Political News

ఇప్పుడు ప్లేట్, ఫేట్ రెండూ మారుతున్నాయి

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చాలా ముందు చూపే ఉన్న‌ట్టుగా ఉంది. ఎప్పుడో రెండు మాసాల త‌ర్వాత జ‌రిగే ప‌రిణామాల‌ను ఆయ‌న ముందుగానే ప‌సిగ‌ట్టిన‌ట్టుగా ఉన్నారు. రెండు నెల‌ల త‌ర్వాత ఏం జ‌రుగుతుందో ఇప్పుడే అంచ‌నా వేసుకున్న‌ట్టుగా ఉన్నారు. అందుకే చాలా వ్యూహాత్మ‌కంగా జాతీయ స్థాయిలో రాజ‌కీయా ల‌ను క‌దుపుతున్నార‌న్న చ‌ర్చ సాగుతోంది. ముందు చూపుతోనే.. జ‌గ‌న్ ఇండియా కూట‌మి పార్టీల‌కు ట‌చ్‌లో ఉన్నార‌ని తాజాగా జ‌రుగుతున్న విశ్లేష‌ణ‌. ఇటీవ‌ల ఆయ‌న ఢిల్లీలో ధ‌ర్నా చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.

ఈ ధ‌ర్నాకు.. ఇండియా కూట‌మిలోని ఎస్పీ, ఆర్జేడీ, తృణ‌మూల్‌, శివ‌సేన త‌దిత‌ర పార్టీల‌కు చెందిన నాయ‌కులు వ‌చ్చారు. జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. అయితే.. అనూహ్యంగా జ‌గ‌న్ ఇలా ఎందుకు మారా రా? మోడీని వ‌దిలేసి ఇండియ కూట‌మి వెనుక ఎందుకు ప‌డ్డారా? అనే చ‌ర్చ కూడా తెర‌మీదికి వ‌చ్చింది. అయితే..అ ప్ప‌ట్లో అనేక విశ్లేష‌ణ‌లు వ‌చ్చినా.. ఇప్పుడు ఊహ‌కంద‌ని మ‌రో విష‌యం వెలుగు చూసింది. బీజేపీకి వైసీపీ అవ‌స‌రం ఉంటుంద‌ని కొన్నాళ్ల కింద‌ట విజ‌య‌సాయిరెడ్డి చెప్పిన విష‌యం గుర్తుండే ఉంటుంది.

“చంద్ర‌బాబుకు పార్ల‌మెంటులో 16 మంది ఎంపీలుంటే.. మాకు(వైసీపీ) 15 మంది ఎంపీలు ఉన్నారు. మేం ఎక్క‌డా త‌క్కువ‌కాదు” అని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అంటే.. వైసీపీకి రాజ్య‌స‌భ‌లో 11+లోక్‌స‌భ‌లో 4 క‌లుపుకొని ఆయ‌న అలా చెప్పారు. ఇది వాస్త‌వ‌మే. రాజ్య‌స‌భ‌లో టీడీపీకి స‌భ్యులే లేనందున‌.. త‌మ‌తో త‌ట‌స్థంగా ఉన్న వైసీపీకి క‌లుపుకొని వెళ్లేందుకు బీజేపీ స‌హ‌జంగానే ప్ర‌య‌త్నిస్తుంది. స్పీక‌ర్ ఎన్నిక స‌మ‌యంలో బీజేపీ నుంచి వైసీపీకి ఫోన్ రావ‌డానికి కార‌ణం ఇదే.

అందుకే జ‌గ‌న్‌కు.. ఇప్ప‌టివ‌ర‌కు భ‌రోసా ఉంది. అయితే.. ఇప్పుడు ప్లేట్, ఫేట్ రెండు మారుతున్నాయి. సెప్టెంబ‌రులో జ‌ర‌గ‌నున్న రాజ్య‌స‌భ ఎన్నికల్లో బీజేపీకి 11 మంది కొత్త స‌భ్యులు తోడ‌వుతారు. ఈ సంఖ్య వైసీపీతో స‌మానం. ఇక‌, ఇప్ప‌టికే ఉన్న మిత్ర‌ప‌క్షాల స‌భ్యుల‌తో క‌లిసి.. 126 మంది స‌భ్యులు బీజేపీకి అందుబాటులోకి వ‌స్తారు. ఇది భారీ మెజారిటీ. ఇక‌, ఇత‌ర పార్టీల‌తో(మిత్ర‌ప‌క్షాలుకాకుండా. వైసీపీ మిత్ర‌ప‌క్ష‌మే కానీ.. కూట‌మి పార్టీ కాదు) బీజేపీకి ప‌నిలేదు.

అప్పులు వైసీపీ ప‌ప్పులు ఉడికే ప‌రిస్థితి లేదు. బీజేపీ ఖ‌చ్చితంగా పక్క‌న పెడుతుంది. దీనిని గ్ర‌హించిన జ‌గ‌న్‌.. ఇప్ప‌టినుంచే ఇండియ కూట‌మికి చేరువ అవుతున్నార‌నేది తాజా విశ్లేష‌ణ‌. అంతేకాదు.. క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్‌తో భేటీ కావ‌డం వెనుక కూడా ఇదే వ్యూహం ఉండి ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. త‌ద్వారా.. బీజేపీ దూకుడును త‌గ్గించాల‌న్న‌ది జ‌గ‌న్ వ్యూహం. మ‌రి ఈ వ్యూహం స‌క్సెస్ అవుతుందా? ఫెయిల్ అవుతుందా? అనేది చూడాలి.

This post was last modified on August 14, 2024 3:13 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

40 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago