ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 ది రూల్ విడుదల కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో మళ్ళీ చెప్పనక్కర్లేదు. తెలుగుతో సమానంగా హిందీలోనూ విపరీతమైన బజ్ తెచ్చుకున్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి బిజినెస్ డీల్స్ క్రేజీగా వస్తున్నాయి. మైత్రి మేకర్స్ ఇంకా ఫైనల్ చేయనప్పటికీ కనీసం వంద కోట్లకు పైగా టేబుల్ ప్రాఫిట్ ఖాయమనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. కెజిఎఫ్ లాగా మొదటి భాగం కంటే సీక్వెలే పెద్ద హిట్ అయితే పుష్ప 2 టార్గెట్ గా పెట్టుకున్న వెయ్యి కోట్ల మార్కు అందుకోవడం అసాధ్యం కాదు.
ఇక ఘనత విషయానికి వస్తే పుష్ప 2 బెంగాలీ భాషలో డబ్బింగ్ కాబోతున్న మొదటి ప్యాన్ ఇండియా మూవీ కానుంది. గతంలో కొన్ని అనువాదం చేసినప్పటికీ సమాంతర రిలీజ్ ఎవరికీ సాధ్యపడలేదు. కానీ పుష్ప 2 అలా కాదు. ఆగస్ట్ 15 అన్ని భాషల్లో ఒకేసారి విడుదలవుతుంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అనువాద వెర్షన్ల కోసమే ప్రత్యేకంగా రెండు నెలలు ఖర్చు పెట్టాడు. సింగర్స్ ని ఎంపిక చేసుకోవడం దగ్గర్నుంచి గీత రచయితలతో కూర్చుని తనకు కావలసినట్టు రాయించుకుని రికార్డింగ్ చేసే వరకు అన్నీ దేవినే చూసుకున్నాడు. మాములుగా డబ్బింగ్ పనులు అసిస్టెంట్లకు చెబుతారు.
దీన్నిబట్టే పుష్ప 2 మీద ఏ స్థాయిలో అందరూ శ్రద్ధాసక్తులతో పని చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఐటెం సాంగ్ పెండింగ్ ఉన్న ఈ స్మగ్లింగ్ డ్రామాకు ముందు టాకీ పార్ట్ ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు సుకుమార్. ఎడతెరపి లేకుండా కొనసాగుతూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడకుండా ఇండిపెండెన్స్ డేకి పుష్పరాజ్ ర్యాంపేజ్ ని చూపించాలని డిసైడైన సుక్కు టీమ్ దానికి తగ్గట్టే అహోరాత్రాలు పని చేస్తోంది. రేపు రిలీజ్ కాబోయే టైటిల్ సాంగ్ మీద ఓ రేంజ్ అంచనాలున్నాయి. ఈ ఒక్క పాట హైప్ ని పదింతలు పైకి తీసుకెళ్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. చూద్దాం.
This post was last modified on April 30, 2024 10:43 am
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…