సంపాదకీయం… నేటి భాషలో చెప్పాలంటే ఎడిటోరియల్!. ఈనాడు ప్రారంభానికి ముందు కూడా అనేక పత్రికలు ఉన్నాయి. అనేక మంది మహామహులు ఎడిటోరియల్స్ రాసేవారు. అయితే.. అవన్నీ ఓ మూస ధోరణిలోనే ముందుకు సాగాయి. దీంతో సంపాదకీయం అంటే.. పత్రిక చెప్పే.. అభిప్రాయంగా మారిపో యింది. దీంతో అది కూడా.. ఒక వార్త లేదా.. విశ్లేషణగా ఒక వ్యక్తి అభిప్రాయంగా మాత్రమే నిలిచిపోయిం ది. దీంతో సంపాదకీయాలు పెద్దగా ప్రజల్లోకి చేరలేక పోయాయి.
కానీ, ఈనాడు ప్రారంభంతో సంపాదకీయాలకు ఒక్క కొత్త ఒరవడి వచ్చి చేరింది. సంపాదకీయం అంటే. వ్యక్తి అభిప్రాయం కాదు.. సమాజ అభిప్రాయం.. సగటు పౌరుడి అభిప్రాయం అనేలా .. ఈనాడు సంపాద కీయాలను తీర్చిదిద్దారు రామోజీ. అప్పటి వరకు జరిగిన పరిణామాలను గుదిగుచ్చి.. వాటిపై సామాన్యుడు ఎలా స్పందిస్తాడో..అచ్చం అలానే స్పందించారు. స్వయంగా ఆయనే మూడు దశాబ్దాల పాటు సంపాద కీయాలు రాస్తూ వచ్చారు.
అంతేకాదు.. సంపాదకీయం అంటే.. తేలికగా ఉండకూడదనే ధోరణే ధోరణితో.. బలమైన వాడుక భాషతో.. అంతేబలమైన పదాలతో సందర్భోచితంగా.. రాసుకున్న సంపాదకీయాలు అనేక మంది సాహితీవేత్తలను కూడా.. అబ్బుర పరిచాయి. తొలినాళ్లలో ప్రముఖ కవి వేటూరి సుందరరామమూర్తిని కేవలం సంపాదకీయా ల పర్యవేక్షక బోర్డులో ఉద్యోగిగా చేర్చుకున్నారు. తర్వాత.. ఆచార్య కొనకలూరి ఇనాక్ నుంచి ఆచార్య సి. నారాయణరెడ్డి వరకు అనేక మంది సాహితీవేత్తలు సంపాదకీయాలకు సరుకు అందించారు.
అందుకే.. ఈనాడు సంపాదకీయం అంటే..పత్రికకే కాదు.. నేటికీ పాత్రికేయానికి.. మణిమకుటంగా నిలిచి పోయేలా చేయగలిగారు రామోజీ. సమస్యను ప్రస్తావించడమే కాదు… పరిష్కారం చూపించడంలోనూ సంపాదకత్వం బాధ్యతను ఆయన సంపూర్ణంగా నెరవేర్చారు. నేటికీ తెలుగు పత్రికల్లో సంపాదకీయం అంటే.. ఈనాడు.. ఈనాడు అంటే సంపాదకీయం! అనే మాట వినిపిస్తుంది. అంత అద్భుతంగా.. ఈనాడు ఆత్మను సంపాదకీయంలో కూర్చి.. అక్షరాలు పేర్చి.. ప్రజా బాహుళ్యానికి గుండె చప్పుడు అయ్యారు.
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…
బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…
తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం…