ఎంతసేపు సెటైర్లు వేయడం.. ఎక్స్ వేదికగా స్పందించడం తప్ప బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నలు ఆ పార్టీ వర్గాల నుంచే వస్తున్నాయి. ఓ వైపు ఎన్నికల్లో పార్టీకి దారుణ పరాభవం. మరోవైపు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై ఆరోపణలు. ఇంకోవైపు ఒక్కొక్కరిగా పార్టీ నుంచి వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలు. కానీ కేటీఆర్ మాత్రం రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు, సెటైర్లు వేయడంలోనే బిజీ అయిపోయారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
గతంలో కేటీఆర్ను ట్రబుల్ షూటర్ అని, గురి తప్పని నాయకుడు అని పొగిడారు. అప్పుడు అధికారం ఉంది కాబట్టి ఏం చేసినా, చెప్పినా చెల్లింది. కానీ ఇప్పుడు అధికారం లేదు. ఇలాంటి సమయంలోనే పార్టీని సమర్థంగా నడిపించే వాళ్లను నాయకుడు అంటారు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్లో ఆ సామర్థ్యం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వంపై, రేవంత్పై పసలేని ఆరోపణలు చేయడంలోనే ఆయన మునిగిపోతున్నారు. పార్టీలో ఎవరు ఉంటున్నారో? ఎవరు వెళ్లిపోవాలని అనుకుంటున్నారో ముందుగానే సమాచారం ఉంటుంది. వెళ్లిపోయే ఎమ్మెల్యేలు ఎవరో తెలిసినా వాళ్లను ఆపేందుకు కేటీఆర్ ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు.
పార్టీ మారాలనే ఆలోచనతో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి వ్యక్తిగతంగా వెళ్లి మాట్లాడితే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. కానీ కేసీఆర్ మాత్రం అది చేయడం లేదు. ఇక రాష్ట్రవ్యాప్తంగానూ పార్టీ పరిస్థితి దారుణంగా మారుతోంది. నిరుత్సాహంలో ఉన్న కేడర్ కూడా బీఆర్ఎస్కు దూరమవుతోంది. అయినా వాళ్లను కాపాడుకునే ప్రయత్నాలను కేటీఆర్ చేయడం లేదు. ఏమైనా అంటే ఆ ఎక్స్లో మాత్రం పోస్టులు పెడుతుంటారని కేటీఆర్పై విమర్శలు వస్తున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ను తప్పించాలని సొంత కేడర్ నుంచే డిమాండ్ వినిపిస్తోందని తెలిసింది.
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై…
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…