ఏపీలో చంద్రబాబు కూటమి సర్కారు.. ఇక ఈ-పాలన దిశగా అడుగులు వేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఫిజికల్గా తీసుకునే నిర్ణయాలు.. సమీక్షలు, సమావేశాలు ప్రజల సమస్యలను చర్చించేందుకు ఎంతగానో ఉపయోగ పడుతున్నారు. కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు కూడా దోహదపడుతున్నాయి. ఇక, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించేందుకు కూడా ఈ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే.. ఒక్కొక్కసారి కీలక మంత్రులు అనివార్య కారణాలతో సమీక్షా సమావేశాలకు, మంత్రి మండలి సమావేశాలకు కూడా రాలేక పోతున్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకున్నసీఎం చంద్రబాబు.. ఇప్పుడు ‘ఈ-పాలన’కు శ్రీకారం చుట్టేందుకు రెడీ అయ్యారు. ఒకవైపు ఫిజికల్ పాలన కొనసాగిస్తూనే.. మరోవైపు.. ఈ-పాలన ద్వారా మరింత మెరుగులు అద్దనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులకు, సీనియర్ అధికారులకు ఐప్యాడ్లు, ల్యాప్టాప్లు, అధునాతన ఐ-ఫోన్లను కొనుగోలు చేసి ఇవ్వనున్నారు. తద్వారా.. మంత్రులు ఎక్కడ ఉన్నా.. ఈ-సమావేశాలకు హాజరయ్యే అవకాశం కల్పించనున్నారు. ఫలితంగా వారి శాఖ వివరాలను మంత్రులు క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఉండనుంది.
ఒక్కొక్కసారి తుఫాన్లు, ఇతర కారణాలతో అధికారులు సైతం కీలక సమావేశాలకు రాలేని పరిస్థితి, సమయం పాటించలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీనిని అరికట్టేందుకు కూడా ఈ-పాలన ఉపయోగపడుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా పాలన అంతా పారదర్శకంగా సాగేందుకు.. అన్ని ఫైళ్లను ఎలక్ట్రానిక్ రూపంలో అందుబాటులో(అధికారులు-మంత్రులకు) ఉంచనున్నారు. తద్వారా సత్వరమే నిర్ణయం తీసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. దీనివల్ల పాలనలో వేగం, పారదర్శకత కూడా కనిపిస్తాయన్నది చంద్రబాబు ఆలోచన.
This post was last modified on August 14, 2024 12:32 pm
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…