Political News

స‌ర్వే రాళ్లు-స‌మాధి రాళ్లు: అచ్చెన్న ట్వీటు రచ్చ

ఏపీ రాజ‌కీయాల్లో చిత్ర‌మైన వ్య‌వ‌హారాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఒక‌వైపు పాల‌న సాగిస్తూనే మ‌రోవైపు విప‌క్షం వైసీపీని క‌ట్ట‌డి చేసే విధంగా కూట‌మి ప్ర‌భుత్వ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ ఓడిపోయి.. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. ఆయ‌న‌కు ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన 37.86 శాతం(స‌భ‌లో చంద్ర‌బాబు చెప్పిన లెక్క‌) ఓట్లు మాత్రం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. దీంతో ప్ర‌జ‌ల్లో సానుభూతిని త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే విడుద‌ల చేసిన శ్వేత‌ప‌త్రాల ద్వారా వైసీపీ విధ్వంస పాల‌న అంటూ.. ప్ర‌చారం చేస్తున్నారు. ఇక‌, ఇప్పుడు తాజాగా గ‌తంలో వైసీపీ హ‌యాంలో రైతులు, ఇత‌ర భూయ‌జ‌మాల‌కు సంబంధించి భూములు స‌ర్వే చేసి వేసిన స‌ర్వే రాళ్ల వ్య‌వ‌హారాన్ని కూడా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తున్నారు. అయితే.. ఈ విష‌యంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్య‌లు వివాదానికి దారి తీశాయి. వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో వేసిన స‌ర్వే రాళ్ల‌ను ఆయ‌న స‌మాధి రాళ్ల‌తో పోల్చారు.

“మీ కంద‌రికీ తెలుసుక‌దా! స‌మాధులు క‌ట్టిన త‌ర్వాత‌.. వాటిపై రాళ్లు వేసుకుని.. ఫొటోలు వేసుకుంటారు. ఇప్పుడు ఇలానే.. స‌ర్వే రాళ్ల‌పై జ‌గ‌న్ ఫొటోలు వేయించుకున్నాడు. స‌ర్వేరాళ్ల‌కు-స‌మాధి రాళ్ల‌కు కూడా తేడా తెలియ‌ని ఒక దుర్మార్గుడు చేసిన పాపం ఖ‌రీదు.. 700 కోట్లు” అని ఎక్స్ వేదిక‌గా నిప్పులు చెరిగారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం రైతుల పొలాల్లో సర్వే రాళ్లపై జగన్ ఫొటోలు వేయించిన విష‌యం తెలిసిందే. దీనిని అప్ప‌టి గ‌నుల శాఖ డైరెక్ట‌ర్ వెంక‌ట‌రెడ్డి సూచించార‌ని.. ఇటీవ‌ల కొంద‌రు వైసీపీ నాయ‌కులు చెప్పారు.

దీనివ‌ల్లే వైసీపీ ఘోరంగా ఓడిపోయింద‌ని చెప్పుకొచ్చారు. దీనిని కోట్ చేస్తూ.. ఎన్నిక‌ల స‌మ‌యంలో కూట‌మి పార్టీలు ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌రిచాయి. ఇప్పుడు కూడాఇదే విష‌యాన్ని ప్ర‌జ‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చేలా చేస్తున్నారు. క్ర‌మంలో రైతు తన పొలంలో దిష్టిబొమ్మ పెట్టడానికి ఒప్పుకుంటాడు. కానీ పొలం హక్కు పుస్తకాల మీద దిష్టిబొమ్మ పెడితే ఊరుకోడు. సమాధి రాళ్ల మీద ఫోటో వేసుకున్నట్లు సర్వే రాళ్లపై జగన్ ఫోటోలు వేయించాడు అని అచ్చెన్న వ్యాఖ్యానించారు. దీనిపై వైసీపీ నాయ‌కులు మండి ప‌డుతున్నారు.

This post was last modified on July 30, 2024 1:40 pm

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

46 minutes ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

1 hour ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

2 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

2 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

3 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

3 hours ago