ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 ది రూల్ విడుదల కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో మళ్ళీ చెప్పనక్కర్లేదు. తెలుగుతో సమానంగా హిందీలోనూ విపరీతమైన బజ్ తెచ్చుకున్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి బిజినెస్ డీల్స్ క్రేజీగా వస్తున్నాయి. మైత్రి మేకర్స్ ఇంకా ఫైనల్ చేయనప్పటికీ కనీసం వంద కోట్లకు పైగా టేబుల్ ప్రాఫిట్ ఖాయమనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. కెజిఎఫ్ లాగా మొదటి భాగం కంటే సీక్వెలే పెద్ద హిట్ అయితే పుష్ప 2 టార్గెట్ గా పెట్టుకున్న వెయ్యి కోట్ల మార్కు అందుకోవడం అసాధ్యం కాదు.
ఇక ఘనత విషయానికి వస్తే పుష్ప 2 బెంగాలీ భాషలో డబ్బింగ్ కాబోతున్న మొదటి ప్యాన్ ఇండియా మూవీ కానుంది. గతంలో కొన్ని అనువాదం చేసినప్పటికీ సమాంతర రిలీజ్ ఎవరికీ సాధ్యపడలేదు. కానీ పుష్ప 2 అలా కాదు. ఆగస్ట్ 15 అన్ని భాషల్లో ఒకేసారి విడుదలవుతుంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అనువాద వెర్షన్ల కోసమే ప్రత్యేకంగా రెండు నెలలు ఖర్చు పెట్టాడు. సింగర్స్ ని ఎంపిక చేసుకోవడం దగ్గర్నుంచి గీత రచయితలతో కూర్చుని తనకు కావలసినట్టు రాయించుకుని రికార్డింగ్ చేసే వరకు అన్నీ దేవినే చూసుకున్నాడు. మాములుగా డబ్బింగ్ పనులు అసిస్టెంట్లకు చెబుతారు.
దీన్నిబట్టే పుష్ప 2 మీద ఏ స్థాయిలో అందరూ శ్రద్ధాసక్తులతో పని చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఐటెం సాంగ్ పెండింగ్ ఉన్న ఈ స్మగ్లింగ్ డ్రామాకు ముందు టాకీ పార్ట్ ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు సుకుమార్. ఎడతెరపి లేకుండా కొనసాగుతూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడకుండా ఇండిపెండెన్స్ డేకి పుష్పరాజ్ ర్యాంపేజ్ ని చూపించాలని డిసైడైన సుక్కు టీమ్ దానికి తగ్గట్టే అహోరాత్రాలు పని చేస్తోంది. రేపు రిలీజ్ కాబోయే టైటిల్ సాంగ్ మీద ఓ రేంజ్ అంచనాలున్నాయి. ఈ ఒక్క పాట హైప్ ని పదింతలు పైకి తీసుకెళ్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. చూద్దాం.
This post was last modified on April 30, 2024 10:43 am
పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…
తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…
ఏపీలో కూటమి ప్రభుత్వం చేసే ఖర్చులు, తీసుకునే నిర్ణయాలను సమీక్షించి.. నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేకంగా మూడు కమిటీలు ఉంటాయి. ఇది…
ఏపీలో కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించి.. ఏడు మాసాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఫీడ్ బ్యాక్ ఏంటి?…
పాతికేళ్ల క్రితం 2001 సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చిన శ్రియ టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడింది. చిరంజీవి, బాలకృష్ణతో మొదలుపెట్టి ప్రభాస్,…