లావణ్య అనే అమ్మాయితో వివాహ బంధానికి సంబంధించిన కేసులో ఇరుక్కున్న రాజ్ తరుణ్ దాన్నుంచి ఎప్పుడు బయట పడతాడో అంతు చిక్కడం లేదు. బలమైన సాక్ష్యాలతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు మొన్న అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంటానంటూ లాయర్ కు మెసేజ్ పెట్టడం కలకలం రేపింది. ప్రాణాలు కాపాడటం జరిగింది కానీ మున్ముందు ఏం చేస్తుందోననే టెన్షన్ జనాల్లో లేకపోలేదు. ఇలాంటి పరిస్థితులలో రాజ్ తరుణ్ కొత్త సినిమాలు రిలీజ్ చేయడం రిస్కే. కానీ పురుషోత్తముడు నిర్మాతలు దాన్ని స్వీకరించడానికి సిద్ధమంటున్నారు.
జూలై 26న ఈ సినిమా విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ పత్రికల్లో ప్రకటన కూడా వచ్చింది. నిజానికి దీనికన్నా ముందు తిరగబడరా సామీ రావాలి. కానీ సిచువేషన్ చూసిన ఆ చిత్ర బృందం ఆగస్ట్ 2కి వాయిదా వేసుకుంది. కానీ కేవలం వారం ముందు పురుషోత్తముడు వస్తోంది కాబట్టి మళ్ళీ పోస్టు పోన్ చేయక తప్పేలా లేదు. అయితే ఇక్కడ రిస్క్ అన్నది కేవలం పోలీస్ కేసు గురించి మాత్రమే కాదు. అదే జూలై 26న ధనుష్ రాయన్ భారీ అంచనాలతో వస్తోంది. సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించడంతో పాటు పోస్టర్లు గట్రా జనాల్లో ఆసక్తిని పెంచాయి.
అల్లు శిరీష్ బడ్డీ ఇదే డేట్ ని గతంలో అఫీషియల్ గా లాక్ చేసుకుంది. వీటి మధ్య నెగ్గడం పురుషోత్తముడుకి ఒక ఛాలెంజ్ అయితే కేవలం రెండు వారాలు చేతిలో పెట్టుకుని ప్రమోషన్లు ఎలా చేస్తారనేది పెద్ద ప్రశ్న. పైగా ప్రెస్ మీట్లు పెడితే రాజ్ తరుణ్ రావాలి. కేసు గురించి అడక్కుండా మీడియా ఉండలేదు. ఒకవేళ దాని మీదే ఎక్కువ చర్చ జరిగినా, ఏదైనా వివాదం రేగినా అదో పెద్ద తలనెప్పి. ఇదంతా దృష్టిలో ఉంచుకుని కూడా రావడమంటే సాహసమే. రాజ్ తరుణ్ కెరీర్ లోనే పురుషోత్తముడు అత్యధిక బడ్జెట్ తో రూపొందింది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ లాంటి పెద్ద క్యాస్టింగ్ ఉంది.
This post was last modified on July 15, 2024 6:01 am
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…