వ్యక్తిగత జీవితానికి సంబంధించి లావణ్య అనే అమ్మాయి పెట్టిన కేసులో విచారణ ఎదుర్కుంటున్న హీరో రాజ్ తరుణ్ అప్పటి నుంచి మీడియా ముందుకు రాని సంగతి తెలిసిందే. ఆరోపణలు వచ్చిన మొదటి రోజు మాట్లాడాడు కానీ కేసు ఫైలయ్యాక మాత్రం కనిపించలేదు. అంత పెద్ద బడ్జెట్ తో నిర్మించిన పురుషోత్తముడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సైతం హాజరు కాలేదు. ఎల్లుండి విడుదల కాబోతున్న తిరగబడరా సామీ కోసం కెమెరా ముందు ప్రత్యక్షమయ్యాడు. ఊహించినట్టే మీడియా నుంచి ఎక్కువ కేసుకు సంబంధించిన ప్రశ్నలే ఎదురుకావడంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు.
కేవలం సినిమా గురించే మాట్లాడదామని చెప్పినా జర్నలిస్టులు వినే పరిస్థితి లేకపోవడంతో ఫైనల్ గా వివాదం గురించి నోరు విప్పాడు. ఆమె చేసిన అలిగేషన్లకు సంబంధించి అవి తప్పని నిరూపించేందుకు పూర్తి ఆధారాలు ఉన్నాయని, వేరే పేర్లు కూడా వాటిలో ఇన్వాల్వ్ కావడం వల్ల అన్నీ బయట పెట్టలేకపోతున్నానని చెప్పిన రాజ్ తరుణ్ మనస్థాపం చెందడం వల్లే పురుషోత్తముడు ప్రమోషన్లలో పాల్గొనలేదని క్లారిటీ ఇచ్చాడు. తన తరఫున లాయర్ వెళ్లిన క్రమాన్ని సమర్ధించుకున్న ఈ యూత్ హీరో ఒక దశలో పదే పదే అవే ప్రశ్నలు రిపీట్ కావడంతో అసహనానికి గురయ్యాడు.
అన్ని నిజాలు త్వరలో బయటపడతాయని, చట్టప్రకారం న్యాయం జరుగుతుందని చెప్పిన రాజ్ తరుణ్ అంతకు మించి మరింత లోతుగా సమాధానం చెప్పేందుకు ఇష్టపడలేదు. కాసేపు సరదాగా మాట్లాడినప్పటికీ కేసు క్వశ్చన్లు మాత్రం విపరీతంగా ఇబ్బంది పెట్టిన వైనం కనిపించింది. యజ్ఞం ఫేమ్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన తిరగబడరా సామీలో హీరోయిన్ గా నటించిన మాన్యా మల్హోత్రా మీద సైతం కేసు నమోదైన నేపధ్యంలో ఆమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎన్నడూ లేని రీతిలో రాజ్ తరుణ్ ప్రెస్ మీట్ కు భారీ సంఖ్యలో జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు హాజరు కావడం విశేషమనే చెప్పాలి.
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…