మరికొద్ది గంటల్లో ప్రీమియర్లు మొదలుకాబోతున్న కల్కి 2898 ఏడి ఎదురు చూపులు నిమిషాలను సైతం యుగాలుగా మార్చేస్తున్నాయి. ఇండియన్ స్క్రీన్ మీద అతి పెద్ద విజువల్ వండర్ చూసేందుకు ప్రేక్షకులు సిద్ధమవుతున్న వేళ కొన్ని ఆసక్తికరమైన లీక్స్ కొన్ని విషయాల్లో సంసిద్ధతను డిమాండ్ చేస్తున్నాయి. వాటిలో మొదటిది ప్రభాస్ ఎంట్రీ. మాములుగా ప్యాన్ ఇండియా మూవీ అంటే హీరో లాంచ్ మహా అయితే మొదటి అయిదు పది నిమిషాల్లోనే జరిగిపోతుంది. కానీ కల్కిలో మాత్రం కాస్త ఆలస్యంగా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. మరీ లేట్ కాదు కానీ ఇంకెంతసేపు అనే ఫీలింగ్ వస్తుందట.
మూడు ప్రపంచాలను పరిచయం చేసే క్రమంలో దర్శకుడు నాగఅశ్విన్ ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల కాసేపు అమితాబ్ డామినేషన్ అనిపించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఒక్కసారి భైరవ ప్రవేశం జరిగిపోయాక కథా కథనాలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయని అంటున్నారు. మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామ పరిచయం, కలి పురుషుడి అవతారం గిరించి వివరణ, అశ్వద్ధామకు సంబంధించిన ఎపిసోడ్ వగైరాలు డిటైల్డ్ గా ఉండటం వల్ల రెగ్యులర్ కమర్షియల్ స్టైల్ లో ఉండదని వినికిడి. ఎప్పుడూ చూడని సరికొత్త అనుభూతికి ముందే సిద్ధపడటం ఒకరకంగా అవసరమే.
తినబోతు రుచులెందుకు కానీ భైరవగా ప్రభాస్ ని సూపర్ హీరో పాత్రలో చూసేందుకు ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ మాములుగా లేదు. ఆదిపురుష్ గాయం, సలార్ హిట్ అయినా పూర్తిగా సంతృప్తిపరచలేకపోయిన వైనం తదితరాలన్నీ కల్కి 2898 ఏడి పూర్తిగా తగ్గిస్తుందని అభిమానుల నమ్మకం. ఏపీ తెలంగాణలో ఉదయం 4 గంటల నుంచే స్పెషల్ షోలు మొదలు కానుండగా కొన్నిచోట్ల మూడు నుంచే పడతాయని తెలిసింది. ఎలాగూ ఓవర్సీస్ షోల రిపోర్ట్ తెల్లవారకుండానే వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ అవుతున్న వాళ్ళు కూడా ఆన్ లైన్ లో కల్కి కబుర్లు వెతుక్కోవడంలో బిజీగా ఉంటారు.
This post was last modified on June 26, 2024 6:23 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…