తెలుగులో కొన్నేళ్ల పాటు ఒక వెలుగు వెలిగింది బాలీవుడ్ భామ పూజా హెగ్డే. తొలి రెండు చిత్రాలు ముకుంద, ఒక లైలా కోసం ఫ్లాప్ అయినా.. మధ్యలో రెండేళ్లు గ్యాప్ వచ్చినా.. రీఎంట్రీలో చేసిన ‘దువ్వాడ జగన్నాథం’ కూడా సరిగా ఆడకపోయినా.. ఆమె దశ తిరిగింది. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్.. ఇలా పెద్ద పెద్ద హీరోల సరసన కథానాయికగా అవకాశాలు అందుకుంది.
కానీ వరుస పరాజయాలు ఎలాంటి హీరోయిన్కైనా బ్రేకులు వేస్తాయనడానికి పూజా ఉదంతమే ఉదాహరణ. రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్.. ఇలా వరుసగా మూడు డిజాస్టర్లు పడడంతో పూజా మీద ఇండస్ట్రీలో బాగా నెెగెటివిటీ పెరిగిపోయింది. దీంతో సడెన్గా ఆమెకు అవకాశాలు ఆగిపోయాయి. దీంతో మిడ్ రేంజ్ సినిమాల్లో చేయడానికి కూడా రెడీ అయింది. అయినా ఛాన్సుల్లేవు.
ఇలాంటి టైంలో దక్షిణాదిన మళ్లీ ఆమెకో పెద్ద అవకాశం వచ్చింది. తమిళ టాప్ స్టార్లలో ఒకడైన సూర్య సరసన పూజా సినిమా చేయబోతోంది. సూర్య హీరోగా ‘పిజ్జా’; ‘జిగర్ తండ’, ‘పేట’ చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఓ సినిమా తీయబోతున్నాడు. గత ఏడాది ‘జిగర్ తండ డబులెక్స్’తో పర్వాలేదనిపించిన కార్తీక్.. ఇటీవలే సూర్యతో సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ చిత్రానికి కథానాయికగా పూజాను ఖరారు చేస్తూ తాజాగా అనౌన్స్మెంట్ ఇచ్చారు. కెరీర్లో ఈ టైంలో సూర్య సరసన ఛాన్స్ అంటే పూజా కెరీర్ మళ్లీ టర్న్ అవుతున్నట్లే.
ఇందులో మలయాళ లెజెండరీ నటులు జయరాం, జోజు జార్జ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కార్తీక్ ఆస్థాన సంగీత దర్శకుడైన సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మరిందరు పేరున్న టెక్నీషియన్లు పని చేస్తున్నారు. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది.
This post was last modified on June 2, 2024 2:57 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…