ఎన్నికల ప్రచారం ఉదృతంగా ఉన్న సమయంలో తన ప్రాణ స్నేహితుడనే కారణంతో వైసిపి అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డి కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల వెళ్లిన సంగతి గుర్తేగా. దాని మీద సోషల్ మీడియాలో ఓ మాదిరి దుమారమే లేచింది. క్యాంపైన్ చివరి రోజు పిఠాపురం వెళ్లి పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వకుండా అదే రోజు ఫ్రెండ్ పేరుతో సీమకు వెళ్లడం పట్ల పవన్ ఫ్యాన్స్ బహిరంగంగానే తమ అసంతృప్తిని తెలియజేశారు. ఇదంతా చూసే తెలంగాణ లోక్ సభ పోలింగ్ రోజు బన్నీ ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తన సపోర్ట్ పవన్ కు ఖచ్చితంగా ఉంటుందని నొక్కి చెప్పాడు.
తీరా చూస్తే ఇప్పుడీ శిల్పారవిచంద్రరెడ్డి ఓటమి దిశగా వెళ్తున్నట్టు ట్రెండ్ స్పష్టం చేస్తోంది. టిడిపి అభ్యర్థి ఫరూక్ పదిహేను వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నట్టు ప్రాధమిక సమాచారం. ఇది ఇలాగే కొనసాగితే ఈ నెంబర్ ని దాటుకుని శిల్పా విజేతగా నిలవడం అసాధ్యం. ప్రచారానికి వచ్చినప్పుడు అల్లు అర్జున్ మాట్లాడుతూ తను కేవలం రవిచంద్ర గెలవాలని కోరుతూ సంఘీభావం తెలిపానని అన్నాడు. అంతే తప్ప వైసిపి మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్టుగా చెప్పలేదు. ఈ విషయంలో తెలివిగా వ్యవహరించినా సరే పబ్లిక్ లోకి మాత్రం తన ఉద్దేశం మరోలా వెళ్లిపోయిందన్నది వాస్తవం.
సరే బన్నీ వచ్చినంత మాత్రాన, వేలాది అభిమానులు గుమికూడినంత మాత్రాన శిల్పా గెలుస్తాడని గ్యారెంటీ లేదు కానీ తన ప్రభావం అంతో ఇంతో ఉంటుందని భావించిన ఫ్యాన్స్ మాత్రం తాజా పరిణామాలు చూసి షాక్ తిన్నారు. ఇదంతా జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఏ కోణంలో తీసుకుంటారో చెప్పలేం కానీ పుష్ప 2 ది రూల్ విడుదల టైంలో మాత్రం తాము దూరంగా ఉంటామని చెబుతున్న ట్వీట్లు ఆన్ లైన్ లో కనిపిస్తున్నాయి. ఊహించిన ఫలితమే అయినా ఏపీ రాజకీయ చిత్రం చాలా అనూహ్యంగా మారిపోయి సరికొత్త సంచలనాలకు దారి తీస్తున్న మాట వాస్తవం.
This post was last modified on June 4, 2024 12:48 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…