దెబ్బకు దెబ్బ..! అన్నట్టుగా మారిపోయింది వైసీపీ పరిస్థితి. ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబును దెబ్బతీసేందుకు ప్రయత్నించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అనూహ్యంగా వైసీపీకే దెబ్బ పడిపోయింది. ఇక్కడ ఇప్పుడు జెండామోసేందుకు కూడా నాయకుడు లేకుండా పోయారు. ఎన్నికల పోలింగ్ జరిగిన కేవలం రెండు మాసాల్లోనే వైసీపీ ఖాళీ అయిపోవడం.. కీలక నాయకులు జారు కోవడం.. అసలు ఇంచార్జ్ జాడ కూడా కనిపించక పోవడం చర్చనీయాంశంగా మారింది.
కుప్పంలో చంద్రబాబును ఓడించాలని కంకణం కట్టుకున్న వైసీపీ.. దానికి తగిన విధంగా గత ఐదేళ్ల పాలనలో ఇక్కడ టీడీపీ కార్యకర్తలను తనవైపు తిప్పుకొంది. కీలక నేతలపై కేసులు పెట్టి వారి నోరు కూడా మూయించింది. ఇక, కుప్పం మునిసిపాలిటీని అభివృద్ది కూడా చేసింది. మొత్తంగా చంద్రబాబును ఓడించి తీరాలన్న కసితో అయితే.. పనిచేసింది. కానీ, వైసీపీ ఒకటి తలిస్తే.. ప్రజలు మరొకటి తలచారు. ఈ క్రమంలోనే చంద్రబాబు మరింత ఎక్కువ మెజారిటీతోగెలిపించారు.
ఇక, ఈలోగా.. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ప్రమాదం ఘటన వెలుగు చూసింది. దీంతో వైసీపీ నాయకులు ఒక్కొక్కరు కాదు.. గుంపులుగుంపులుగా.. పార్టీ జెండా మార్చేస్తున్నారు. మరోవైపు.. పార్టీ తరఫున పోటీ చేసి చంద్రబాబుపై ఓడిపోయిన.. భరత్ కూడా కనిపించడం లేదు., ఎన్నికల ఫలితాల అనంతరం.. ఆయన బెంగళూరుకు వెళ్లిపోయి.. అక్కడే తిష్ఠ వేశారు. పైగా.. ఇక్కడ వైసీపీ కార్యాలయం కూడా.. లేకుండా పోయింది. దీనిలో కొందరు చిన్నపాటి హోటల్ నడుపుతున్నారు.
కారణం ఇదీ..
చంద్రబాబు కుప్పం వచ్చిన రెండు సార్లు ఇక్కడ అలజడి రేగింది. ఆయనపై కొందరు రాళ్లు రువ్వారు. అదేవిధంగా పార్టీ బ్యానర్లు కూడా చించేశారు. ఆ కేసులను ఇప్పుడు తిరగదోడుతున్నారు. దీనికి భయపడి కూడా.. కొందరు వైసీపీ నాయకులు.. కుప్పం నుంచి జారుకున్నారు. గతంలో తరచుగా వచ్చిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇప్పుడు కుప్పానికి రావడం మానేశారు. దీంతో ఇక వైసీపీలోఒ ఉంటే.. కేసులు తప్పవని భావిస్తున్న నాయకులు సాధ్యమైనంత వరకు టీడీపీ గూటికి చేరుతున్నారు. మిగిలిన వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో కుప్పం ఖాళీ అయిపోయింది.
This post was last modified on July 31, 2024 6:21 pm
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన…
తమిళ రాజకీయాల్లో తన అరంగేట్రం చేస్తున్న నటుడు విజయ్ (తమిళగ వెట్రి కళగం), గతంలో ఏపీలో పవన్ కళ్యాణ్ అనుసరించిన…
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్…
నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీ వల వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి,…
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…