ఎనర్జిటిక్ స్టార్ రామ్, దర్శకుడు పూరి జగన్నాధ్ కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద బ్లాక్ బస్టరో అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ కూడా అంత సులభంగా మర్చిపోలేరు. రేసులో వెనుకబడిన మణిశర్మని ఒక్కసారిగా ఫామ్ లోకి తీసుకొచ్చిన మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా దీనికి ఫ్యాన్స్ ప్రత్యేక స్థానం ఇస్తారు. అందుకే కొనసాగింపుగా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ మీద ప్రేక్షకుల్లో మాములు అంచనాలు లేవు. ఆగస్ట్ 15 భారీ పోటీ మధ్య వస్తున్న ఈ మాస్ ఎంటర్ టైనర్ హైప్ మొత్తం ట్రైలర్ మీద ఆధారపడిన నేపథ్యంలో అందరి కళ్ళు దీని మీదే ఉన్నాయి. వైజాగ్ వేదికగా ఆ లాంఛనం వైభవంగా జరిగింది.
కథలో కొన్ని ముఖ్యమైన క్లూస్ దాచకుండా చెప్పేశారు. పాతబస్తీ శంకర్ (రామ్) ముందు వెనుక చూసే రకం కాదు. తోచింది చేసేయడం, అడ్డొస్తే తొక్కేయడం ఇదే అతని స్టయిల్. ఓ పోరి (కావ్య థాపర్) ని చూసి మనసు ఇచ్చేసి వెంటపడి మరీ ప్రేమించేలా చేసుకుంటాడు. తలలో యుఎస్బి చిప్పు పెట్టుకునే శంకర్ మీద ఒక ఇంటర్నేషనల్ డాన్ (సంజయ్ దత్) కన్ను పడుతుంది. తన మెదడుని శంకర్ కి బదలాయించే ప్రమాదకరమైన పనిని చేస్తాడు. అక్కడి నుంచి అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుని మాఫియా ప్రపంచంలో సంచనాలు జరుగుతాయి. అవేంటో తెరమీద చూడాలి.
రెండున్నర నిమిషాల ట్రైలర్ లో ప్రతి ఫ్రేమ్ పూరి జగన్నాధ్ మార్కు మాస్ మ్యానరిజంతో నిండిపోయింది. దానికి రామ్ తోడవ్వడంతో హిస్టీరియా మరింత పెరిగిపోయింది. ఇస్మార్ట్ శంకర్ లోని మెయిన్ పాయింట్ నే ఇందులోనూ తీసుకున్నట్టు కనిపించినా దానికి మించి పెద్ద స్కెచ్చే వేశారు పూరి. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తన డ్యూటీకి న్యాయం చేయగా కావ్య గ్లామర్ షోతో పాటు చార్మినార్ మాస్ డైలాగులు విజిల్స్ వేయించేలా ఉన్నాయి. ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న డబుల్ ఇస్మార్ట్ మొత్తానికి అనుకున్న టార్గెట్ అనుకుంది. హైప్ అమాంతం పెరిగేలా పూరి కొత్త జోష్ ఇచ్చేశారు.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…