టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు కలుసుకున్నారు. సోమవారం అమరావతికి వచ్చిన తుమ్మల.. చంద్రబాబుతో భేటీ అయ్యారు. వాస్తవానికి.. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ అమరావతిలో పర్యటించిన నేపథ్యంలో చంద్రబాబు తీరిక లేకుండా ఉన్నారు. అయినా కూడా తన పాత మిత్రుడు, తెలంగాణ మంత్రి రావడంతో తీరిక చేసుకుని మరీ ఆయనతో మాట్లాడారు.
బలమైన స్నేహం..
టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్న తుమ్మల నాగేశ్వరరావు.. ఖమ్మం నుంచి పలుమార్లు విజయం సాధించారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో తుమ్మల మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఇక, తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆయన టీడీపీలోనే ఉన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత.. 2014లో టీడీపీని వీడి అప్పటి టీఆర్ ఎస్లో చేరిపోయారు. ఆ తర్వాత.. మంత్రి పీఠాన్ని కూడా దక్కించుకున్నారు. అయితే.. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ ఎస్ ఆయనను దూరం పెట్టింది. దీంతో గత 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని విజయం దక్కించుకున్నారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు.
చంద్రబాబుపై పన్నెత్తు విమర్శలు చేయని తుమ్మల.. రాజకీయంగా విభేదించినా.. వ్యక్తిగతంగా చంద్రబాబుకు చేరువగానే ఉన్నారు. కాగా.. సుదీర్ఘ కాలం తర్వాత చంద్రబాబుతో భేటీ అయిన తుమ్మల.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనకు నివేదిక ఇచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి సహకరించాలని విన్నవించారు.
ఇవీ.. వినతులు!
This post was last modified on February 17, 2026 12:15 am
రాజకీయాల్లో జంపింగులు కొత్తకాదు. ఎవరికి నచ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవడమూ కొత్తకాదు. ఎవరికి అవసరం.. అవకాశం ఉన్న దిశగా నాయకులు,…
ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ కనిపించడం లేదా? ఏ వర్గం కూడా వైసీపీకి ఆశించిన మేరకు చేరువ అయ్యే అవకాశం…
గత రెండు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేస్తోంది ‘దురంధర్-2’ సినిమా. దేశ విదేశాల్లో ఈ సినిమా ప్రభంజనం మామూలుగా…
గతంలో నెల మారుతున్నా.. ఏడాది మారుతున్నా నిబంధనల్లో మార్పులు పెద్దగా ఉండేవి కావు. ఇటీవల కాలంలో ఆ తీరులో పెను…
ఆపన్న హస్తం అందించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనదైన శైలి స్పీదును చూపిస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి ఏదో హామీ…
జనవరి సంక్రాంతి పండక్కు రావాల్సిన జన నాయకుడు వాయిదా పడి మూడు నెలలు గడిచిపోయాయి. ఒక స్టార్ హీరో సినిమా…