బాహుబలి తర్వాత సాహోకి విపరీతమైన గ్యాప్ తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత రాధేశ్యామ్ కు అదే ఇబ్బంది పడాల్సి వచ్చింది. దీనివల్ల ఏడాదికి కనీసం ఒక్క సినిమా చూడలేకపోతున్నామని అభిమానులు తెగబాధ పడుతూ వచ్చారు. అందుకే మొన్నటి ఏడాది ప్రభాస్ ఒక ప్రమోషన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇకపై సంవత్సరానికి మూడు రిలీజులు ఉండేలా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. నిజానికి ఆ మాట నమ్మనివాళ్ళే ఎక్కువ. ఎందుకంటే చాలా మంది స్టార్ హీరోలకు రెండేళ్లకు ఒక మూవీ చేయడమే పెద్ద ప్రాణసంకటంగా మారింది. అలాంటప్పుడు ట్రిపుల్ ధమాకా అంటే జరగని పని.
కానీ ప్రభాస్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. 2023 జూన్ నుంచి 2024 జూన్ దాకా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం పన్నెండు నెలల కాలంలో మూడు సినిమాలు విడుదలయ్యాయి. గత ఏడాది జూన్ లో ఆదిపురుష్, డిసెంబర్ లో సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ వచ్చాయి. ఇప్పుడు తిరిగి జూన్ లోనే కల్కి 2898 ఏడి ప్రేక్షకుల ముందుకొస్తోంది. ప్రభాస్ రేంజ్ స్టార్ హీరోలను ఎవరిని చూసుకున్నా ఇంత వేగంగా ప్లాన్ చేసుకున్న వాళ్ళు దరిదాపుల్లో కనిపించరు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఇలా ఎవరిది చూసినా అందరికి ఏళ్లకేళ్లు గ్యాప్ ఉన్న ఒకే కథ.
ఇకపై కూడా ప్రభాస్ జోరు తగ్గించే మూడ్ లో లేడు. సందీప్ వంగా స్పిరిట్, హను రాఘవపూడిల పీరియాడిక్ డ్రామా సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. మారుతీ ది రాజా సాబ్ ఎట్టి పరిస్థితిల్లో 2024 చివరికల్లా అయిపోవాలి. మధ్యలో ఒకవేళ సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం, కల్కి 2 కనక లైన్లోకి వస్తే సెట్స్ పైకి వెళ్లనివాటిలో ఏదో ఒకటి ఆలస్యం అవ్వొచ్చు . ఎంత ఒత్తిడిలో ఉన్నా తన నిర్మాతలు సేఫ్ కావాల్సిన అవసరాన్ని గుర్తించి దానికి తగ్గట్టు సహకారం ఇస్తున్న ప్రభాస్ ఇదే వేగాన్ని ఇకపై కూడా కొనసాగించే ఉద్దేశంలో ఉన్నాడని సన్నిహితుల మాట. ఫ్యాన్స్ కి కావాల్సింది కూడా అదేగా.
This post was last modified on June 11, 2024 3:18 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…