ఫిలిం సెలబ్రెటీలు, రాజకీయ నేతలు ఏదో ఫ్లోలో కొన్నిసార్లు నోరు జారుతుంటారు. కొందరిని హర్ట్ చేసేలా మాట్లాడతారు. ఐతే తాము తప్పు మాట్లాడామని.. ఎవరి మనోభావాలనైనా కించపరిచామని భావిస్తే సింపుల్గా సారీ చెప్పేస్తే సరిపోతుంది. మళ్లీ అక్కడ సన్నాయి నొక్కులు నొక్కకుండా ఉండడమే తెలివైన పద్ధతి. మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని.. జనం తప్పుగా అర్థం చేసుకున్నారని.. ఇలా ఏవేవో మాట్లాడి ఇంకా వివాదాన్ని పెద్దది చేస్తూ ఉంటారు. అవతలి వాళ్లకు ఇంకా కోపం తెప్పిస్తుంటారు. కానీ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్రం అలా చేయలేదు. తాను ఐపీఎల్ విషయంలో తప్పు మాట్లాడానని భావించి ఆ విషయం అంగీకరించి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాడు. సవరించుకున్నాడు.
మొన్న ఒక సినిమా ఈవెంట్లో అనిల్ మాట్లాడుతూ.. ఈ సమయంలో ఐపీఎల్ చూడకపోతే కొంపలేం మునిగిపోవని.. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తూ మధ్యలో స్కోర్లు చెక్ చేసుకోవచ్చని వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్ ఐపీఎల్ అభిమానులకు మంటెత్తిపోయేలా చేసింది. ఫ్రీగా టీవీలో, మొబైల్లో తమకు నచ్చే ఐపీఎల్ చూసి ఎంజాయ్ చేస్తుంటే అనిల్కేంటి ఇబ్బంది అని.. దీని బదులు డబ్బులు పెట్టి విషయం లేని సినిమాలు చూడాలా అంటూ అనిల్ మీద ఎదురుదాడి చేశారు. ఐపీఎల్ చూడొద్దని చెప్పడానికి నువ్వెవరు అంటూ మండిపడ్డారు.
ఫీడ్ బ్యాక్ అనిల్ వరకు వచ్చి.. లేటెస్ట్గా మరో ఈవెంట్లో తన వ్యాఖ్యలపై సారీ చెప్పాడు. ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ ఐపీఎల్ కామెంట్ మీద స్పందించమని అడిగితే.. ఏంటి నువ్వు కూడా హర్టయ్యావా అని నవ్వుతూ మాట్లాడిన అనిల్.. ఈ కామెంట్ విషయంలో తాను కూడా హర్టయ్యానని వ్యాఖ్యానించాడు. తాను కూడా ఐపీఎల్ అభిమానినే అని.. మొన్న ఎవరో డిస్ట్రిబ్యూటర్ సమ్మర్ సీజన్లో సినిమాలు ఆడట్లేదని.. చిన్న సినిమాలకు ఇబ్బంది అవుతోందని అంటే ఆ బాధతో ఆ కామెంట్ చేశానని.. అంతే తప్ప ఎవరినీ హర్ట్ చేయాలని కాదని.. అందరూ ఐపీఎల్ చూడాలని.. మధ్యలో ఖాళీ దొరికితే సినిమాలు చూడాలని అన్నాడు అనిల్. తన కామెంట్ను వెనక్కి తీసుకోవడం ద్వారా అనిల్ లౌక్యంతో వ్యవహరించాడని.. ఇలా నోరు జారినపుడు హుందాగా సారీ చెప్పి వ్యాఖ్యలను సవరించుకోవడం చాలా అవసరమని.. ఈ విషయంలో అనిల్ను చూసి సెలబ్రెటీలు నేర్చుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…