కేంద్రంలో మంత్రి పదవి అంటే చాలా కీలకంగా భావిస్తారు. జాతీయ రాజకీయాల్లో ఉన్నవారు.. లేదా ఎంపీలుగా గెలిచిన వారు కేంద్రంలో మంత్రులుగా ఉండాలని కోరుకుంటారు. కనీసం.. సహాయ మంత్రి అయినా ఫర్వాలేదు .. అనుకుంటారు. గతంలో ఓ కీలక పార్టీ జాతీయ పార్టీలో విలీనం అయినప్పుడు కూడా సదరు నాయకుడు మంత్రి పదవినే కోరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఉన్న మంత్రి పదవులకు డిమాండ్ కూడా ఉంటుంది.
తాజాగా ఏపీ నుంచి ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. వీరిలో ఇద్దరు టీడీపీ నాయకులు, మరొకరు బీజేపీ నాయకుడు. వీరిలోనూ ఇద్దరు తొలిసారి పార్లమెంటుకు ఎన్నికైన వారు కావడం గమనార్హం. మరొకరు మాత్రం వరుసగా మూడు సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మరి వీరికి ఇచ్చిన పదవులు.. వారు ఏపీకి చేసే మేళ్లు ఏంటి? అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అవేంటో చూద్దాం..
కింజరాపు రామ్మోహన్ నాయుడు: ఈయన శ్రీకాకుళం నుంచి టీడీపీ టికెట్పై 2014 ఎన్నికలనుంచి వరుసగా గెలుస్తున్నారు. తాజాగా ఆయనకు మోడీ సర్కారులో పౌర విమానయాన శాఖ లభించింది. ఇది జాతీయ స్తాయిలో మెన్నదగిన పదవే కానీ.. రాష్ట్ర స్థాయిలో పెద్దగా ఈ పదవి వల్ల ఒరిగేది ఉండనేది నిజం. ఒకవేళ ఉన్నా.. కేవలం విమానాశ్రాయాల్లో మౌలిక సదుపాయాలు, భోగాపురం, కడప, గన్నవరం, విశాఖ వంటి విమానాశ్రయాలను మెరుగు పరిచేందుకు మాత్రమే ఆయన సేవలు ఉపయుక్తంగా మారతాయి.
పెమ్మసాని చంద్రశేఖర్: ఈయన తొలిసారి గుంటూరు పార్లమెంటుస్థానం నుంచి టీడీపీ టికెట్పై విజయం దక్కించుకున్న ఎన్నారై నాయకుడు. ఈయనకు సహాయ మంత్రి పదవి లభించింది. ఈయనకు గ్రామీణా భివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖకు సహాయ మంత్రిత్వ శాఖ దక్కింది. ఇది కొంత మేరకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాజధాని నిర్మాణంలో కొంత మేరకు.. నగర , పట్టణాభివృద్ధి విషయంలో బలమైన సిఫారసులు చేసేందుకు అవకాశం ఉంది. ఇక, సమాచార రంగంలో ఫైబర్ నెట్ను తిరిగి తీసుకురానున్న నేపథ్యంలో పెమ్మసాని సేవలు కీలకంగా మారనున్నాయి. అయితే.. ఇవి మళ్లీ ఆయాశాఖలకు మంత్రిగా ఉన్నవారి ద్వారా ఆమోదం పొందాల్సి ఉంటుంది.
భూపతి రాజు శ్రీనివాసవర్మ: ఈయన బీజేపీ నుంచి తొలిసారి నరసాపురంలో విజయం దక్కించుకున్నారు. ఈయనకు కూడా సహాయ మంత్రి పదవి ఇచ్చారు. భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖలకు ఆయన సహాయ మంత్రిగా వ్యవహరిస్తారు. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో ఏపీ కోరికలను ఆయన వినిపించే అవకాశం ఉంది. అయితే.. బీజేపీ నాయకుడు కావడంతో ఏమేరకు ఆయన పని తనం ఉంటుందనేది చూడాలి. ఇక, భారీ పరిశ్రమల అభివృద్ధికి కొంత మేరకు ఆయన సాయం చేయొచ్చు. ఎలా చూసుకున్నా.. కేబినెట్ ర్యాంకు కాకపోవడంతో ఈయన చేసే మేళ్లు పరిమితంగానే ఉండే అవకాశం ఉంది.
This post was last modified on June 11, 2024 3:43 pm
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…