Political News

స‌ర్వే రాళ్లు-స‌మాధి రాళ్లు: అచ్చెన్న ట్వీటు రచ్చ

ఏపీ రాజ‌కీయాల్లో చిత్ర‌మైన వ్య‌వ‌హారాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఒక‌వైపు పాల‌న సాగిస్తూనే మ‌రోవైపు విప‌క్షం వైసీపీని క‌ట్ట‌డి చేసే విధంగా కూట‌మి ప్ర‌భుత్వ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ ఓడిపోయి.. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. ఆయ‌న‌కు ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన 37.86 శాతం(స‌భ‌లో చంద్ర‌బాబు చెప్పిన లెక్క‌) ఓట్లు మాత్రం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. దీంతో ప్ర‌జ‌ల్లో సానుభూతిని త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే విడుద‌ల చేసిన శ్వేత‌ప‌త్రాల ద్వారా వైసీపీ విధ్వంస పాల‌న అంటూ.. ప్ర‌చారం చేస్తున్నారు. ఇక‌, ఇప్పుడు తాజాగా గ‌తంలో వైసీపీ హ‌యాంలో రైతులు, ఇత‌ర భూయ‌జ‌మాల‌కు సంబంధించి భూములు స‌ర్వే చేసి వేసిన స‌ర్వే రాళ్ల వ్య‌వ‌హారాన్ని కూడా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తున్నారు. అయితే.. ఈ విష‌యంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్య‌లు వివాదానికి దారి తీశాయి. వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో వేసిన స‌ర్వే రాళ్ల‌ను ఆయ‌న స‌మాధి రాళ్ల‌తో పోల్చారు.

“మీ కంద‌రికీ తెలుసుక‌దా! స‌మాధులు క‌ట్టిన త‌ర్వాత‌.. వాటిపై రాళ్లు వేసుకుని.. ఫొటోలు వేసుకుంటారు. ఇప్పుడు ఇలానే.. స‌ర్వే రాళ్ల‌పై జ‌గ‌న్ ఫొటోలు వేయించుకున్నాడు. స‌ర్వేరాళ్ల‌కు-స‌మాధి రాళ్ల‌కు కూడా తేడా తెలియ‌ని ఒక దుర్మార్గుడు చేసిన పాపం ఖ‌రీదు.. 700 కోట్లు” అని ఎక్స్ వేదిక‌గా నిప్పులు చెరిగారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం రైతుల పొలాల్లో సర్వే రాళ్లపై జగన్ ఫొటోలు వేయించిన విష‌యం తెలిసిందే. దీనిని అప్ప‌టి గ‌నుల శాఖ డైరెక్ట‌ర్ వెంక‌ట‌రెడ్డి సూచించార‌ని.. ఇటీవ‌ల కొంద‌రు వైసీపీ నాయ‌కులు చెప్పారు.

దీనివ‌ల్లే వైసీపీ ఘోరంగా ఓడిపోయింద‌ని చెప్పుకొచ్చారు. దీనిని కోట్ చేస్తూ.. ఎన్నిక‌ల స‌మ‌యంలో కూట‌మి పార్టీలు ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌రిచాయి. ఇప్పుడు కూడాఇదే విష‌యాన్ని ప్ర‌జ‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చేలా చేస్తున్నారు. క్ర‌మంలో రైతు తన పొలంలో దిష్టిబొమ్మ పెట్టడానికి ఒప్పుకుంటాడు. కానీ పొలం హక్కు పుస్తకాల మీద దిష్టిబొమ్మ పెడితే ఊరుకోడు. సమాధి రాళ్ల మీద ఫోటో వేసుకున్నట్లు సర్వే రాళ్లపై జగన్ ఫోటోలు వేయించాడు అని అచ్చెన్న వ్యాఖ్యానించారు. దీనిపై వైసీపీ నాయ‌కులు మండి ప‌డుతున్నారు.

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

5 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

5 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

8 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

8 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

9 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

9 hours ago