మనిషి సైకాలజీని తెలుసుకునేందుకు.. ఇప్పటికీ అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, ఈ సైకాలజీని రామోజీరావు.. ఎప్పుడో జీర్ణించుకున్నారు. మానవ మాత్రులు ఎవరైనా కూడా.. నిత్యనూతనత్వాన్ని కోరుకుంటారనేది ఆయనచెప్పే మాట. అందుకే.. ఆయన తన సంస్థలు.. తన విధానాల్లోనూ.. నిత్య నూతనత్వానికి పెద్ద పీట వేశారు. అది ఈనాడు సంస్థలైనా.. రామోజీ ఫిల్మ్ సిటీ అయినా.. ప్రతి విషయంలోనూ వినూత్నతకు పెద్ద పీట వేశారు.
ఈనాడు కార్యాలయాల విషయానికి వస్తే.. ప్రతి ఆరు మాసాలకు.. ప్రత్యేకత కనిపిస్తుంది. ఉన్నవి ఉన్నచోటే ఉండవు. అవి వేరే ప్రాంతానికి మారుతుంటాయి. ఉన్నది ఒక్క గదే.. అయినా.. నేడు ఉన్నట్టుగా రేపు ఆరు మాసాల తర్వాత.. వాటిలో మార్పులు కనిపిస్తాయి. ప్రతి మూడేళ్లకు ఉద్యోగులను బదిలీ చేస్తారు. ఇవన్నీ.. సైకాలజీని అనుసరించే చేస్తారు. చేసిన చోటే చేయడం.. కూర్చున్న చోటే కూర్చోవడం వంటి వాటితో నైపుణ్యాలు పెరగవని విశ్వసిస్తారు.
రామోజీఫిల్మ్ సిటీలో అయితే.. ఈ మార్పులు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ప్రతి ప్రాంతంలోనూ వినూ త్నత కనిపిస్తుంది. నిన్న ఉన్నట్టుగా.. ఆరు మాసాలత ర్వాత.. ఉండదు. గదులు మారతాయి.. వాతావరణం కూడా.. మారుతుంది. తద్వారా.. ఉద్యోగుల పనితీరులోనూ మార్పులు వచ్చేలా చేస్తాయన్నది రామోజీ అవలంభించిన సైకాలజీ విధానం. ఇది ఈనాడును, రామోజీ ఫిల్మ్ సిటీని.. కూడా నిత్యం నూతనంగా ఉంచాయి.
ఓ సందర్భంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రెండేళ్ల కిందట రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లాను.. ఇప్పుడు కూడా వెళ్లాను. కానీ.. అప్పటికీ.. ఇప్పటికీ.. చాలా తేడా కనిపించింది. ఏదో కొత్త ప్రపంచానికి వెళ్లినట్టుగా ఉంది. ఈ మార్పులు ప్రభుత్వంలోనూ రావాలి అని అన్నారు. ఇలా.. నిత్య నూతనత్వానికి పెద్దపీట వేసిన రామోజీరావు.. ఆసాంతం ఉద్యోగులను కూడా అదే బాటలో నడిపించారు.
This post was last modified on June 8, 2024 5:36 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…