికి చేరువ అవుతున్నారనేది తాజా విశ్లేషణ. అంతేకాదు.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో భేటీ కావడం వెనుక కూడా ఇదే వ్యూహం ఉండి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. తద్వారా.. బీజేపీ దూకుడును తగ్గించాలన్నది జగన్ వ్యూహం. మరి ఈ వ్యూహం సక్సెస్ అవుతుందా? ఫెయిల్ అవుతుందా? అనేది చూడాలి.
This post was last modified on August 14, 2024 3:13 pm
ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా…
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…