Political News

సుప్రీం గడపతొక్కిన కేసీఆర్

“విద్యుత్ కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. ఈఆర్ సీ నిర్ణయం మేరకే విద్యుత్ కొనుగోళ్లు జరిగాయి. విద్యుత్ నియంత్రణ కమిషన్ న్యాయబద్ధ సంస్థ. దీని మీద విచారణ కమీషన్ వేయకూడదు. కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ యాక్ట్‌ 1952, విద్యుత్తు చట్టం-2003కి ఇది విరుద్దం” అంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నరసింహారెడ్డి కమిషన్ ను ఏర్పాటు చేసింది. దీనిని తప్పుపడుతూ కమీషన్ ను రద్దు చేయాలని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కమీషన్ నిబంధనల మేరకే వ్యవహరిస్తుందని హైకోర్టు కేసీఆర్ పిటీషన్ ను కొట్టి వేసింది.

ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై సోమవారం సీజేఐ బెంచ్ విచారణ చేపట్టనుంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ విద్యుత్తు సంస్థలు చేసిన విద్యుత్తు కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల నిర్మాణంపై విచారణ జరపడంతో పాటు..ఆ నిర్ణయాల్లోని నిబద్ధతను తేల్చడానికి రాష్ట్రప్రభుత్వం మార్చి 14న జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్‌ ఏర్పాటు చేసింది.

This post was last modified on July 15, 2024 11:24 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వివాదాలెన్నున్నా.. ఇండస్ట్రీ హిట్టయింది

ఈ మధ్య కాలంలో ఇండియాలో పెద్ద వివాదానికి దారి తీసిన సినిమా అంటే.. ‘ఎల్‌2: ఎంపురాన్’ అనే చెప్పాలి. తమ…

19 minutes ago

బ్రేకింగ్: జ‌మిలి ఎన్నికలు ఎప్పుడంటే…

దేశంలో `వ‌న్ నేష‌న్-వ‌న్ ఎల‌క్ష‌న్` పేరుతో ఒకేసారి అసెంబ్లీ, పార్ల‌మెంటుకు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని.. కేంద్రం త‌ల‌పోస్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై…

1 hour ago

వర్మ శారీ…..ఆడియన్స్ సారీ

ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే తెలుగులోనే కాదు హిందీలోనూ పెద్ద బ్రాండ్. శివ నుంచి సర్కార్ దాకా ఎన్నో…

5 hours ago

ట్రోలింగ్‌పై స్పందించిన మోహన్ బాబు

టాలీవుడ్లో విపరీతంగా సోషల్ మీడియా ట్రోలింగ్ ఎదుర్కొనే ఫ్యామిలీ ఏదంటే.. మంచు వారి వైపే చూపిస్తారు ఎవరైనా. తమ మీద…

8 hours ago

విమర్శల సుడిలో మీనాక్షి… ఏం జరిగింది?

మీనాక్షి నటరాజన్… .పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా. నిజమే… ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీగా బాధ్యతలు…

9 hours ago

పీ-4కు స్పంద‌న‌.. 10 కోట్లు విరాళం

సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మం పీ-4(ప‌బ్లిక్‌-ప్రైవేటు-పీపుల్స్‌-పార్ట‌న‌ర్‌షిప్‌)కు ఉన్న‌త స్థాయి వ‌ర్గాల నుంచి స్పంద‌న వ‌స్తోంది. స‌మాజంలోని పేద‌ల‌ను ఆదుకుని..…

9 hours ago