Political News

స‌ర్వే రాళ్లు-స‌మాధి రాళ్లు: అచ్చెన్న ట్వీటు రచ్చ

ఏపీ రాజ‌కీయాల్లో చిత్ర‌మైన వ్య‌వ‌హారాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఒక‌వైపు పాల‌న సాగిస్తూనే మ‌రోవైపు విప‌క్షం వైసీపీని క‌ట్ట‌డి చేసే విధంగా కూట‌మి ప్ర‌భుత్వ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ ఓడిపోయి.. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. ఆయ‌న‌కు ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన 37.86 శాతం(స‌భ‌లో చంద్ర‌బాబు చెప్పిన లెక్క‌) ఓట్లు మాత్రం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. దీంతో ప్ర‌జ‌ల్లో సానుభూతిని త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే విడుద‌ల చేసిన శ్వేత‌ప‌త్రాల ద్వారా వైసీపీ విధ్వంస పాల‌న అంటూ.. ప్ర‌చారం చేస్తున్నారు. ఇక‌, ఇప్పుడు తాజాగా గ‌తంలో వైసీపీ హ‌యాంలో రైతులు, ఇత‌ర భూయ‌జ‌మాల‌కు సంబంధించి భూములు స‌ర్వే చేసి వేసిన స‌ర్వే రాళ్ల వ్య‌వ‌హారాన్ని కూడా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తున్నారు. అయితే.. ఈ విష‌యంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్య‌లు వివాదానికి దారి తీశాయి. వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో వేసిన స‌ర్వే రాళ్ల‌ను ఆయ‌న స‌మాధి రాళ్ల‌తో పోల్చారు.

“మీ కంద‌రికీ తెలుసుక‌దా! స‌మాధులు క‌ట్టిన త‌ర్వాత‌.. వాటిపై రాళ్లు వేసుకుని.. ఫొటోలు వేసుకుంటారు. ఇప్పుడు ఇలానే.. స‌ర్వే రాళ్ల‌పై జ‌గ‌న్ ఫొటోలు వేయించుకున్నాడు. స‌ర్వేరాళ్ల‌కు-స‌మాధి రాళ్ల‌కు కూడా తేడా తెలియ‌ని ఒక దుర్మార్గుడు చేసిన పాపం ఖ‌రీదు.. 700 కోట్లు” అని ఎక్స్ వేదిక‌గా నిప్పులు చెరిగారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం రైతుల పొలాల్లో సర్వే రాళ్లపై జగన్ ఫొటోలు వేయించిన విష‌యం తెలిసిందే. దీనిని అప్ప‌టి గ‌నుల శాఖ డైరెక్ట‌ర్ వెంక‌ట‌రెడ్డి సూచించార‌ని.. ఇటీవ‌ల కొంద‌రు వైసీపీ నాయ‌కులు చెప్పారు.

దీనివ‌ల్లే వైసీపీ ఘోరంగా ఓడిపోయింద‌ని చెప్పుకొచ్చారు. దీనిని కోట్ చేస్తూ.. ఎన్నిక‌ల స‌మ‌యంలో కూట‌మి పార్టీలు ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌రిచాయి. ఇప్పుడు కూడాఇదే విష‌యాన్ని ప్ర‌జ‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చేలా చేస్తున్నారు. క్ర‌మంలో రైతు తన పొలంలో దిష్టిబొమ్మ పెట్టడానికి ఒప్పుకుంటాడు. కానీ పొలం హక్కు పుస్తకాల మీద దిష్టిబొమ్మ పెడితే ఊరుకోడు. సమాధి రాళ్ల మీద ఫోటో వేసుకున్నట్లు సర్వే రాళ్లపై జగన్ ఫోటోలు వేయించాడు అని అచ్చెన్న వ్యాఖ్యానించారు. దీనిపై వైసీపీ నాయ‌కులు మండి ప‌డుతున్నారు.

This post was last modified on July 30, 2024 1:40 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

2 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

2 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

3 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

3 hours ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

4 hours ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

5 hours ago