గొప్ప వ్యక్తుల జీవితాలను తెరమీద చూపించే క్రమంలో ఇప్పటిదాకా స్టార్లు, రాజకీయ నాయకులు, క్రీడాకారుల కథలు సినిమాలుగా వచ్చాయి. మహానటి లాంటివి అద్భుత విజయం సాధిస్తే తలైవి లాంటివి పరాజయం పాలయ్యాయి. కానీ ఎప్పటికప్పుడు కొత్త తరానికి మహనీయుల గాథలు చెప్పడం అవసరం.
ఈ రోజు నింగికేగిన మీడియా మేరు పర్వతం రామోజీరావు గురించి ప్రస్తుతం అలాంటి చర్చే జరుగుతోంది. ఒక సాధారణ దినపత్రికతో మొదలుపెట్టి దాన్ని అత్యధిక సర్కులేషన్ దాకా తీసుకెళ్లి ఏషియాలోనే అత్యంత పెద్దయిన రామోజీ సిటీ నిర్మాణం దాకా ఆయన జీవితంలో లెక్కలేనన్ని ఒడిదుడుకులు ఉన్నాయి.
భవిష్యత్తులో ఎవరు సినిమాగా మలుస్తారో చెప్పలేం కానీ ఇప్పటికిప్పుడు ఆయన లైఫ్ ని చదువుకోవాలంటే మాత్రం ఒక అవకాశం ఉంది. 2011లో ఈనాడు జర్నలిజం స్కూల్ విద్యార్థులు రామోజీరావు ల్యాండ్ మార్క్ పుట్టినరోజుని పురస్కరించుకుని ’75 వసంతాల వెలుగు’ పేరుతో ఒక బుక్కుని పబ్లిష్ చేశారు.
291 పేజీలతో ఇందులో సమగ్ర సమాచారం ఉంది. 1936 కృష్ణా జిల్లా పెదపారుపూడిలో పుట్టిన ఆయన తొలి ఇల్లు జ్ఞాపకంతో మొదలుపెట్టి తల్లి తండ్రులు, పూర్వీకులు, స్కూల్ చదువు, కళాశాల విద్య, ఉద్యోగం, వివాహం, హైదరాబాద్ రావడం, తొలి సంతానం లాంటి వ్యక్తిగత విశేషాలు ఎన్నో పొందుపరిచారు.
ఈనాడు స్థాపన, మార్గదర్శి చిట్ ఫండ్స్, డాల్ఫిన్ హోటల్, ఎరువుల వ్యాపారం, సితార – అన్నదాత – విపుల – చరిత పత్రికల ఆవిర్భావం, ఉషాకిరణ్ మూవీస్ ప్రస్థానం, ఎన్టీఆర్ తీర్పులో క్యామియో చేయడం, ఈటీవీ ఆవిష్కరణ ఇలా బోలెడు సంగతులు అరుదైన ఫొటోలతో సహా ఇచ్చారు.
అంతే కాదు రామోజీరావు సంస్థలో పనిచేసిన వాళ్ళ అనుభవాలు, ఆయన స్ఫూర్తితో గొప్ప స్థాయికి చేరుకున్న విజేతల కథలు బోలెడున్నాయి. ఆశ్చర్యం కలిగించే ఎప్పుడూ చూడని ఛాయాచిత్రాలు బోలెడు చూసుకోవచ్చు. ఇప్పుడు అంత సులభంగా దొరకదు కానీ ఓపిగ్గా వెతికి పట్టుకుంటే రామోజీ జీవితంలో తొంగి చూడొచ్చు. 2021లో ఈనాడులో పని చేసిన గోవిందరాజు సి చక్రధర్ రాసిన ‘రామోజీరావు ఉన్నది ఉన్నట్టు’ పుస్తకం మరో చక్కని విజ్ఞానఖని.
This post was last modified on June 8, 2024 5:30 pm
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి మైండ్ గేమ్స్, సస్పెన్స్ త్రిల్లర్స్. 'క్షణం',…
రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది.…
బాలకృష్ణ ఖాకీ డ్రెస్సు వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్స్పెక్టర్. 1992లో…
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం లోక్సభ ఆమోదించిన దరిమిలా.. రాజ్యసభలో గురువారం ప్రవేశ పెట్టారు. కేంద్ర హోం శాఖ…
తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. ఆల్రెడీ అధిక శాతం మూతబడిపోయి ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్…
రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చాక సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ముంబైలో దీని స్పెషల్ ప్రీమియర్ చూసిన…