ఒకే హీరో సినిమా తక్కువ గ్యాప్ లో రిలీజ్ కావడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత మాత్రం సేఫ్ కాదు. కానీ రాజ్ తరుణ్ నిర్మాతలు అదేమీ లెక్క చేయడం లేదు. మొన్న శుక్రవారం విడుదలైన పురుషోత్తముడు ఎలాంటి ప్రభావం చూపించకుండానే బాక్సాఫీస్ వద్ద సెలవు తీసుకునేందుకు సిద్ధమవుతున్న వైనం చూస్తున్నాం. భారీ బడ్జెట్, సీనియర్ మోస్ట్ క్యాస్టింగ్, పెద్ద సాంకేతిక బృందం ఇలా ఎన్ని హంగులు పెట్టినా రొటీన్ కథను జనం తిరస్కరించారు. కట్ చేస్తే ఏడు రోజులు తిరగడం ఆలస్యం ఎల్లుండి ఆగస్ట్ 2 తిరగబడరా సామీ థియేటర్లలో అడుగు పెట్టేందుకు రెడీ అవుతోంది.
వ్యక్తిగత జీవితానికి సంబంధించి తన గర్ల్ ఫ్రెండ్ లావణ్య పెట్టిన కేసులో విచారణ ఎదురుకుంటున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం బయటికి వచ్చే పరిస్థితిలో లేడు. ప్రమోషన్ ఎంత అవసరమైనా సరే రాలేని తన నిస్సహాయతను నిర్మాతలకు ముందే చెప్పేస్తున్నాడు. ఇది పురుషోత్తముడు పబ్లిసిటీ మీద ప్రభావం చూపించింది. ఇప్పుడు తిరగబడరా సామీకి అదే రిపీట్ అయ్యేలా ఉంది. ప్రస్తుతం రాజ్ తరుణ్ మార్కెట్ ఏమంత బాగాలేదు. ఓపెనింగ్స్ ఆశించడం అత్యాశ అవుతోంది. పైగా దర్శకుడు రవికుమార్ చౌదరి ఫామ్ కోల్పోయి ఏళ్ళు గడిచిపోయాయి. బజ్ రావడం చాలా కష్టం.
ఇదంతా ఒక ఎత్తు అయితే ఆగస్ట్ ఒకటి రెండు తేదీల్లో విపరీతమైన పోటీ ఉంది. మూకుమ్మడిగా ఏడెనిమిది సినిమాలు దాడి చేస్తున్నాయి. అల్లు శిరీష్ బడ్డీ, అశ్విన్ బాబు శివం భజే లాంటివి కాసిన్ని అంచనాలు మోస్తున్నాయి. కాన్సెప్ట్ పరంగా చూసుకున్నా తిరగబడరా సామీ కన్నా మెరుగైన కంటెంట్ అనిపిస్తున్నాయి. అలాంటప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుని రాజ్ తరుణ్ రిలీజ్ ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది. కేసు గొడవ తగ్గాక ప్రమోషన్లకూ వచ్చే ఛాన్స్ ఉండేది. మరి ఓటిటి కండీషనో లేక ఇంకేదయినా కారణమో ఏదైతేనేం పెద్ద సాహసమే చేస్తున్న సామీ ఏ ఫలితం అందుకుంటాడో.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…