మనిషి సైకాలజీని తెలుసుకునేందుకు.. ఇప్పటికీ అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, ఈ సైకాలజీని రామోజీరావు.. ఎప్పుడో జీర్ణించుకున్నారు. మానవ మాత్రులు ఎవరైనా కూడా.. నిత్యనూతనత్వాన్ని కోరుకుంటారనేది ఆయనచెప్పే మాట. అందుకే.. ఆయన తన సంస్థలు.. తన విధానాల్లోనూ.. నిత్య నూతనత్వానికి పెద్ద పీట వేశారు. అది ఈనాడు సంస్థలైనా.. రామోజీ ఫిల్మ్ సిటీ అయినా.. ప్రతి విషయంలోనూ వినూత్నతకు పెద్ద పీట వేశారు.
ఈనాడు కార్యాలయాల విషయానికి వస్తే.. ప్రతి ఆరు మాసాలకు.. ప్రత్యేకత కనిపిస్తుంది. ఉన్నవి ఉన్నచోటే ఉండవు. అవి వేరే ప్రాంతానికి మారుతుంటాయి. ఉన్నది ఒక్క గదే.. అయినా.. నేడు ఉన్నట్టుగా రేపు ఆరు మాసాల తర్వాత.. వాటిలో మార్పులు కనిపిస్తాయి. ప్రతి మూడేళ్లకు ఉద్యోగులను బదిలీ చేస్తారు. ఇవన్నీ.. సైకాలజీని అనుసరించే చేస్తారు. చేసిన చోటే చేయడం.. కూర్చున్న చోటే కూర్చోవడం వంటి వాటితో నైపుణ్యాలు పెరగవని విశ్వసిస్తారు.
రామోజీఫిల్మ్ సిటీలో అయితే.. ఈ మార్పులు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ప్రతి ప్రాంతంలోనూ వినూ త్నత కనిపిస్తుంది. నిన్న ఉన్నట్టుగా.. ఆరు మాసాలత ర్వాత.. ఉండదు. గదులు మారతాయి.. వాతావరణం కూడా.. మారుతుంది. తద్వారా.. ఉద్యోగుల పనితీరులోనూ మార్పులు వచ్చేలా చేస్తాయన్నది రామోజీ అవలంభించిన సైకాలజీ విధానం. ఇది ఈనాడును, రామోజీ ఫిల్మ్ సిటీని.. కూడా నిత్యం నూతనంగా ఉంచాయి.
ఓ సందర్భంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రెండేళ్ల కిందట రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లాను.. ఇప్పుడు కూడా వెళ్లాను. కానీ.. అప్పటికీ.. ఇప్పటికీ.. చాలా తేడా కనిపించింది. ఏదో కొత్త ప్రపంచానికి వెళ్లినట్టుగా ఉంది. ఈ మార్పులు ప్రభుత్వంలోనూ రావాలి అని అన్నారు. ఇలా.. నిత్య నూతనత్వానికి పెద్దపీట వేసిన రామోజీరావు.. ఆసాంతం ఉద్యోగులను కూడా అదే బాటలో నడిపించారు.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…