ఏపీలో చంద్రబాబు కూటమి సర్కారు.. ఇక ఈ-పాలన దిశగా అడుగులు వేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఫిజికల్గా తీసుకునే నిర్ణయాలు.. సమీక్షలు, సమావేశాలు ప్రజల సమస్యలను చర్చించేందుకు ఎంతగానో ఉపయోగ పడుతున్నారు. కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు కూడా దోహదపడుతున్నాయి. ఇక, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించేందుకు కూడా ఈ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే.. ఒక్కొక్కసారి కీలక మంత్రులు అనివార్య కారణాలతో సమీక్షా సమావేశాలకు, మంత్రి మండలి సమావేశాలకు కూడా రాలేక పోతున్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకున్నసీఎం చంద్రబాబు.. ఇప్పుడు ‘ఈ-పాలన’కు శ్రీకారం చుట్టేందుకు రెడీ అయ్యారు. ఒకవైపు ఫిజికల్ పాలన కొనసాగిస్తూనే.. మరోవైపు.. ఈ-పాలన ద్వారా మరింత మెరుగులు అద్దనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులకు, సీనియర్ అధికారులకు ఐప్యాడ్లు, ల్యాప్టాప్లు, అధునాతన ఐ-ఫోన్లను కొనుగోలు చేసి ఇవ్వనున్నారు. తద్వారా.. మంత్రులు ఎక్కడ ఉన్నా.. ఈ-సమావేశాలకు హాజరయ్యే అవకాశం కల్పించనున్నారు. ఫలితంగా వారి శాఖ వివరాలను మంత్రులు క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఉండనుంది.
ఒక్కొక్కసారి తుఫాన్లు, ఇతర కారణాలతో అధికారులు సైతం కీలక సమావేశాలకు రాలేని పరిస్థితి, సమయం పాటించలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీనిని అరికట్టేందుకు కూడా ఈ-పాలన ఉపయోగపడుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా పాలన అంతా పారదర్శకంగా సాగేందుకు.. అన్ని ఫైళ్లను ఎలక్ట్రానిక్ రూపంలో అందుబాటులో(అధికారులు-మంత్రులకు) ఉంచనున్నారు. తద్వారా సత్వరమే నిర్ణయం తీసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. దీనివల్ల పాలనలో వేగం, పారదర్శకత కూడా కనిపిస్తాయన్నది చంద్రబాబు ఆలోచన.
This post was last modified on August 14, 2024 12:32 pm
దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…
అదేంటి రాజకీయాల్లో గెలిచిన తర్వాత విజయ్ ఇక సినిమాల్లో నటించడు కదా, మరి నిర్మాతలకు పండగ ఏమిటనుకుంటున్నారా. తమిళనాడు ముఖ్యమంత్రిగా…
కొత్త ఏడాదిలో అయిదో నెల వచ్చేసింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ సరైన ఊపు కోసం ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ కు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.…