తమిళ బ్లాక్ బస్టర్ తేరిని తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొంత భాగం షూటింగ్ చేశాక జనసేన ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ బిజీ కావడంతో పాటు ఓజికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఈ ప్రాజెక్టు కాస్త వెనక్కు వెళ్ళింది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ పోలీస్ డ్రామాలో మెయిన్ హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మీద గబ్బర్ సింగ్ రేంజ్ లో అంచనాలున్నాయి. తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందనే క్లారిటీ ఇంకా లేదు కానీ తేరి హిందీ రీమేక్ బేబీ జాన్ డిసెంబర్ 25 లాక్ చేసుకుంది.
వరుణ్ ధావన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న బేబీ జాన్ కు ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు అట్లీ నిర్మాణంతో పాటు నేతృత్వం వహిస్తుండగా కలీస్ డైరెక్షన్ చేస్తున్నాడు. ఒకవేళ పవన్ కు కనక తగినంత సమయం దొరికి ఎక్కువ కాల్ షీట్లు ఉస్తాద్ కు ఇచ్చి ఉంటే ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో విడుదల చేసేలా హరీష్ శంకర్ చూసుకునేవాడు. కానీ ఇప్పుడా ఛాన్స్ లేదు. బేబీ జాన్ రావడం వల్ల నష్టమేమి లేదు కానీ విజయ్ తేరి తెలుగు డబ్బింగ్ నే ప్రైమ్ లో చూసేసిన ప్రేక్షకులు ఇప్పుడీ వరుణ్ ధావన్ వెర్షన్ ని కూడా చూస్తే కథ పరంగా ఉన్న ఆసక్తి, ఎగ్జైట్ మెంట్ మరింత తగ్గిపోయే రిస్క్ లేకపోలేదు.
అసలు ముందు పవన్ కళ్యాణ్ పూర్తి చేయబోయేది హరిహర వీరమల్లు. ఆ తర్వాత ఓజికి డేట్లు ఇవ్వాలి. ఆపైనే ఉస్తాద్ భగత్ సింగ్ కు ఛాన్స్. అసలే డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖల నిర్వహణలో పవన్ కళ్యాణ్ కు పాలన తప్ప మరో ప్రపంచం లేకుండా పోతోంది. తిరిగి సినిమా సెట్స్ లో అడుగుపెట్టే మూడ్ రావాలని నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నుంచి ఒక ప్లానింగ్ ప్రకారం రాజకీయం, సినిమా రెండు బ్యాలన్స్ అయ్యేలా చూస్తున్నారట. వీటి అప్డేట్స్ లేకపోయినా పవన్ అభిమానులు మాత్రం రోజు వస్తున్న పొలిటికల్ కంటెంట్ తో మంచి హై ఆస్వాదిస్తున్నారు.
This post was last modified on June 26, 2024 6:29 pm
కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్లో…
ఫిబ్రవరి ఏడు కోసం అక్కినేని అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. గత కొంత కాలంగా గట్టిగా చెప్పుకునే బ్లాక్…
అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్లతో తిరుగులేని క్రేజ్…
భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…
ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…