Movie News

‘నిశ్శబ్దం’ అలా అనుకుంటే.. ఇలా అయింది

థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురు చూసి, చూసి చివరికి ఓటీటీ విడుదలకు సిద్ధమైపోయిన సినిమా ‘నిశ్శబ్దం’. అక్టోబరు 2న ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన అనుష్కతో పాటు తమిళ విలక్షణ నటుడు మాధవన్, హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్సన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించడం విశేషం.

ఇంతకుముందు మంచు విష్ణుతో ‘వస్తాడు నా రాజు’ లాంటి ఫ్లాప్ మూవీ తీసిన హేమంత్ మధుకర్.. ఇంతి పెద్ద కాస్ట్‌తో, పెద్ద బడ్జెట్లో ఇలాంటి సినిమా తీయడం విశేషమే. ఐతే ముందు అయితే అతను ‘నిశ్శబ్దం’ తీయాలనుకున్నది అనుష్కతో కాదట. దాని బడ్జెట్ కూడా తక్కువట. పైగా దీన్ని మూకీ మూవీగా తీయాలన్నది అతడి ఆలోచనట. ఐతే తర్వాత అన్నీ మారిపోయినట్లు అతను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

‘వస్తాడు నా రాజు’ తర్వాత తాను, మణిశర్మ నిర్మాతలుగా మారి తన దర్శకత్వంలో హిందీలో ‘ముంబయి 125’ అనే త్రీడీ మూవీ తీశామని.. ఐతే అది ఏమాత్రం ఆడకపోవడంతో డబ్బులన్నీ పోయాయని.. ఆపై తాను ఏదైనా వెరైటీ సినిమా చేద్దామన్న ఆలోచనతో ‘నిశ్శబ్దం’ కథ రాసుకుని ముందుగా మాధవన్‌కు వినిపించానని.. ఆయన చాలా బాగుందని అన్నారని.. తాప్సిని హీరోయిన్ పాత్రకు అనుకున్నామని.. పీవీపీ, నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారని.. అప్పటికి అది మూకీ మూవీగానే అనుకున్నామని హేమంత్ తెలిపాడు.

ఐతే ఒకసారి అనుకోకుండా కోన వెంకట్‌ను కలిసినపుడు కథ చెబితే.. ఇది చాలా బాగుందని.. దీన్ని పెద్ద స్థాయిలో, ఇంటర్నేషనల్ లెవెల్లో చేద్దామని చెప్పాడని.. తర్వాత అనుష్కకు ఆయనే కథ చెప్పి ఒప్పించారని.. తర్వాత గోపీ మోహన్‌తో కలిసి అమెరికా బ్యాక్‌డ్రాప్‌తో కథను మార్చానని హేమంత్ వెల్లడించాడు. మూకీగా చేస్తే కమర్షియల్‌గా అనుకున్నంత స్థాయికి సినిమా వెళ్లదని, నిర్మాతల శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచుకుని టాకీగానే చేయాలని తర్వాత అనుకున్నామని.. అప్పుడు కోన వెంకట్ కూర్చుని ఈ కథకు మాటలు రాశాడని.. అలా ఈ సినిమా స్వరూపం మారిపోయిందని హేమంత్ వెల్లడించాడు.

This post was last modified on September 23, 2020 12:24 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

4 mins ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

1 hour ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

4 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

4 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

5 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

5 hours ago