నిన్న విడుదలైన కమిటీ కుర్రోళ్ళు డీసెంట్ టాక్ తో ఉన్నవాటిలో మెరుగైన కలెక్షన్లతో జనాన్ని రప్పిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత ఆశాజనకంగా లేకపోయినా ప్రీమియర్, మార్నింగ్ షో టాక్ బయటికి వచ్చాక పరిస్థితిలో మార్పు వచ్చింది. సగటున రోజుకు పదహారు వేలకు పైగా బుక్ మై షో టికెట్లు అమ్ముడుపోతున్నాయి. హైదరాబాద్ లోనే ఈ ట్రెండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ క్రమంగా బిసి సెంటర్లలోనూ ఊపందుకుంటుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే కమిటి కుర్రోళ్ళు జోరు తగ్గించేందుకే అన్నట్టు ఒక అడ్డంకి మహా ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం. అదే మురారి.
ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన మురారిని చూసేందుకు క్లాసు మాసు ఎగబడుతున్నారు. చాలా ఏరియాల్లో రికార్డు కలెక్షన్లు నమోదయ్యాయి. ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో బిజినెస్ మెన్, ఆరంజ్, ఖుషి తాలూకు రీ రిలీజ్ రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఒకవేళ మురారి కనక లేకపోయి ఈ సినిమా చూసిన ప్రేక్షకుల్లో కనీసం ఒక పాతిక శాతం కమిటీ కుర్రాళ్ళకు వచ్చినా ఫిగర్లలో పెద్ద మార్పు కనిపించేది. స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం దీనికో ప్రతిబంధకంగా మారినా క్రమంగా పెరుగుతున్న టాక్ ఇంకో వారం రోజుల్లోపు సూపర్ హిట్ దిశగా తీసుకెళ్తుందో లేదో చూడాలి.
వచ్చే వారం ఆగస్ట్ 15 భారీ పోటీ నెలకొన్న నేపథ్యంలో కమిటీ కుర్రోళ్ళకు ఫస్ట్ వీక్ చాలా కీలకం. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగలాన్, ఆయ్ లు వస్తున్న నేపథ్యంలో ఎంతమేరకు సెకండ్ వీక్ థియేటర్లను కుర్రోళ్ళు హోల్డ్ చేసుకుంటారో చెప్పలేం. రీ రిలీజులు కొత్త వాటి మీద ప్రభావం చూపిస్తున్నాయని గత ఏడాది కొన్ని సందర్భాలు ఋజువు చేశాక ఆ ట్రెండ్ మళ్ళీ ఊపందుకోలేదు. కానీ మురారి తిరిగి దానికి ఊపు తీసుకొచ్చింది. స్టార్ హీరోలైతే వీటిని తట్టుకోగలరు కానీ కమిటీ కుర్రాళ్ళ లాంటి చిన్న క్యాస్టింగ్ మూవీ ఎదురీదడం అంత సులభం కాదు. చూడాలి ఏమవుతుందో.
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…