ఏపీలో చంద్రబాబు కూటమి సర్కారు.. ఇక ఈ-పాలన దిశగా అడుగులు వేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఫిజికల్గా తీసుకునే నిర్ణయాలు.. సమీక్షలు, సమావేశాలు ప్రజల సమస్యలను చర్చించేందుకు ఎంతగానో ఉపయోగ పడుతున్నారు. కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు కూడా దోహదపడుతున్నాయి. ఇక, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించేందుకు కూడా ఈ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే.. ఒక్కొక్కసారి కీలక మంత్రులు అనివార్య కారణాలతో సమీక్షా సమావేశాలకు, మంత్రి మండలి సమావేశాలకు కూడా రాలేక పోతున్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకున్నసీఎం చంద్రబాబు.. ఇప్పుడు ‘ఈ-పాలన’కు శ్రీకారం చుట్టేందుకు రెడీ అయ్యారు. ఒకవైపు ఫిజికల్ పాలన కొనసాగిస్తూనే.. మరోవైపు.. ఈ-పాలన ద్వారా మరింత మెరుగులు అద్దనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులకు, సీనియర్ అధికారులకు ఐప్యాడ్లు, ల్యాప్టాప్లు, అధునాతన ఐ-ఫోన్లను కొనుగోలు చేసి ఇవ్వనున్నారు. తద్వారా.. మంత్రులు ఎక్కడ ఉన్నా.. ఈ-సమావేశాలకు హాజరయ్యే అవకాశం కల్పించనున్నారు. ఫలితంగా వారి శాఖ వివరాలను మంత్రులు క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఉండనుంది.
ఒక్కొక్కసారి తుఫాన్లు, ఇతర కారణాలతో అధికారులు సైతం కీలక సమావేశాలకు రాలేని పరిస్థితి, సమయం పాటించలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీనిని అరికట్టేందుకు కూడా ఈ-పాలన ఉపయోగపడుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా పాలన అంతా పారదర్శకంగా సాగేందుకు.. అన్ని ఫైళ్లను ఎలక్ట్రానిక్ రూపంలో అందుబాటులో(అధికారులు-మంత్రులకు) ఉంచనున్నారు. తద్వారా సత్వరమే నిర్ణయం తీసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. దీనివల్ల పాలనలో వేగం, పారదర్శకత కూడా కనిపిస్తాయన్నది చంద్రబాబు ఆలోచన.
This post was last modified on August 14, 2024 12:32 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…