ఆ మధ్య ఆచార్య సినిమాలో తీసుకుని కొంత భాగం షూటింగ్ చేశాక హీరోయిన్ కాజల్ అగర్వాల్ భాగం తీసేయడం ఆమె అభిమానులను తెగ బాధించింది. డిజాస్టర్ కావడంతో టాపిక్ పెద్దగా చర్చలోకి రాలేదు కానీ ఒకవేళ హిట్ అయ్యుంటే మాత్రం దీని గురించి డిస్కషన్స్ జరిగేవి. భారతీయుడు సీక్వెల్ కి కాజల్ ఎంపికైనప్పుడు ఆమెను రెండో భాగంలోనే చూడొచ్చని ఫాన్స్ భావించారు. కానీ దర్శక నిర్మాతలు ముందు జాగ్రత్తగా ఆవిడ సెకండ్ పార్ట్ లో ఉండదని, భారతీయుడు 3లో చూడాలని సన్నద్ధం చేయడంతో పెద్ద డౌట్ తీరిపోయింది. అయితే లుక్ ఎలా ఉంటుందనే డౌట్ తీరిపోయింది.
భారతీయుడు 2 క్లైమాక్స్, ఎండ్ టైటిల్స్ అయ్యాక భారతీయుడు 3 ట్రైలర్ లో కాజల్ అగర్వాల్ ని చూపించారు. వీరశేఖర్ సేనాపతి ప్రియురాలు కం భార్యగా యుద్ధ వీరుల దుస్తుల్లో ఆమెను విభిన్నంగా ప్రెజెంట్ చేశారు దర్శకుడు శంకర్. ఇది ఎప్పుడో మూడేళ్ళ క్రితమే షూట్ చేసిన భాగం కావడంతో లుక్స్ పరంగా ఇంకా యంగ్ గా కనిపిస్తోంది. తల్లి కాకముందు తీసిన ఫుటేజ్ కాబోలు. సుకన్య తరహాలో కాజల్ కు స్వాతంత్ర పోరాటం భాగం పంచుకునే వీరమహిళా క్యారెక్టర్ ని డిజైన్ చేశారు శంకర్. రెగ్యులర్ కమర్షియల్ గ్లామర్ టచ్ లేకుండా సీరియస్ పెర్ఫార్మన్స్ మీదే దృష్టి పెట్టారు.
ఇదంతా బాగానే ఉంది కానీ భారతీయుడు 2కి వచ్చిన టాక్ చూసి కాజల్ అగర్వాల్ టెన్షన్ పడే ఉంటుంది. ఎందుకంటే దీని ప్రభావం నేరుగా భారతీయుడు 3 బిజినెస్, క్రేజ్ మీద పడనుంది. అసలే జాక్ పాట్ లాంటి ఆఫర్ అందులోనూ శంకర్ డైరెక్షన్ కావడం కాజల్ ఈ సినిమా విషయంలో బాగా ఎగ్జై టింగ్ గా ఉంది. కానీ చూస్తుంటే బజ్ ఏ మాత్రం వస్తుందో అనుమానంగానే ఉంది. అయితే కమల్ హాసన్ చెప్పినట్టు ఇండియన్ 3 కోసమే తాను ఇది ఒప్పుకున్నానని చెప్పారు కాబట్టి నమ్మకం పెట్టుకోవచ్చు. అందులోనూ రెండు నిమిషాల విజువల్స్ కంటెంట్ మీద నమ్మకం వచ్చేలానే ఉన్నాయి.
This post was last modified on July 12, 2024 4:27 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…