అభిమానులే కాదు సగటు సినీ ప్రేమికులు కూడా కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న కల్కి 2898 ఏడి విడుదల ఇంకొద్ది గంటల్లో జరగబోతున్న నేపథ్యంలో పరిశ్రమలో ఒకరకమైన ఉద్విగ్నత కనిపిస్తోంది. జనవరిలో సంక్రాంతి హడావిడి తప్ప ఒక్క టిల్లు స్క్వేర్ మాత్రమే అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద మేజిక్ చేసింది. మిగిలిన హిట్లు, యావరేజ్ లు బ్రేక్ ఈవెన్లు అందుకుని స్వల్ప లాభాలతో బయట పడ్డాయి తప్పించి బిజినెస్ కు సంబంధించి అన్ని వర్గాలను సంతృప్తిపరిచినవి లేవు. మూడు నెలల నుంచి కనీస ఖర్చులు గిట్టుబాటు కాని థియేటర్లు పదుల్లో కాదు వందల్లో ఉన్నాయి.
ఇప్పుడు క్లాస్ మాస్ తేడా లేకుండా అన్ని సెంటర్లలో కల్కి షోలు హౌస్ ఫుల్స్ తో కిటకిటలాడబోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ హోరు చూస్తుంటే ఓపెనింగ్ డే ఎంత వస్తుందనేది ఊహకు అందడం లేదు. ఎన్ని షోలు వేస్తున్నా ఆన్ లైన్ లోనే టికెట్లు క్షణాల్లో అమ్ముడుపోవడంతో బయ్యర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముఖ్యంగా నైజాం ఊచకోత మాములుగా లేదు. జిఓ రాకలో ఆలస్యం వల్ల ఏపీలో కొంత లేట్ అయినా అక్కడా అమ్మకాలు హాట్ కేక్స్ లా సాగుతున్నాయి. హిందీ బెల్ట్ లోనూ ఇరవై కోట్లకు పైగా గ్రాస్ ని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇవన్నీ ప్రాధమిక విశ్లేషణలు మాత్రమే.
ట్రేడ్ పండితులు వేసే లెక్కలు నిజమయ్యే పక్షంలో కల్కి 2898 ఏడి మొదటి రోజు గ్రాస్ నూటా ఎనభై నుంచి రెండు వందల కోట్ల మధ్య ఉంటుంది. వారం క్రితం వరకు హైప్ పూర్తి స్థాయిలో లేదని ఫీలైన ప్రభాస్ అభిమానులు ఇప్పుడు టికెట్ల కోసం ఏర్పడిన డిమాండ్ చూసి షాక్ అవుతున్నారు. తమిళనాడులో కొంత నెమ్మదిగా ఉన్నప్పటి నిన్నటి నుంచి ఊపందుకోవడం శుభ పరిణామం. ఆర్ఆర్ఆర్, సలార్ లను సులభంగా దాటేస్తున్న కల్కికి ఇప్పుడు టాక్ కీలకంగా మారనుంది. బాగుందనే మాట చాలు కనీసం రెండు వారాల పాటు భైరవ బుజ్జిల ప్రభంజనాన్ని కళ్లారా చూడొచ్చు. అందరూ కోరుకుంటున్నది ఇదే.
This post was last modified on June 26, 2024 10:07 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…