Movie News

‘నిశ్శబ్దం’ అలా అనుకుంటే.. ఇలా అయింది

థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురు చూసి, చూసి చివరికి ఓటీటీ విడుదలకు సిద్ధమైపోయిన సినిమా ‘నిశ్శబ్దం’. అక్టోబరు 2న ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన అనుష్కతో పాటు తమిళ విలక్షణ నటుడు మాధవన్, హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్సన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించడం విశేషం.

ఇంతకుముందు మంచు విష్ణుతో ‘వస్తాడు నా రాజు’ లాంటి ఫ్లాప్ మూవీ తీసిన హేమంత్ మధుకర్.. ఇంతి పెద్ద కాస్ట్‌తో, పెద్ద బడ్జెట్లో ఇలాంటి సినిమా తీయడం విశేషమే. ఐతే ముందు అయితే అతను ‘నిశ్శబ్దం’ తీయాలనుకున్నది అనుష్కతో కాదట. దాని బడ్జెట్ కూడా తక్కువట. పైగా దీన్ని మూకీ మూవీగా తీయాలన్నది అతడి ఆలోచనట. ఐతే తర్వాత అన్నీ మారిపోయినట్లు అతను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

‘వస్తాడు నా రాజు’ తర్వాత తాను, మణిశర్మ నిర్మాతలుగా మారి తన దర్శకత్వంలో హిందీలో ‘ముంబయి 125’ అనే త్రీడీ మూవీ తీశామని.. ఐతే అది ఏమాత్రం ఆడకపోవడంతో డబ్బులన్నీ పోయాయని.. ఆపై తాను ఏదైనా వెరైటీ సినిమా చేద్దామన్న ఆలోచనతో ‘నిశ్శబ్దం’ కథ రాసుకుని ముందుగా మాధవన్‌కు వినిపించానని.. ఆయన చాలా బాగుందని అన్నారని.. తాప్సిని హీరోయిన్ పాత్రకు అనుకున్నామని.. పీవీపీ, నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారని.. అప్పటికి అది మూకీ మూవీగానే అనుకున్నామని హేమంత్ తెలిపాడు.

ఐతే ఒకసారి అనుకోకుండా కోన వెంకట్‌ను కలిసినపుడు కథ చెబితే.. ఇది చాలా బాగుందని.. దీన్ని పెద్ద స్థాయిలో, ఇంటర్నేషనల్ లెవెల్లో చేద్దామని చెప్పాడని.. తర్వాత అనుష్కకు ఆయనే కథ చెప్పి ఒప్పించారని.. తర్వాత గోపీ మోహన్‌తో కలిసి అమెరికా బ్యాక్‌డ్రాప్‌తో కథను మార్చానని హేమంత్ వెల్లడించాడు. మూకీగా చేస్తే కమర్షియల్‌గా అనుకున్నంత స్థాయికి సినిమా వెళ్లదని, నిర్మాతల శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచుకుని టాకీగానే చేయాలని తర్వాత అనుకున్నామని.. అప్పుడు కోన వెంకట్ కూర్చుని ఈ కథకు మాటలు రాశాడని.. అలా ఈ సినిమా స్వరూపం మారిపోయిందని హేమంత్ వెల్లడించాడు.

This post was last modified on September 23, 2020 12:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసెంబ్లీకి వస్తే ఆ జాకీలను పడేయొచ్చుగా జగన్

అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…

1 hour ago

వివేకా హత్య కేసు.. 4 వారాల్లో తీర్పు!

వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…

2 hours ago

కవిత దీక్ష.. ఎవరికీ పట్టట్లేదా?

బీఆర్‌ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత గత రెండు రోజులుగా నిరవధిక…

2 hours ago

సుకుమార్ శిష్యుడికి ‘మెగాస్టార్’ గ్రీన్ సిగ్నల్ ?

కొత్త తరం దర్శకులతో పని చేసేందుకు చిరంజీవి పరుగులు పెడుతున్నారు. కొంచెం ఆలస్యంగా అయినా రజనీకాంత్ రూటు పట్టి విజయాలు…

3 hours ago

మల్లారెడ్డికి మళ్ళీ పెళ్లి

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్. ఇక, సోషల్ మీడియాలో అయితే మల్లారెడ్డి…

3 hours ago

విద్యుత్ చార్జీల పెంపుపై చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

అస‌లే వేస‌వి కాలం.. సాధార‌ణ ఇళ్ల‌లో ఫాన్లు.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఇళ్ల‌లో కూల‌ర్లు, ఆపై త‌ర‌గ‌తుల ఇళ్ల‌లో ఏసీలు క‌నీసంలో క‌నీసం…

4 hours ago