మనిషి సైకాలజీని తెలుసుకునేందుకు.. ఇప్పటికీ అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, ఈ సైకాలజీని రామోజీరావు.. ఎప్పుడో జీర్ణించుకున్నారు. మానవ మాత్రులు ఎవరైనా కూడా.. నిత్యనూతనత్వాన్ని కోరుకుంటారనేది ఆయనచెప్పే మాట. అందుకే.. ఆయన తన సంస్థలు.. తన విధానాల్లోనూ.. నిత్య నూతనత్వానికి పెద్ద పీట వేశారు. అది ఈనాడు సంస్థలైనా.. రామోజీ ఫిల్మ్ సిటీ అయినా.. ప్రతి విషయంలోనూ వినూత్నతకు పెద్ద పీట వేశారు.
ఈనాడు కార్యాలయాల విషయానికి వస్తే.. ప్రతి ఆరు మాసాలకు.. ప్రత్యేకత కనిపిస్తుంది. ఉన్నవి ఉన్నచోటే ఉండవు. అవి వేరే ప్రాంతానికి మారుతుంటాయి. ఉన్నది ఒక్క గదే.. అయినా.. నేడు ఉన్నట్టుగా రేపు ఆరు మాసాల తర్వాత.. వాటిలో మార్పులు కనిపిస్తాయి. ప్రతి మూడేళ్లకు ఉద్యోగులను బదిలీ చేస్తారు. ఇవన్నీ.. సైకాలజీని అనుసరించే చేస్తారు. చేసిన చోటే చేయడం.. కూర్చున్న చోటే కూర్చోవడం వంటి వాటితో నైపుణ్యాలు పెరగవని విశ్వసిస్తారు.
రామోజీఫిల్మ్ సిటీలో అయితే.. ఈ మార్పులు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ప్రతి ప్రాంతంలోనూ వినూ త్నత కనిపిస్తుంది. నిన్న ఉన్నట్టుగా.. ఆరు మాసాలత ర్వాత.. ఉండదు. గదులు మారతాయి.. వాతావరణం కూడా.. మారుతుంది. తద్వారా.. ఉద్యోగుల పనితీరులోనూ మార్పులు వచ్చేలా చేస్తాయన్నది రామోజీ అవలంభించిన సైకాలజీ విధానం. ఇది ఈనాడును, రామోజీ ఫిల్మ్ సిటీని.. కూడా నిత్యం నూతనంగా ఉంచాయి.
ఓ సందర్భంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రెండేళ్ల కిందట రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లాను.. ఇప్పుడు కూడా వెళ్లాను. కానీ.. అప్పటికీ.. ఇప్పటికీ.. చాలా తేడా కనిపించింది. ఏదో కొత్త ప్రపంచానికి వెళ్లినట్టుగా ఉంది. ఈ మార్పులు ప్రభుత్వంలోనూ రావాలి అని అన్నారు. ఇలా.. నిత్య నూతనత్వానికి పెద్దపీట వేసిన రామోజీరావు.. ఆసాంతం ఉద్యోగులను కూడా అదే బాటలో నడిపించారు.
This post was last modified on June 8, 2024 5:36 pm
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…