ఎన్నికల ప్రచారం ఉదృతంగా ఉన్న సమయంలో తన ప్రాణ స్నేహితుడనే కారణంతో వైసిపి అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డి కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల వెళ్లిన సంగతి గుర్తేగా. దాని మీద సోషల్ మీడియాలో ఓ మాదిరి దుమారమే లేచింది. క్యాంపైన్ చివరి రోజు పిఠాపురం వెళ్లి పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వకుండా అదే రోజు ఫ్రెండ్ పేరుతో సీమకు వెళ్లడం పట్ల పవన్ ఫ్యాన్స్ బహిరంగంగానే తమ అసంతృప్తిని తెలియజేశారు. ఇదంతా చూసే తెలంగాణ లోక్ సభ పోలింగ్ రోజు బన్నీ ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తన సపోర్ట్ పవన్ కు ఖచ్చితంగా ఉంటుందని నొక్కి చెప్పాడు.
తీరా చూస్తే ఇప్పుడీ శిల్పారవిచంద్రరెడ్డి ఓటమి దిశగా వెళ్తున్నట్టు ట్రెండ్ స్పష్టం చేస్తోంది. టిడిపి అభ్యర్థి ఫరూక్ పదిహేను వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నట్టు ప్రాధమిక సమాచారం. ఇది ఇలాగే కొనసాగితే ఈ నెంబర్ ని దాటుకుని శిల్పా విజేతగా నిలవడం అసాధ్యం. ప్రచారానికి వచ్చినప్పుడు అల్లు అర్జున్ మాట్లాడుతూ తను కేవలం రవిచంద్ర గెలవాలని కోరుతూ సంఘీభావం తెలిపానని అన్నాడు. అంతే తప్ప వైసిపి మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్టుగా చెప్పలేదు. ఈ విషయంలో తెలివిగా వ్యవహరించినా సరే పబ్లిక్ లోకి మాత్రం తన ఉద్దేశం మరోలా వెళ్లిపోయిందన్నది వాస్తవం.
సరే బన్నీ వచ్చినంత మాత్రాన, వేలాది అభిమానులు గుమికూడినంత మాత్రాన శిల్పా గెలుస్తాడని గ్యారెంటీ లేదు కానీ తన ప్రభావం అంతో ఇంతో ఉంటుందని భావించిన ఫ్యాన్స్ మాత్రం తాజా పరిణామాలు చూసి షాక్ తిన్నారు. ఇదంతా జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఏ కోణంలో తీసుకుంటారో చెప్పలేం కానీ పుష్ప 2 ది రూల్ విడుదల టైంలో మాత్రం తాము దూరంగా ఉంటామని చెబుతున్న ట్వీట్లు ఆన్ లైన్ లో కనిపిస్తున్నాయి. ఊహించిన ఫలితమే అయినా ఏపీ రాజకీయ చిత్రం చాలా అనూహ్యంగా మారిపోయి సరికొత్త సంచలనాలకు దారి తీస్తున్న మాట వాస్తవం.
This post was last modified on June 4, 2024 12:48 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…