ఎన్నికలు, ఐపీఎల్ పుణ్యమా అని వేసవిలో వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ ఎఫ్పుడు కళ వస్తుందా అని ఇండస్ట్రీ జనాలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ వారం వచ్చిన ‘లవ్ మి’ కొంత మేర థియేటర్లలో సందడి తీసుకొచ్చింది.
వచ్చే వారానికి బాక్సాఫీస్లో మరింత కళ వస్తుందనే ఆశలు రేగుతున్నాయి. ఆ వీకెండ్కు ముందు ఐదు చిత్రాలు షెడ్యూల్ అయ్యాయి. కానీ పోటీ ఎక్కువగా ఉందని సుధీర్ బాబు సినిమా ‘హరోంహర’ను, కాజల్ మూవీ ‘సత్యభామ’ను వాయిదా వేసేశారు.
చివరికి మూడు చిత్రాలు రేసులో మిగిలాయి. వీటిలో ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నది విశ్వక్సేన్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’నే. ఈ సినిమాకు ముందు నుంచి మంచి హైపే ఉంది. ఇప్పుడు రిలీజైన ట్రైలర్ బాగా పేలడంతో హైప్ ఇంకా పెరిగింది.
సమ్మర్ స్లంప్ తర్వాత ప్రేక్షకులు ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’నే. వచ్చే వారానికి ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ ఇదే. ఈ చిత్రం రొటీన్కు భిన్నంగా అనిపిస్తోంది. అదే రోజు రిలీజయ్యే ‘భజే వాయు వేగం’; ‘గం గం గణేశా’లకు ఇప్పటికైతే పెద్దగా హైప్ లేదు.
ఇవి సగటు హైస్ట్ థ్రిల్లర్స్ లాగా అనిపిస్తున్నాయి. రెండు చిత్రాల మధ్య పోలిక కనిపిస్తోంది. దీంతో విశ్వక్ నుంచి కార్తికేయ, ఆనంద్ దేవరకొండలకు ముప్పు పొంచి ఉన్నట్లే. కార్తికేయ చాలా కాలంగా సరైన సక్సెస్ లేకపోవడం పెద్ద మైనస్.
ఆనంద్ విషయానికి వస్తే ‘బేబి’ తర్వాత అతడి నుంచి వస్తున్న సినిమా అయినా.. చాలా ఆలస్యం కావడం ‘గం గం గణేశా’కు ప్రతికూలంగా మారుతోంది. ఐతే టాక్ బాగుంటే ఈ సినిమాలు పుంజుకోవడానికి మంచి ఛాన్సే ఉంటుంది. బాగున్న సినిమాలు పడితే ఒకేవారం రెండు మూడు చిత్రాలకు కూడా ఆదరణ దక్కుతుంది కాబట్టి ఈ చిత్రాల మేకర్స్ ఆశాభావంతో ఉండొచ్చు.
This post was last modified on May 26, 2024 4:06 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…