ఈ శుక్రవారం విడుదలై నెగెటివ్ టాక్ తెచ్చుకున్న భారతీయుడు-2 సినిమాకు అతి పెద్ద సమస్య నిడివే అన్నది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న కంప్లైంట్. సన్నివేశాలు మరీ సాగతీతగా ఉన్నాయని.. శంకర్ సినిమాల్లో ఎప్పుడూ ఇంత సాగతీత లేదని.. సన్నివేశాలు ఇంతగా విసిగించలేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
ఐతే ఆ సాగతీత ఎందుకు వచ్చింది అన్నది ఇప్పుడు చర్చనీయాంశం. నిజానికి భారతీయుడు-2ను రెండు సినిమాలుగా తీసే ఉద్దేశం మొదట లేదు. ఒక సినిమాగానే మొదలుపెట్టారు. కానీ మధ్యలో రెండు పార్ట్స్ అయింది. ఇందుకు కథ విస్తృతి మాత్రమే కారణం అని భావించలేం.
ఈ సినిమా షూట్ క్రేన్ ప్రమాదం వల్ల మధ్యలో ఆగింది. రెండేళ్లు మళ్లీ సినిమా పునఃప్రారంభం కాలేదు. మామూలుగానే శంకర్ సినిమాలకు బడ్జెట్లు పెరుగుతాయి. ఈ బ్రేక్ వల్ల బడ్జెట్ మరింతగా తడిసి మోపెడైంది. ఈ క్రమంలోనే బడ్జెట్ వర్కవుట్ చేయడానికి 2 పార్ట్స్ ఆలోచన చేసినట్లున్నాడు శంకర్. దీంతో కథను విస్తరించడానికి చూశాడు. ఈ క్రమంలో ఇంటర్వెల్ పడాల్సిన చోట ఇండియన్-2ను ముగించాలని నిర్ణయించుకున్నాడు.
దీంతో అప్పటిదాకా ప్రథమార్ధం అనుకున్న దాన్ని పూర్తి సినిమా చేయడంతో అదనపు సీన్లు జోడించడంతో పాటు ఉన్న సన్నివేశాలను సాగదీశారన్నది స్పష్టం. దీని వల్ల ఆ సన్నివేశాల్లో బిగి పోయింది. భారతీయుడు-2 చూస్తే పెద్దగా కథ చెప్పిన ఫీలింగే కలగలేదు. అనవసర సీన్లు ప్రేక్షకులను విసిగించేశాయి. చాలా సీన్లలో డైలాగులు ఎక్కువైపోయాయి. షార్ప్నెస్ కొరవడింది. ఇదే ఇప్పడు సినిమాకు పెద్ద ప్రతిబంధకంగా మారింది.
అందరూ సినిమా ల్యాగ్ ల్యాగ్ అంటున్నారు. భారతీయుడు-3 ట్రైలర్ చూస్తే కొన్ని ఎగ్జైటింగ్ విషయాలున్నట్లే కనిపిస్తోంది కానీ.. పార్ట్-2 చూశాక దాని కోసం ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి ప్రదర్శిస్తారన్నదే ప్రశ్నార్థకంగా మారింది. మొత్తంగా చూస్తే ఈ సినిమాను రెండు భాగాలుగా చేయాలన్న ఆలోచనే బెడిసికొట్టినట్లు అనిపిస్తోంది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…
ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.. మళ్లీ మళ్లీ ప్రభుత్వం మారే పరిస్థితి కూడా ఉండదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆ…
పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…