ఏపీ రాజకీయాల్లో చిత్రమైన వ్యవహారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు పాలన సాగిస్తూనే మరోవైపు విపక్షం వైసీపీని కట్టడి చేసే విధంగా కూటమి ప్రభుత్వ నేతలు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం జగన్ ఓడిపోయి.. ప్రతిపక్షంలో ఉన్నా.. ఆయనకు ప్రజల నుంచి వచ్చిన 37.86 శాతం(సభలో చంద్రబాబు చెప్పిన లెక్క) ఓట్లు మాత్రం రాజకీయంగా చర్చకు వస్తోంది. దీంతో ప్రజల్లో సానుభూతిని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే విడుదల చేసిన శ్వేతపత్రాల ద్వారా వైసీపీ విధ్వంస పాలన అంటూ.. ప్రచారం చేస్తున్నారు. ఇక, ఇప్పుడు తాజాగా గతంలో వైసీపీ హయాంలో రైతులు, ఇతర భూయజమాలకు సంబంధించి భూములు సర్వే చేసి వేసిన సర్వే రాళ్ల వ్యవహారాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. అయితే.. ఈ విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో వేసిన సర్వే రాళ్లను ఆయన సమాధి రాళ్లతో పోల్చారు.
“మీ కందరికీ తెలుసుకదా! సమాధులు కట్టిన తర్వాత.. వాటిపై రాళ్లు వేసుకుని.. ఫొటోలు వేసుకుంటారు. ఇప్పుడు ఇలానే.. సర్వే రాళ్లపై జగన్ ఫొటోలు వేయించుకున్నాడు. సర్వేరాళ్లకు-సమాధి రాళ్లకు కూడా తేడా తెలియని ఒక దుర్మార్గుడు చేసిన పాపం ఖరీదు.. 700 కోట్లు” అని ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. గత వైసీపీ ప్రభుత్వం రైతుల పొలాల్లో సర్వే రాళ్లపై జగన్ ఫొటోలు వేయించిన విషయం తెలిసిందే. దీనిని అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి సూచించారని.. ఇటీవల కొందరు వైసీపీ నాయకులు చెప్పారు.
దీనివల్లే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందని చెప్పుకొచ్చారు. దీనిని కోట్ చేస్తూ.. ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ప్రజలను చైతన్య పరిచాయి. ఇప్పుడు కూడాఇదే విషయాన్ని ప్రజల మధ్య చర్చకు వచ్చేలా చేస్తున్నారు. క్రమంలో రైతు తన పొలంలో దిష్టిబొమ్మ పెట్టడానికి ఒప్పుకుంటాడు. కానీ పొలం హక్కు పుస్తకాల మీద దిష్టిబొమ్మ పెడితే ఊరుకోడు. సమాధి రాళ్ల మీద ఫోటో వేసుకున్నట్లు సర్వే రాళ్లపై జగన్ ఫోటోలు వేయించాడు అని అచ్చెన్న వ్యాఖ్యానించారు. దీనిపై వైసీపీ నాయకులు మండి పడుతున్నారు.
This post was last modified on July 30, 2024 1:40 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…