మరికొద్ది గంటల్లో ప్రీమియర్లు మొదలుకాబోతున్న కల్కి 2898 ఏడి ఎదురు చూపులు నిమిషాలను సైతం యుగాలుగా మార్చేస్తున్నాయి. ఇండియన్ స్క్రీన్ మీద అతి పెద్ద విజువల్ వండర్ చూసేందుకు ప్రేక్షకులు సిద్ధమవుతున్న వేళ కొన్ని ఆసక్తికరమైన లీక్స్ కొన్ని విషయాల్లో సంసిద్ధతను డిమాండ్ చేస్తున్నాయి. వాటిలో మొదటిది ప్రభాస్ ఎంట్రీ. మాములుగా ప్యాన్ ఇండియా మూవీ అంటే హీరో లాంచ్ మహా అయితే మొదటి అయిదు పది నిమిషాల్లోనే జరిగిపోతుంది. కానీ కల్కిలో మాత్రం కాస్త ఆలస్యంగా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. మరీ లేట్ కాదు కానీ ఇంకెంతసేపు అనే ఫీలింగ్ వస్తుందట.
మూడు ప్రపంచాలను పరిచయం చేసే క్రమంలో దర్శకుడు నాగఅశ్విన్ ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల కాసేపు అమితాబ్ డామినేషన్ అనిపించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఒక్కసారి భైరవ ప్రవేశం జరిగిపోయాక కథా కథనాలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయని అంటున్నారు. మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామ పరిచయం, కలి పురుషుడి అవతారం గిరించి వివరణ, అశ్వద్ధామకు సంబంధించిన ఎపిసోడ్ వగైరాలు డిటైల్డ్ గా ఉండటం వల్ల రెగ్యులర్ కమర్షియల్ స్టైల్ లో ఉండదని వినికిడి. ఎప్పుడూ చూడని సరికొత్త అనుభూతికి ముందే సిద్ధపడటం ఒకరకంగా అవసరమే.
తినబోతు రుచులెందుకు కానీ భైరవగా ప్రభాస్ ని సూపర్ హీరో పాత్రలో చూసేందుకు ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ మాములుగా లేదు. ఆదిపురుష్ గాయం, సలార్ హిట్ అయినా పూర్తిగా సంతృప్తిపరచలేకపోయిన వైనం తదితరాలన్నీ కల్కి 2898 ఏడి పూర్తిగా తగ్గిస్తుందని అభిమానుల నమ్మకం. ఏపీ తెలంగాణలో ఉదయం 4 గంటల నుంచే స్పెషల్ షోలు మొదలు కానుండగా కొన్నిచోట్ల మూడు నుంచే పడతాయని తెలిసింది. ఎలాగూ ఓవర్సీస్ షోల రిపోర్ట్ తెల్లవారకుండానే వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ అవుతున్న వాళ్ళు కూడా ఆన్ లైన్ లో కల్కి కబుర్లు వెతుక్కోవడంలో బిజీగా ఉంటారు.
This post was last modified on June 26, 2024 6:23 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…