మనిషి సైకాలజీని తెలుసుకునేందుకు.. ఇప్పటికీ అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, ఈ సైకాలజీని రామోజీరావు.. ఎప్పుడో జీర్ణించుకున్నారు. మానవ మాత్రులు ఎవరైనా కూడా.. నిత్యనూతనత్వాన్ని కోరుకుంటారనేది ఆయనచెప్పే మాట. అందుకే.. ఆయన తన సంస్థలు.. తన విధానాల్లోనూ.. నిత్య నూతనత్వానికి పెద్ద పీట వేశారు. అది ఈనాడు సంస్థలైనా.. రామోజీ ఫిల్మ్ సిటీ అయినా.. ప్రతి విషయంలోనూ వినూత్నతకు పెద్ద పీట వేశారు.
ఈనాడు కార్యాలయాల విషయానికి వస్తే.. ప్రతి ఆరు మాసాలకు.. ప్రత్యేకత కనిపిస్తుంది. ఉన్నవి ఉన్నచోటే ఉండవు. అవి వేరే ప్రాంతానికి మారుతుంటాయి. ఉన్నది ఒక్క గదే.. అయినా.. నేడు ఉన్నట్టుగా రేపు ఆరు మాసాల తర్వాత.. వాటిలో మార్పులు కనిపిస్తాయి. ప్రతి మూడేళ్లకు ఉద్యోగులను బదిలీ చేస్తారు. ఇవన్నీ.. సైకాలజీని అనుసరించే చేస్తారు. చేసిన చోటే చేయడం.. కూర్చున్న చోటే కూర్చోవడం వంటి వాటితో నైపుణ్యాలు పెరగవని విశ్వసిస్తారు.
రామోజీఫిల్మ్ సిటీలో అయితే.. ఈ మార్పులు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ప్రతి ప్రాంతంలోనూ వినూ త్నత కనిపిస్తుంది. నిన్న ఉన్నట్టుగా.. ఆరు మాసాలత ర్వాత.. ఉండదు. గదులు మారతాయి.. వాతావరణం కూడా.. మారుతుంది. తద్వారా.. ఉద్యోగుల పనితీరులోనూ మార్పులు వచ్చేలా చేస్తాయన్నది రామోజీ అవలంభించిన సైకాలజీ విధానం. ఇది ఈనాడును, రామోజీ ఫిల్మ్ సిటీని.. కూడా నిత్యం నూతనంగా ఉంచాయి.
ఓ సందర్భంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రెండేళ్ల కిందట రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లాను.. ఇప్పుడు కూడా వెళ్లాను. కానీ.. అప్పటికీ.. ఇప్పటికీ.. చాలా తేడా కనిపించింది. ఏదో కొత్త ప్రపంచానికి వెళ్లినట్టుగా ఉంది. ఈ మార్పులు ప్రభుత్వంలోనూ రావాలి అని అన్నారు. ఇలా.. నిత్య నూతనత్వానికి పెద్దపీట వేసిన రామోజీరావు.. ఆసాంతం ఉద్యోగులను కూడా అదే బాటలో నడిపించారు.
బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్లో కొనసాగుతున్న…
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…