సంపాదకీయం… నేటి భాషలో చెప్పాలంటే ఎడిటోరియల్!. ఈనాడు ప్రారంభానికి ముందు కూడా అనేక పత్రికలు ఉన్నాయి. అనేక మంది మహామహులు ఎడిటోరియల్స్ రాసేవారు. అయితే.. అవన్నీ ఓ మూస ధోరణిలోనే ముందుకు సాగాయి. దీంతో సంపాదకీయం అంటే.. పత్రిక చెప్పే.. అభిప్రాయంగా మారిపో యింది. దీంతో అది కూడా.. ఒక వార్త లేదా.. విశ్లేషణగా ఒక వ్యక్తి అభిప్రాయంగా మాత్రమే నిలిచిపోయిం ది. దీంతో సంపాదకీయాలు పెద్దగా ప్రజల్లోకి చేరలేక పోయాయి.
కానీ, ఈనాడు ప్రారంభంతో సంపాదకీయాలకు ఒక్క కొత్త ఒరవడి వచ్చి చేరింది. సంపాదకీయం అంటే. వ్యక్తి అభిప్రాయం కాదు.. సమాజ అభిప్రాయం.. సగటు పౌరుడి అభిప్రాయం అనేలా .. ఈనాడు సంపాద కీయాలను తీర్చిదిద్దారు రామోజీ. అప్పటి వరకు జరిగిన పరిణామాలను గుదిగుచ్చి.. వాటిపై సామాన్యుడు ఎలా స్పందిస్తాడో..అచ్చం అలానే స్పందించారు. స్వయంగా ఆయనే మూడు దశాబ్దాల పాటు సంపాద కీయాలు రాస్తూ వచ్చారు.
అంతేకాదు.. సంపాదకీయం అంటే.. తేలికగా ఉండకూడదనే ధోరణే ధోరణితో.. బలమైన వాడుక భాషతో.. అంతేబలమైన పదాలతో సందర్భోచితంగా.. రాసుకున్న సంపాదకీయాలు అనేక మంది సాహితీవేత్తలను కూడా.. అబ్బుర పరిచాయి. తొలినాళ్లలో ప్రముఖ కవి వేటూరి సుందరరామమూర్తిని కేవలం సంపాదకీయా ల పర్యవేక్షక బోర్డులో ఉద్యోగిగా చేర్చుకున్నారు. తర్వాత.. ఆచార్య కొనకలూరి ఇనాక్ నుంచి ఆచార్య సి. నారాయణరెడ్డి వరకు అనేక మంది సాహితీవేత్తలు సంపాదకీయాలకు సరుకు అందించారు.
అందుకే.. ఈనాడు సంపాదకీయం అంటే..పత్రికకే కాదు.. నేటికీ పాత్రికేయానికి.. మణిమకుటంగా నిలిచి పోయేలా చేయగలిగారు రామోజీ. సమస్యను ప్రస్తావించడమే కాదు… పరిష్కారం చూపించడంలోనూ సంపాదకత్వం బాధ్యతను ఆయన సంపూర్ణంగా నెరవేర్చారు. నేటికీ తెలుగు పత్రికల్లో సంపాదకీయం అంటే.. ఈనాడు.. ఈనాడు అంటే సంపాదకీయం! అనే మాట వినిపిస్తుంది. అంత అద్భుతంగా.. ఈనాడు ఆత్మను సంపాదకీయంలో కూర్చి.. అక్షరాలు పేర్చి.. ప్రజా బాహుళ్యానికి గుండె చప్పుడు అయ్యారు.
This post was last modified on June 8, 2024 3:37 pm
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…
గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…