ఒకప్పుడు హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే చూసే విజువల్ మాయాజాలం ఇప్పుడు మన చిత్రాల్లోనూ కనిపిస్తోంది. రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ చూసి హాలీవుడ్ వాళ్లే ఆశ్చర్యపోయిన పరిస్థితి. తాజాగా విడుదలైన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో విజువల్స్ చూస్తే హాలీవుడ్కు మనమేం తక్కువ అనే భావన కలగడం ఖాయం. భారీ కలలు కంటున్న మన డైరెక్టర్లు.. మన టెక్నీషియన్ల సాయంతోనే పెరుగుతున్న సాంకేతికతను ఉపయోగించుకుని వెండి తెర మీద అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు.
ఐతే ఇప్పటిదాకా మన దర్శకులు ఏం చేసినా హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొందినట్లే అనిపించేది. కానీ త్వరలో విడుదల కాబోతున్న ‘ఇండియన్-2’ చిత్రంలో ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఏ చిత్రంలోనూ చూడనిది ఏదో చూపించబోతున్నారట. దాని గురించి ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ శ్రీనివాస్ మోహన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రోబో, బాహుబలి లాంటి భారీ చిత్రాలకు వీఎఫెక్స్ సూపర్ వైజర్గా పని చేసిన శ్రీనివాస్ మోహన్.. ‘భారతీయుడు-2’కు కూడా ఇవే బాధ్యతలు నిర్వర్తించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “ఒక దశ వరకు ‘ఇండియన్-2’ మామూలుగానే సాగిపోయింది. కానీ ఒక రోజు శంకర్ గారు కాల్ చేసి ఒక ఆలోచన చెప్పారు. అది చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. నిజానికి అలాంటిది ఇప్పటిదాకా హాలీవుడ్లో కూడా ఎవ్వరూ చేయలేదు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటిది ట్రై చేయలేదు. ఐతే మనం ఎప్పుడూ హాలీవుడ్ కంటే ఐదు పదేళ్లు ఉండేవాళ్లం. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వచ్చాక అందరూ సమానం అయిపోయారు. ఆ టెక్నాలజీ అందరికీ కొత్తే. మన దగ్గర ఏఐని హాలీవుడ్ వాళ్ల కంటే బాగా ఉపయోగిస్తున్న నిపుణులు ఉన్నారు. వారి సాయంతోనే ‘ఇండియన్-2’లో ఒక సీక్వెన్స్ చేశాం. అలాంటిది ప్రపంచ సినిమాలో ఇప్పటిదాకా రాలేదని కచ్చితంగా చెప్పగలను” అన్నాడు. ఆయన ఈ స్థాయిలో చెబుతున్న సీక్వెన్స్ ఏంటన్నది ఆసక్తికరం.
This post was last modified on July 2, 2024 2:59 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…