టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు కలుసుకున్నారు. సోమవారం అమరావతికి వచ్చిన తుమ్మల.. చంద్రబాబుతో భేటీ అయ్యారు. వాస్తవానికి.. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ అమరావతిలో పర్యటించిన నేపథ్యంలో చంద్రబాబు తీరిక లేకుండా ఉన్నారు. అయినా కూడా తన పాత మిత్రుడు, తెలంగాణ మంత్రి రావడంతో తీరిక చేసుకుని మరీ ఆయనతో మాట్లాడారు.
బలమైన స్నేహం..
టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్న తుమ్మల నాగేశ్వరరావు.. ఖమ్మం నుంచి పలుమార్లు విజయం సాధించారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో తుమ్మల మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఇక, తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆయన టీడీపీలోనే ఉన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత.. 2014లో టీడీపీని వీడి అప్పటి టీఆర్ ఎస్లో చేరిపోయారు. ఆ తర్వాత.. మంత్రి పీఠాన్ని కూడా దక్కించుకున్నారు. అయితే.. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ ఎస్ ఆయనను దూరం పెట్టింది. దీంతో గత 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని విజయం దక్కించుకున్నారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు.
చంద్రబాబుపై పన్నెత్తు విమర్శలు చేయని తుమ్మల.. రాజకీయంగా విభేదించినా.. వ్యక్తిగతంగా చంద్రబాబుకు చేరువగానే ఉన్నారు. కాగా.. సుదీర్ఘ కాలం తర్వాత చంద్రబాబుతో భేటీ అయిన తుమ్మల.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనకు నివేదిక ఇచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి సహకరించాలని విన్నవించారు.
ఇవీ.. వినతులు!
This post was last modified on February 17, 2026 12:15 am
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంతకుముందులా ఉదారంగా కొత్త సినిమాలను కొనట్లేదన్న సంగతి తెలిసిందే. నిర్మాతలు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫర్…
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…