ఎన్నికలు, ఐపీఎల్ పుణ్యమా అని వేసవిలో వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ ఎఫ్పుడు కళ వస్తుందా అని ఇండస్ట్రీ జనాలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ వారం వచ్చిన ‘లవ్ మి’ కొంత మేర థియేటర్లలో సందడి తీసుకొచ్చింది.
వచ్చే వారానికి బాక్సాఫీస్లో మరింత కళ వస్తుందనే ఆశలు రేగుతున్నాయి. ఆ వీకెండ్కు ముందు ఐదు చిత్రాలు షెడ్యూల్ అయ్యాయి. కానీ పోటీ ఎక్కువగా ఉందని సుధీర్ బాబు సినిమా ‘హరోంహర’ను, కాజల్ మూవీ ‘సత్యభామ’ను వాయిదా వేసేశారు.
చివరికి మూడు చిత్రాలు రేసులో మిగిలాయి. వీటిలో ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నది విశ్వక్సేన్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’నే. ఈ సినిమాకు ముందు నుంచి మంచి హైపే ఉంది. ఇప్పుడు రిలీజైన ట్రైలర్ బాగా పేలడంతో హైప్ ఇంకా పెరిగింది.
సమ్మర్ స్లంప్ తర్వాత ప్రేక్షకులు ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’నే. వచ్చే వారానికి ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ ఇదే. ఈ చిత్రం రొటీన్కు భిన్నంగా అనిపిస్తోంది. అదే రోజు రిలీజయ్యే ‘భజే వాయు వేగం’; ‘గం గం గణేశా’లకు ఇప్పటికైతే పెద్దగా హైప్ లేదు.
ఇవి సగటు హైస్ట్ థ్రిల్లర్స్ లాగా అనిపిస్తున్నాయి. రెండు చిత్రాల మధ్య పోలిక కనిపిస్తోంది. దీంతో విశ్వక్ నుంచి కార్తికేయ, ఆనంద్ దేవరకొండలకు ముప్పు పొంచి ఉన్నట్లే. కార్తికేయ చాలా కాలంగా సరైన సక్సెస్ లేకపోవడం పెద్ద మైనస్.
ఆనంద్ విషయానికి వస్తే ‘బేబి’ తర్వాత అతడి నుంచి వస్తున్న సినిమా అయినా.. చాలా ఆలస్యం కావడం ‘గం గం గణేశా’కు ప్రతికూలంగా మారుతోంది. ఐతే టాక్ బాగుంటే ఈ సినిమాలు పుంజుకోవడానికి మంచి ఛాన్సే ఉంటుంది. బాగున్న సినిమాలు పడితే ఒకేవారం రెండు మూడు చిత్రాలకు కూడా ఆదరణ దక్కుతుంది కాబట్టి ఈ చిత్రాల మేకర్స్ ఆశాభావంతో ఉండొచ్చు.
This post was last modified on May 26, 2024 4:06 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…