ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. గట్టిగానే ప్రచారం చేసుకున్నా రు. పార్టీ ఏఐసీసీ చీఫ్మల్లికార్జున ఖర్గే నుంచి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వరకు కీలక నేతలను తెచ్చు కుని కడపలో ప్రచారం చేయించారు. సబలు పెట్టారు. సెంటిమెంటు కురిపించారు. ఎవరూ ఊహించని విధంగా కరడు గట్టిన ప్రత్యర్థులు కూడా టార్గెట్ చేయలేని విధంగా సీఎం జగన్ను.. దునుమాడారు. తీవ్ర వ్యాఖ్యలతో ఇరుకున పెట్టారు. బాబాయి హత్య నుంచి మహిళల రక్షణ వరకు కూడా ఆమె టచ్ చేయని అంశం లేదు.
దీనికి తోడు వివేకా కుటుంబం పూర్తిగా షర్మిల వైపు నిలబడింది. సునీత, ఆమె తల్లి సౌభాగ్యమ్మలు కూడా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా షర్మిలకు ప్రచారం చేశారు. ఇక, చివరి రోజు.. వైఎస్ విజయమ్మ కూడా వీడియో సందేశం ఇచ్చారు.బ్రదర్ అనిల్ లోపాయికారీగా.. చర్చిల్లో ప్రచారం చేశారనే వార్తలు వచ్చాయి. ఆయన ఖండించినా.. ఇది నిజమనని క్షేత్రస్థాయిలో తెలిసింది. ఇక, షర్మిల మూడు నుంచి నాలుగు సార్లు.. వివిధ సందర్భాల్లో ప్రజల ముందే కన్నీరు పెట్టుకున్నారు. మొత్తానికి ఎన్నడూలేని విధంగా కడప పార్లమెంటు పరిధిలో ఓటర్లను ఒక కుదుపు కుదిపేశారు.
దీంతో షర్మిల విజయం ఖాయమని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అయితే.. కీడెంచి మేలెంచమ న్నట్టుగాషర్మిల గెలిస్తే.. ఓకే.. ఒకవేల గెలవకపోతే.. ఏం చేస్తారు? అనేది చర్చ. ఇది కూడా నాణేనికి మరోవైపు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి చర్చించుకోవడం తప్పుకాదు. ఇదే జరిగితే.. ఆమె మరో రాహుల్ గాంధీ అవుతారనే చర్చ సాగుతోంది. వాస్తవానికి కడప పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ.. వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు.. ఉంది. బంధుగణం కూడా ఉంది. వీరంతా షర్మిలకు అనుకూలమేనా? అంటే చెప్పడం కష్టం.
అందుకే.. షర్మిల ఓడితే.. అనే ప్రశ్న తెరమీదికి వచ్చింది. మరో ఐదేళ్లపాటు షర్మిల మరిన్ని కష్టాలు ఎదుర్కొనక తప్పేలా కనిపించడం లేదు. పైగా.. ఓటు బ్యాంకు పెరిగినా.. అది అధికారాన్ని అందించే స్థాయికి చేర్చుకునేలా ఉండదు. కాబట్టి..ఇది షర్మిల ఓటమికి మరింత ఇబ్బందిగా మారి.. మరో సమస్యగా కూర్చునే చాన్స్ ఉంటుంది. ప్రభుత్వంపై పోరాటం చేసినా.. ఇంతకన్నా ఎక్కువగా చేసే అవకాశం లేదు. పైగా ఓడిపోతే.. ఆ సింపతీ కూడా.. మిగిలే పరిస్థితి ఉండదు. సో.. అప్పుడు మరోసారి పాదయాత్ర చేయడమో.. లేక మరో వ్యూహంతో ముందుకు రావడమో షర్మిల ముందు ఉంటుంది. మరి ఏం చేస్తారో చూడాలి. మొత్తానికి ఆమె గెలవాలనే కోరుకుంటున్నవారు ఎక్కువగా ఉండడం గమనార్హం.
This post was last modified on May 26, 2024 1:11 pm
బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…
బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…
ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…
కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…