న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సరిపోదా శనివారం విడుదల దగ్గర పడుతోంది. ఆగస్ట్ 29 ఎంతో దూరంలో లేకపోవడం టీమ్ ప్రమోషన్ల వేగం పెంచింది. నాని టీవీ ఛానల్స్ కు వెళ్లి పబ్లిసిటీ పెంచే పనిలో ఉండగా ఎస్జె సూర్య స్పెషల్ గా హైదరాబాద్ లోనే ఉంటూ ఇంటర్వ్యూలిస్తున్నాడు. ఇండిపెండెన్స్ డేకి వచ్చే డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ లు ఆ టైంకంతా నెమ్మదిస్తాయి కాబట్టి నానికి సోలో రిలీజ్ దక్కనుంది. పోటీ ఏం లేదు. ప్యాన్ ఇండియా రిలీజ్ కావడంతో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు భారీ ఎత్తున థియేటర్లను లాక్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.
ఇక ఎస్జె సూర్య ఈ సినిమా కథకు సంబంధించినకొన్ని ముఖ్యమైన క్లూస్ ఇవ్వడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. వాటితో పాటు కొన్ని లీక్స్ స్టోరీ లైన్ కి రూపాన్నిస్తున్నాయి. తల్లికిచ్చిన మాట మేరకు వారంలో 6 రోజులు కోపాన్ని అణుచుకునే సూర్య శనివారం మాత్రం తన ఉగ్ర రూపాన్ని బయటికి తీస్తాడు. ఎవడెవడు ఏమేం చేశాడో రాసుకుని మరీ వాళ్ళ లెక్కని వీకెండ్ లో సరిచేస్తాడు. సోకులపాలెంలో నివసించే నాని కుటుంబం చుట్టూ పేదలు ఉంటారు. వాళ్ళ పాలిట రాక్షసుడిగా మారిన ఒక పోలీస్ ఆఫీసర్ ని కేవలం ఒక్క రోజు మాత్రమే ఎదిరించే సమస్యతో ఎలా కట్టడి చేస్తాడనేదే స్టోరీ పాయింట్ గా తెలుస్తోంది.
పైకి నాని వర్సెస్ ఎస్జె సూర్య యుద్ధంలా కనిపించినా ఇందులో బోలెడు చోటా విలన్లు ఉంటారట. దసరాలో చూసిన నాని వయొలెంట్ పాత్రకు మించి ఇందులో స్టయిలిష్ యాక్షన్ ని వివేక్ ఆత్రేయ డిజైన్ చేశారని ఇన్ సైడ్ టాక్. అందుకే హాయ్ నాన్న తర్వాత ఏడు నెలల గ్యాప్ వచ్చినా కూడా నాని ఓపికగా ఎదురుచూశాడని, ఫలితం మీద అంత నమ్మకం వచ్చేసిందని సన్నిహితులు అంటున్నారు. ఒకవేళ సరిపోదా శనివారం కనక మల్టీలాంగ్వేజెస్ లో వర్కౌట్ అయితే ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో రాబోయే ప్యాన్ ఇండియా మూవీకి బజ్ పరంగా చాలా ఉపయోగపడుతుంది. చూద్దాం.
This post was last modified on August 8, 2024 2:12 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…