Movie News

పురుషోత్తముడు పెద్ద రిస్కే తీసుకుంటున్నాడు

లావణ్య అనే అమ్మాయితో వివాహ బంధానికి సంబంధించిన కేసులో ఇరుక్కున్న రాజ్ తరుణ్ దాన్నుంచి ఎప్పుడు బయట పడతాడో అంతు చిక్కడం లేదు. బలమైన సాక్ష్యాలతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు మొన్న అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంటానంటూ లాయర్ కు మెసేజ్ పెట్టడం కలకలం రేపింది. ప్రాణాలు కాపాడటం జరిగింది కానీ మున్ముందు ఏం చేస్తుందోననే టెన్షన్ జనాల్లో లేకపోలేదు. ఇలాంటి పరిస్థితులలో రాజ్ తరుణ్ కొత్త సినిమాలు రిలీజ్ చేయడం రిస్కే. కానీ పురుషోత్తముడు నిర్మాతలు దాన్ని స్వీకరించడానికి సిద్ధమంటున్నారు.

జూలై 26న ఈ సినిమా విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ పత్రికల్లో ప్రకటన కూడా వచ్చింది. నిజానికి దీనికన్నా ముందు తిరగబడరా సామీ రావాలి. కానీ సిచువేషన్ చూసిన ఆ చిత్ర బృందం ఆగస్ట్ 2కి వాయిదా వేసుకుంది. కానీ కేవలం వారం ముందు పురుషోత్తముడు వస్తోంది కాబట్టి మళ్ళీ పోస్టు పోన్ చేయక తప్పేలా లేదు. అయితే ఇక్కడ రిస్క్ అన్నది కేవలం పోలీస్ కేసు గురించి మాత్రమే కాదు. అదే జూలై 26న ధనుష్ రాయన్ భారీ అంచనాలతో వస్తోంది. సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించడంతో పాటు పోస్టర్లు గట్రా జనాల్లో ఆసక్తిని పెంచాయి.

అల్లు శిరీష్ బడ్డీ ఇదే డేట్ ని గతంలో అఫీషియల్ గా లాక్ చేసుకుంది. వీటి మధ్య నెగ్గడం పురుషోత్తముడుకి ఒక ఛాలెంజ్ అయితే కేవలం రెండు వారాలు చేతిలో పెట్టుకుని ప్రమోషన్లు ఎలా చేస్తారనేది పెద్ద ప్రశ్న. పైగా ప్రెస్ మీట్లు పెడితే రాజ్ తరుణ్ రావాలి. కేసు గురించి అడక్కుండా మీడియా ఉండలేదు. ఒకవేళ దాని మీదే ఎక్కువ చర్చ జరిగినా, ఏదైనా వివాదం రేగినా అదో పెద్ద తలనెప్పి. ఇదంతా దృష్టిలో ఉంచుకుని కూడా రావడమంటే సాహసమే. రాజ్ తరుణ్ కెరీర్ లోనే పురుషోత్తముడు అత్యధిక బడ్జెట్ తో రూపొందింది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ లాంటి పెద్ద క్యాస్టింగ్ ఉంది.

This post was last modified on July 15, 2024 6:01 am

Share
Show comments

Recent Posts

స్క్రీన్లు పెంచడం ఎలా సాధ్యం అమీర్ సాబ్

ఒక్కోసారి అమీర్ ఖాన్ ఏదేదో స్టేట్ మెంట్లు ఇచ్చేసి గందరగోళంలో పడేస్తారు. కొన్ని పనులు కూడా అలాగే అనిపించినా వాటి…

20 minutes ago

మళ్లీ పవన్ మీదే ఇండస్ట్రీ ఆశలు?

రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక పెద్ద సినిమాలకు టికెట్ల ధరల పెంపు, అదనపు షోల కోసం అనుమతులు…

50 minutes ago

‘జగన్ ముత్తాత పేరు’…ఇదేమి లాజిక్ గోరంట్ల?

ఏపీలో కల్తీ నెయ్యి వ్యవహారం రేపిన రాజకీయ దుమారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ తమకు…

1 hour ago

అంబటి కోసం కదిలొచ్చిన కాపు నేతలు!

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ…

3 hours ago

జగన్‌ను కడిగేసిన అర్నాబ్ గోస్వామి

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…

4 hours ago

టీడీపీ ఎమ్మెల్యేపై రోజా బాడీ షేమింగ్ కామెంట్స్

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే…

4 hours ago