దెబ్బకు దెబ్బ..! అన్నట్టుగా మారిపోయింది వైసీపీ పరిస్థితి. ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబును దెబ్బతీసేందుకు ప్రయత్నించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అనూహ్యంగా వైసీపీకే దెబ్బ పడిపోయింది. ఇక్కడ ఇప్పుడు జెండామోసేందుకు కూడా నాయకుడు లేకుండా పోయారు. ఎన్నికల పోలింగ్ జరిగిన కేవలం రెండు మాసాల్లోనే వైసీపీ ఖాళీ అయిపోవడం.. కీలక నాయకులు జారు కోవడం.. అసలు ఇంచార్జ్ జాడ కూడా కనిపించక పోవడం చర్చనీయాంశంగా మారింది.
కుప్పంలో చంద్రబాబును ఓడించాలని కంకణం కట్టుకున్న వైసీపీ.. దానికి తగిన విధంగా గత ఐదేళ్ల పాలనలో ఇక్కడ టీడీపీ కార్యకర్తలను తనవైపు తిప్పుకొంది. కీలక నేతలపై కేసులు పెట్టి వారి నోరు కూడా మూయించింది. ఇక, కుప్పం మునిసిపాలిటీని అభివృద్ది కూడా చేసింది. మొత్తంగా చంద్రబాబును ఓడించి తీరాలన్న కసితో అయితే.. పనిచేసింది. కానీ, వైసీపీ ఒకటి తలిస్తే.. ప్రజలు మరొకటి తలచారు. ఈ క్రమంలోనే చంద్రబాబు మరింత ఎక్కువ మెజారిటీతోగెలిపించారు.
ఇక, ఈలోగా.. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ప్రమాదం ఘటన వెలుగు చూసింది. దీంతో వైసీపీ నాయకులు ఒక్కొక్కరు కాదు.. గుంపులుగుంపులుగా.. పార్టీ జెండా మార్చేస్తున్నారు. మరోవైపు.. పార్టీ తరఫున పోటీ చేసి చంద్రబాబుపై ఓడిపోయిన.. భరత్ కూడా కనిపించడం లేదు., ఎన్నికల ఫలితాల అనంతరం.. ఆయన బెంగళూరుకు వెళ్లిపోయి.. అక్కడే తిష్ఠ వేశారు. పైగా.. ఇక్కడ వైసీపీ కార్యాలయం కూడా.. లేకుండా పోయింది. దీనిలో కొందరు చిన్నపాటి హోటల్ నడుపుతున్నారు.
కారణం ఇదీ..
చంద్రబాబు కుప్పం వచ్చిన రెండు సార్లు ఇక్కడ అలజడి రేగింది. ఆయనపై కొందరు రాళ్లు రువ్వారు. అదేవిధంగా పార్టీ బ్యానర్లు కూడా చించేశారు. ఆ కేసులను ఇప్పుడు తిరగదోడుతున్నారు. దీనికి భయపడి కూడా.. కొందరు వైసీపీ నాయకులు.. కుప్పం నుంచి జారుకున్నారు. గతంలో తరచుగా వచ్చిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇప్పుడు కుప్పానికి రావడం మానేశారు. దీంతో ఇక వైసీపీలోఒ ఉంటే.. కేసులు తప్పవని భావిస్తున్న నాయకులు సాధ్యమైనంత వరకు టీడీపీ గూటికి చేరుతున్నారు. మిగిలిన వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో కుప్పం ఖాళీ అయిపోయింది.
This post was last modified on July 31, 2024 6:21 pm
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటిసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టలేదు. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన.. పాలనా పరంగా…
హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ…
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు కీలక వ్యవస్థలను ప్రభుత్వ శాఖల్లో కలిపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో…
ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…
దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు…
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మంత్రి వర్గ…