ఎంతసేపు సెటైర్లు వేయడం.. ఎక్స్ వేదికగా స్పందించడం తప్ప బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నలు ఆ పార్టీ వర్గాల నుంచే వస్తున్నాయి. ఓ వైపు ఎన్నికల్లో పార్టీకి దారుణ పరాభవం. మరోవైపు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై ఆరోపణలు. ఇంకోవైపు ఒక్కొక్కరిగా పార్టీ నుంచి వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలు. కానీ కేటీఆర్ మాత్రం రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు, సెటైర్లు వేయడంలోనే బిజీ అయిపోయారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
గతంలో కేటీఆర్ను ట్రబుల్ షూటర్ అని, గురి తప్పని నాయకుడు అని పొగిడారు. అప్పుడు అధికారం ఉంది కాబట్టి ఏం చేసినా, చెప్పినా చెల్లింది. కానీ ఇప్పుడు అధికారం లేదు. ఇలాంటి సమయంలోనే పార్టీని సమర్థంగా నడిపించే వాళ్లను నాయకుడు అంటారు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్లో ఆ సామర్థ్యం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వంపై, రేవంత్పై పసలేని ఆరోపణలు చేయడంలోనే ఆయన మునిగిపోతున్నారు. పార్టీలో ఎవరు ఉంటున్నారో? ఎవరు వెళ్లిపోవాలని అనుకుంటున్నారో ముందుగానే సమాచారం ఉంటుంది. వెళ్లిపోయే ఎమ్మెల్యేలు ఎవరో తెలిసినా వాళ్లను ఆపేందుకు కేటీఆర్ ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు.
పార్టీ మారాలనే ఆలోచనతో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి వ్యక్తిగతంగా వెళ్లి మాట్లాడితే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. కానీ కేసీఆర్ మాత్రం అది చేయడం లేదు. ఇక రాష్ట్రవ్యాప్తంగానూ పార్టీ పరిస్థితి దారుణంగా మారుతోంది. నిరుత్సాహంలో ఉన్న కేడర్ కూడా బీఆర్ఎస్కు దూరమవుతోంది. అయినా వాళ్లను కాపాడుకునే ప్రయత్నాలను కేటీఆర్ చేయడం లేదు. ఏమైనా అంటే ఆ ఎక్స్లో మాత్రం పోస్టులు పెడుతుంటారని కేటీఆర్పై విమర్శలు వస్తున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ను తప్పించాలని సొంత కేడర్ నుంచే డిమాండ్ వినిపిస్తోందని తెలిసింది.
This post was last modified on July 15, 2024 6:12 am
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…