ఈ శుక్రవారం విడుదలై నెగెటివ్ టాక్ తెచ్చుకున్న భారతీయుడు-2 సినిమాకు అతి పెద్ద సమస్య నిడివే అన్నది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న కంప్లైంట్. సన్నివేశాలు మరీ సాగతీతగా ఉన్నాయని.. శంకర్ సినిమాల్లో ఎప్పుడూ ఇంత సాగతీత లేదని.. సన్నివేశాలు ఇంతగా విసిగించలేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
ఐతే ఆ సాగతీత ఎందుకు వచ్చింది అన్నది ఇప్పుడు చర్చనీయాంశం. నిజానికి భారతీయుడు-2ను రెండు సినిమాలుగా తీసే ఉద్దేశం మొదట లేదు. ఒక సినిమాగానే మొదలుపెట్టారు. కానీ మధ్యలో రెండు పార్ట్స్ అయింది. ఇందుకు కథ విస్తృతి మాత్రమే కారణం అని భావించలేం.
ఈ సినిమా షూట్ క్రేన్ ప్రమాదం వల్ల మధ్యలో ఆగింది. రెండేళ్లు మళ్లీ సినిమా పునఃప్రారంభం కాలేదు. మామూలుగానే శంకర్ సినిమాలకు బడ్జెట్లు పెరుగుతాయి. ఈ బ్రేక్ వల్ల బడ్జెట్ మరింతగా తడిసి మోపెడైంది. ఈ క్రమంలోనే బడ్జెట్ వర్కవుట్ చేయడానికి 2 పార్ట్స్ ఆలోచన చేసినట్లున్నాడు శంకర్. దీంతో కథను విస్తరించడానికి చూశాడు. ఈ క్రమంలో ఇంటర్వెల్ పడాల్సిన చోట ఇండియన్-2ను ముగించాలని నిర్ణయించుకున్నాడు.
దీంతో అప్పటిదాకా ప్రథమార్ధం అనుకున్న దాన్ని పూర్తి సినిమా చేయడంతో అదనపు సీన్లు జోడించడంతో పాటు ఉన్న సన్నివేశాలను సాగదీశారన్నది స్పష్టం. దీని వల్ల ఆ సన్నివేశాల్లో బిగి పోయింది. భారతీయుడు-2 చూస్తే పెద్దగా కథ చెప్పిన ఫీలింగే కలగలేదు. అనవసర సీన్లు ప్రేక్షకులను విసిగించేశాయి. చాలా సీన్లలో డైలాగులు ఎక్కువైపోయాయి. షార్ప్నెస్ కొరవడింది. ఇదే ఇప్పడు సినిమాకు పెద్ద ప్రతిబంధకంగా మారింది.
అందరూ సినిమా ల్యాగ్ ల్యాగ్ అంటున్నారు. భారతీయుడు-3 ట్రైలర్ చూస్తే కొన్ని ఎగ్జైటింగ్ విషయాలున్నట్లే కనిపిస్తోంది కానీ.. పార్ట్-2 చూశాక దాని కోసం ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి ప్రదర్శిస్తారన్నదే ప్రశ్నార్థకంగా మారింది. మొత్తంగా చూస్తే ఈ సినిమాను రెండు భాగాలుగా చేయాలన్న ఆలోచనే బెడిసికొట్టినట్లు అనిపిస్తోంది.
This post was last modified on July 15, 2024 5:54 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…