అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో ఒకప్పుడు విజయ్ దేవరకొండ చూసింది మామూలు రైజ్ కాదు. మెగాస్టార్ చిరంజీవి సైతం తాను స్టార్ కావడానికి చాలా ఏళ్లు ఎదురు చూశానని.. కానీ విజయ్ మాత్రం తక్కువ టైంలో చాలా పెద్ద రేంజికి ఎదిగిపోయాడని కితాబిచ్చాడు అప్పట్లో. కానీ ఈ ఫాలోయింగ్ను విజయ్ కాపాడుకోలేకపోయాడు. వరుస ఫ్లాపులు ఫ్యాన్ ఫాలోయింగ్తో పాటు మార్కెట్నూ దెబ్బ తీసేశాయి.
విజయ్ చివరి చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’కు ఓపెనింగ్స్ కరవయ్యాయి. బ్యాడ్ టాక్ రావడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఇప్పుడు అతడి ఆశలన్నీ గౌతమ్ తిన్ననూరితో చేయనున్న సినిమా మీద ఉన్నాయి. దీంతో పాటుగా అతను మరో చిత్రం కూడా చేస్తున్నాడు. అది ‘ఫ్యామిలీ స్టార్’ను ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజు బేనర్లోనే కావడం గమనార్హం.
‘రాజావారు రాణి వారు’తో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ మూవీకి స్క్రిప్టు అందించిన రవికిరణ్ కోలా.. విజయ్ కొత్త చిత్రాన్ని రూపొందించనున్నాడు. ‘ఫ్యామిలీ స్టార్’ తరహాలో హడావుడి లేకుండా సైలెంటుగా స్క్రిప్టు పూర్తి చేసుకుని ప్రొడక్షన్కు వెళ్లబోతోందీ చిత్రం. కాంబినేషన్ క్రేజ్ కంటే కంటెంట్ మీద ఫోకస్ పెడుతోందట దిల్ రాజు టీం.
ఈ సినిమాకు ఆల్రెడీ టైటిల్ కూడా ఖరారైనట్లు సమాచారం. ‘రౌడీ జనార్దన్’ అనే పేరును ఓకే చేస్తున్నారట. ‘రౌడీ’ అనేది విజయ్ను అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు. ఆ పేరుతో మెన్స్ వేర్ బ్రాండును కూడా తీసుకొచ్చాడు విజయ్. ఇప్పుడు తన సినిమా టైటిల్గానూ ‘రౌడీ’ని వాడుకోబోతున్నాడట. మరి ఆ టైటిల్ విజయ్ కోరుకుంటున్న సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.
This post was last modified on April 29, 2024 5:03 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…