ఈ శుక్రవారం విడుదలై నెగెటివ్ టాక్ తెచ్చుకున్న భారతీయుడు-2 సినిమాకు అతి పెద్ద సమస్య నిడివే అన్నది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న కంప్లైంట్. సన్నివేశాలు మరీ సాగతీతగా ఉన్నాయని.. శంకర్ సినిమాల్లో ఎప్పుడూ ఇంత సాగతీత లేదని.. సన్నివేశాలు ఇంతగా విసిగించలేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
ఐతే ఆ సాగతీత ఎందుకు వచ్చింది అన్నది ఇప్పుడు చర్చనీయాంశం. నిజానికి భారతీయుడు-2ను రెండు సినిమాలుగా తీసే ఉద్దేశం మొదట లేదు. ఒక సినిమాగానే మొదలుపెట్టారు. కానీ మధ్యలో రెండు పార్ట్స్ అయింది. ఇందుకు కథ విస్తృతి మాత్రమే కారణం అని భావించలేం.
ఈ సినిమా షూట్ క్రేన్ ప్రమాదం వల్ల మధ్యలో ఆగింది. రెండేళ్లు మళ్లీ సినిమా పునఃప్రారంభం కాలేదు. మామూలుగానే శంకర్ సినిమాలకు బడ్జెట్లు పెరుగుతాయి. ఈ బ్రేక్ వల్ల బడ్జెట్ మరింతగా తడిసి మోపెడైంది. ఈ క్రమంలోనే బడ్జెట్ వర్కవుట్ చేయడానికి 2 పార్ట్స్ ఆలోచన చేసినట్లున్నాడు శంకర్. దీంతో కథను విస్తరించడానికి చూశాడు. ఈ క్రమంలో ఇంటర్వెల్ పడాల్సిన చోట ఇండియన్-2ను ముగించాలని నిర్ణయించుకున్నాడు.
దీంతో అప్పటిదాకా ప్రథమార్ధం అనుకున్న దాన్ని పూర్తి సినిమా చేయడంతో అదనపు సీన్లు జోడించడంతో పాటు ఉన్న సన్నివేశాలను సాగదీశారన్నది స్పష్టం. దీని వల్ల ఆ సన్నివేశాల్లో బిగి పోయింది. భారతీయుడు-2 చూస్తే పెద్దగా కథ చెప్పిన ఫీలింగే కలగలేదు. అనవసర సీన్లు ప్రేక్షకులను విసిగించేశాయి. చాలా సీన్లలో డైలాగులు ఎక్కువైపోయాయి. షార్ప్నెస్ కొరవడింది. ఇదే ఇప్పడు సినిమాకు పెద్ద ప్రతిబంధకంగా మారింది.
అందరూ సినిమా ల్యాగ్ ల్యాగ్ అంటున్నారు. భారతీయుడు-3 ట్రైలర్ చూస్తే కొన్ని ఎగ్జైటింగ్ విషయాలున్నట్లే కనిపిస్తోంది కానీ.. పార్ట్-2 చూశాక దాని కోసం ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి ప్రదర్శిస్తారన్నదే ప్రశ్నార్థకంగా మారింది. మొత్తంగా చూస్తే ఈ సినిమాను రెండు భాగాలుగా చేయాలన్న ఆలోచనే బెడిసికొట్టినట్లు అనిపిస్తోంది.
This post was last modified on July 15, 2024 5:54 am
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…