నిన్న విడుదలైన కమిటీ కుర్రోళ్ళు డీసెంట్ టాక్ తో ఉన్నవాటిలో మెరుగైన కలెక్షన్లతో జనాన్ని రప్పిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత ఆశాజనకంగా లేకపోయినా ప్రీమియర్, మార్నింగ్ షో టాక్ బయటికి వచ్చాక పరిస్థితిలో మార్పు వచ్చింది. సగటున రోజుకు పదహారు వేలకు పైగా బుక్ మై షో టికెట్లు అమ్ముడుపోతున్నాయి. హైదరాబాద్ లోనే ఈ ట్రెండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ క్రమంగా బిసి సెంటర్లలోనూ ఊపందుకుంటుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే కమిటి కుర్రోళ్ళు జోరు తగ్గించేందుకే అన్నట్టు ఒక అడ్డంకి మహా ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం. అదే మురారి.
ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన మురారిని చూసేందుకు క్లాసు మాసు ఎగబడుతున్నారు. చాలా ఏరియాల్లో రికార్డు కలెక్షన్లు నమోదయ్యాయి. ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో బిజినెస్ మెన్, ఆరంజ్, ఖుషి తాలూకు రీ రిలీజ్ రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఒకవేళ మురారి కనక లేకపోయి ఈ సినిమా చూసిన ప్రేక్షకుల్లో కనీసం ఒక పాతిక శాతం కమిటీ కుర్రాళ్ళకు వచ్చినా ఫిగర్లలో పెద్ద మార్పు కనిపించేది. స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం దీనికో ప్రతిబంధకంగా మారినా క్రమంగా పెరుగుతున్న టాక్ ఇంకో వారం రోజుల్లోపు సూపర్ హిట్ దిశగా తీసుకెళ్తుందో లేదో చూడాలి.
వచ్చే వారం ఆగస్ట్ 15 భారీ పోటీ నెలకొన్న నేపథ్యంలో కమిటీ కుర్రోళ్ళకు ఫస్ట్ వీక్ చాలా కీలకం. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగలాన్, ఆయ్ లు వస్తున్న నేపథ్యంలో ఎంతమేరకు సెకండ్ వీక్ థియేటర్లను కుర్రోళ్ళు హోల్డ్ చేసుకుంటారో చెప్పలేం. రీ రిలీజులు కొత్త వాటి మీద ప్రభావం చూపిస్తున్నాయని గత ఏడాది కొన్ని సందర్భాలు ఋజువు చేశాక ఆ ట్రెండ్ మళ్ళీ ఊపందుకోలేదు. కానీ మురారి తిరిగి దానికి ఊపు తీసుకొచ్చింది. స్టార్ హీరోలైతే వీటిని తట్టుకోగలరు కానీ కమిటీ కుర్రాళ్ళ లాంటి చిన్న క్యాస్టింగ్ మూవీ ఎదురీదడం అంత సులభం కాదు. చూడాలి ఏమవుతుందో.
This post was last modified on August 10, 2024 11:24 am
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…