ఏపీలో చంద్రబాబు కూటమి సర్కారు.. ఇక ఈ-పాలన దిశగా అడుగులు వేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఫిజికల్గా తీసుకునే నిర్ణయాలు.. సమీక్షలు, సమావేశాలు ప్రజల సమస్యలను చర్చించేందుకు ఎంతగానో ఉపయోగ పడుతున్నారు. కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు కూడా దోహదపడుతున్నాయి. ఇక, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించేందుకు కూడా ఈ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే.. ఒక్కొక్కసారి కీలక మంత్రులు అనివార్య కారణాలతో సమీక్షా సమావేశాలకు, మంత్రి మండలి సమావేశాలకు కూడా రాలేక పోతున్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకున్నసీఎం చంద్రబాబు.. ఇప్పుడు ‘ఈ-పాలన’కు శ్రీకారం చుట్టేందుకు రెడీ అయ్యారు. ఒకవైపు ఫిజికల్ పాలన కొనసాగిస్తూనే.. మరోవైపు.. ఈ-పాలన ద్వారా మరింత మెరుగులు అద్దనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులకు, సీనియర్ అధికారులకు ఐప్యాడ్లు, ల్యాప్టాప్లు, అధునాతన ఐ-ఫోన్లను కొనుగోలు చేసి ఇవ్వనున్నారు. తద్వారా.. మంత్రులు ఎక్కడ ఉన్నా.. ఈ-సమావేశాలకు హాజరయ్యే అవకాశం కల్పించనున్నారు. ఫలితంగా వారి శాఖ వివరాలను మంత్రులు క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఉండనుంది.
ఒక్కొక్కసారి తుఫాన్లు, ఇతర కారణాలతో అధికారులు సైతం కీలక సమావేశాలకు రాలేని పరిస్థితి, సమయం పాటించలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీనిని అరికట్టేందుకు కూడా ఈ-పాలన ఉపయోగపడుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా పాలన అంతా పారదర్శకంగా సాగేందుకు.. అన్ని ఫైళ్లను ఎలక్ట్రానిక్ రూపంలో అందుబాటులో(అధికారులు-మంత్రులకు) ఉంచనున్నారు. తద్వారా సత్వరమే నిర్ణయం తీసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. దీనివల్ల పాలనలో వేగం, పారదర్శకత కూడా కనిపిస్తాయన్నది చంద్రబాబు ఆలోచన.
This post was last modified on August 14, 2024 12:32 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…