ఫిలిం సెలబ్రెటీలు, రాజకీయ నేతలు ఏదో ఫ్లోలో కొన్నిసార్లు నోరు జారుతుంటారు. కొందరిని హర్ట్ చేసేలా మాట్లాడతారు. ఐతే తాము తప్పు మాట్లాడామని.. ఎవరి మనోభావాలనైనా కించపరిచామని భావిస్తే సింపుల్గా సారీ చెప్పేస్తే సరిపోతుంది. మళ్లీ అక్కడ సన్నాయి నొక్కులు నొక్కకుండా ఉండడమే తెలివైన పద్ధతి. మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని.. జనం తప్పుగా అర్థం చేసుకున్నారని.. ఇలా ఏవేవో మాట్లాడి ఇంకా వివాదాన్ని పెద్దది చేస్తూ ఉంటారు. అవతలి వాళ్లకు ఇంకా కోపం తెప్పిస్తుంటారు. కానీ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్రం అలా చేయలేదు. తాను ఐపీఎల్ విషయంలో తప్పు మాట్లాడానని భావించి ఆ విషయం అంగీకరించి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాడు. సవరించుకున్నాడు.
మొన్న ఒక సినిమా ఈవెంట్లో అనిల్ మాట్లాడుతూ.. ఈ సమయంలో ఐపీఎల్ చూడకపోతే కొంపలేం మునిగిపోవని.. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తూ మధ్యలో స్కోర్లు చెక్ చేసుకోవచ్చని వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్ ఐపీఎల్ అభిమానులకు మంటెత్తిపోయేలా చేసింది. ఫ్రీగా టీవీలో, మొబైల్లో తమకు నచ్చే ఐపీఎల్ చూసి ఎంజాయ్ చేస్తుంటే అనిల్కేంటి ఇబ్బంది అని.. దీని బదులు డబ్బులు పెట్టి విషయం లేని సినిమాలు చూడాలా అంటూ అనిల్ మీద ఎదురుదాడి చేశారు. ఐపీఎల్ చూడొద్దని చెప్పడానికి నువ్వెవరు అంటూ మండిపడ్డారు.
ఫీడ్ బ్యాక్ అనిల్ వరకు వచ్చి.. లేటెస్ట్గా మరో ఈవెంట్లో తన వ్యాఖ్యలపై సారీ చెప్పాడు. ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ ఐపీఎల్ కామెంట్ మీద స్పందించమని అడిగితే.. ఏంటి నువ్వు కూడా హర్టయ్యావా అని నవ్వుతూ మాట్లాడిన అనిల్.. ఈ కామెంట్ విషయంలో తాను కూడా హర్టయ్యానని వ్యాఖ్యానించాడు. తాను కూడా ఐపీఎల్ అభిమానినే అని.. మొన్న ఎవరో డిస్ట్రిబ్యూటర్ సమ్మర్ సీజన్లో సినిమాలు ఆడట్లేదని.. చిన్న సినిమాలకు ఇబ్బంది అవుతోందని అంటే ఆ బాధతో ఆ కామెంట్ చేశానని.. అంతే తప్ప ఎవరినీ హర్ట్ చేయాలని కాదని.. అందరూ ఐపీఎల్ చూడాలని.. మధ్యలో ఖాళీ దొరికితే సినిమాలు చూడాలని అన్నాడు అనిల్. తన కామెంట్ను వెనక్కి తీసుకోవడం ద్వారా అనిల్ లౌక్యంతో వ్యవహరించాడని.. ఇలా నోరు జారినపుడు హుందాగా సారీ చెప్పి వ్యాఖ్యలను సవరించుకోవడం చాలా అవసరమని.. ఈ విషయంలో అనిల్ను చూసి సెలబ్రెటీలు నేర్చుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on May 5, 2024 1:08 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…