ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 ది రూల్ విడుదల కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో మళ్ళీ చెప్పనక్కర్లేదు. తెలుగుతో సమానంగా హిందీలోనూ విపరీతమైన బజ్ తెచ్చుకున్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి బిజినెస్ డీల్స్ క్రేజీగా వస్తున్నాయి. మైత్రి మేకర్స్ ఇంకా ఫైనల్ చేయనప్పటికీ కనీసం వంద కోట్లకు పైగా టేబుల్ ప్రాఫిట్ ఖాయమనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. కెజిఎఫ్ లాగా మొదటి భాగం కంటే సీక్వెలే పెద్ద హిట్ అయితే పుష్ప 2 టార్గెట్ గా పెట్టుకున్న వెయ్యి కోట్ల మార్కు అందుకోవడం అసాధ్యం కాదు.
ఇక ఘనత విషయానికి వస్తే పుష్ప 2 బెంగాలీ భాషలో డబ్బింగ్ కాబోతున్న మొదటి ప్యాన్ ఇండియా మూవీ కానుంది. గతంలో కొన్ని అనువాదం చేసినప్పటికీ సమాంతర రిలీజ్ ఎవరికీ సాధ్యపడలేదు. కానీ పుష్ప 2 అలా కాదు. ఆగస్ట్ 15 అన్ని భాషల్లో ఒకేసారి విడుదలవుతుంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అనువాద వెర్షన్ల కోసమే ప్రత్యేకంగా రెండు నెలలు ఖర్చు పెట్టాడు. సింగర్స్ ని ఎంపిక చేసుకోవడం దగ్గర్నుంచి గీత రచయితలతో కూర్చుని తనకు కావలసినట్టు రాయించుకుని రికార్డింగ్ చేసే వరకు అన్నీ దేవినే చూసుకున్నాడు. మాములుగా డబ్బింగ్ పనులు అసిస్టెంట్లకు చెబుతారు.
దీన్నిబట్టే పుష్ప 2 మీద ఏ స్థాయిలో అందరూ శ్రద్ధాసక్తులతో పని చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఐటెం సాంగ్ పెండింగ్ ఉన్న ఈ స్మగ్లింగ్ డ్రామాకు ముందు టాకీ పార్ట్ ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు సుకుమార్. ఎడతెరపి లేకుండా కొనసాగుతూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడకుండా ఇండిపెండెన్స్ డేకి పుష్పరాజ్ ర్యాంపేజ్ ని చూపించాలని డిసైడైన సుక్కు టీమ్ దానికి తగ్గట్టే అహోరాత్రాలు పని చేస్తోంది. రేపు రిలీజ్ కాబోయే టైటిల్ సాంగ్ మీద ఓ రేంజ్ అంచనాలున్నాయి. ఈ ఒక్క పాట హైప్ ని పదింతలు పైకి తీసుకెళ్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. చూద్దాం.
This post was last modified on April 30, 2024 10:43 am
సుధీర్ బాబు గంపెడాశలు పెట్టుకున్న హరోంహర విడుదల వాయిదా పడింది. మే 31 నుంచి జూన్ 14కి వెళ్తున్నట్టు అధికారికంగా…
నాలుగేళ్ల క్రితం చేసిన రక్షణ అనే సినిమా నిర్మాతలు ప్రమోషన్ కోసం తనను వేధిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తూ హీరోయిన్…
రాజకీయాల్లో అన్ని వేళలా పంతమే పనికిరాదు. ఒక్కొక్కసారి పట్టు విడుపులు కూడా ముఖ్యమే. ఈ విషయంలో నాయకులు, పార్టీలు కూడా..…
హనుమాన్ రూపంలో 2024లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ వర్మ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్…
ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది అధికారులు, పోలీసు ఆఫీసర్లకు రెడ్బుక్ భయం పట్టుకుందనే చర్చ హాట్టాపిక్గా మారింది. ఇన్ని రోజులు అధికార వైసీపీ…
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఉన్న రవాణశాఖ అధికారి కార్యాలయం జాక్ పాట్ కొట్టింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ఒక…